Maharashtra: శివసేన 53 ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేనకు సంబంధించి మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 53 మంది ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి రాజేంద్ర భగవత్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో నోటీసులపై స్పందించాలన్నారు. నోటీసులు అందుకున్న వారిలో సీఎం ఏకనాథ్ షిండే క్యాంపులోని 39 మంది ఎమ్మెల్యేలకు, ఉద్ధవ్ ఠాక్రేలోని 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు మాత్రం నోటీసులు ఇవ్వలేదు.
ఇటీవల రెండు వర్గాలు పరస్పరం అనర్హత వేటు వేయాలని కోరుతూ ఫిర్యాదు చేసుకున్నాయి. జూలై3, 4 తేదీల్లో స్పీకర్ ఎన్నిక, బల నిరూపణ సందర్భంగా ఇరు వర్గాల విప్ ధిక్కరించినట్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఫిరాయింపు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఏడు రోజుల్లో శాసన సభ్యులు వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి కోరారు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
Read Also: CM KCR: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
మొత్తం 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఒక శాసనసభ్యుడు మరణించాడు, దీంతో మెజారిటీకి 144 ఎమ్మెల్యేలు అవసరం కాగా ఇటీవల జరిగిన అవిశ్వాస పరీక్షలో ఏక్ నాథ్ షిండేకు 164 ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. వ్యతిరేకంగా 99 మంది ఓటేశారు. ఈ సమయంలో షిండే వర్గం నియమించిన ప్రభుత్వ విప్ భరత్ గోగావాలే జారీ చేసిన విప్ ను ధిక్కరించారని ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలకు షిండే వర్గం నోటీసులు జారీ చేసింది. విశ్వాస పరీక్షకు ఒక రోజు ముందు రాహుల్ నార్వేకర్, శివసేన విప్ గా షిండే వర్గానికి చెందిన భరత్ గోగావాలే నియమించి.. ఠాక్రే వర్గానికి చెందిన సునీల్ ప్రభును తొలగించారు.
తాజావార్తలు
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!