CM KCR: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. సమ్మక్క బ్యారేజీ వద్ద 9 లక్షల క్యూసెక్కుల నీరు పోతుందని ఆయన అన్నారు. తెల్లారే సరికి ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నిండిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయని, విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఎయిర్ ఫోర్స్ వారితో మాట్లాడి హెలికాప్టర్లను కూడా సిద్ధం చేయాలని కోరామని సీఎం వెల్లడించారు. రాబోయే మూడు రోజులు బుధవారం వరకు అన్ని రకాల విద్యా సంస్థలు మూసేయడం జరిగిందని ఆయన అన్నారు.
రోడ్లు, కల్వర్టలపై ప్రయాణించే సమయంలో ప్రమాదాలు సంభవించే అధికారం ఉందని.. అలాంటివి చేయకుండా ఇప్పటికే ఆర్టీసీకి ఆదేశాలు జారీ చేశామని అన్నారు. కొన్ని పాత ఇళ్లను రాష్ట్రంలో కూలగొట్టామని.. కొన్ని కోర్టు స్టేల్లో ఉన్నాయని.. అలాంటి ఇళ్లలో ప్రజలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోెవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. బోధన్ నియోజకవర్గం, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురిశాయని ఆయన అన్నారు. ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కేసీఆర్ కోరారు.
Also Read
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
Read Also: Vonteru Pratap Reddy: ముందు నువ్వు హుజూరాబాద్ లో గెలిచి ఉనికి చాటుకో..
ఎమ్మెల్యేలు, మంత్రులు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించామని.. కలెక్టర్లు, ఎస్పీలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని వెల్లడించారు. 10 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే వాజేడు, మంగపేట, ఏటూర్ నాగారం మండలాల్లో గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. అక్కడ కూడా తగిన చర్యలు తీసుకున్నామని సీఎం వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ టీములను కొత్తగూడెం, నిజామాబాదుల్లో మోహరించామని వెల్లడించారు. ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలని.. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా సర్పంచు నుంచి మంత్రి వరకు ఎక్కడి వారు అక్కడ యాక్టివ్ గా ఉండాలని కోరారు.
నల్లగొండలో శ్రీకాకుళం వ్యక్తులు ఇద్దరు గోడ కూలి మరణించారని.. వారికి రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించామని కేసీఆర్ వెల్లడించారు. సెక్రటేరియట్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బీలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని ఎక్కడ ఏ సమస్య వచ్చినా కంట్రోల్ రూంలకు ఫోన్ చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!