Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
- బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం..
- విశాఖతో సహా, ఏపీలో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో ఆదివారం భూకంపం సంభవించింది. భూకంపం వల్ల ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. విశాఖపట్నం సహా పొరుగున ఉన్న అన్ని జిల్లాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉదయం 5.05 గంటల ప్రాంతంలో వైజాగ్లో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. గాజువాక, మంగళపాలెం, సాగర్ నగర్, పెద్ద వాల్తేరు, అరిలోవ, ఎంవీపీ కాలనీలతో సహా ఇతర ప్రాంతాల్లో ప్రకంపలు ప్రభావం కనిపించింది.
ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున బంగాళాఖాతంలో రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించినట్లు తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (భూకంప పరిశోధన కేంద్రం) తెలిపిన వివరాల ప్రకారం, ఈ భూకంపం ఉదయం 5:05:46 గంటలకు (IST) 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీని కేంద్రబిందువు బంగాళాఖాతంలోని కాకినాడ తీరానికి సుమారు 225 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంప కేంద్రం 16.805 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 84.381 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది.
Also Read
- Uday Krishna Reddy: నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఆరోపణలు అన్నీ అవాస్తవం.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా!
- DSC irregularities: దమ్ముంటే చర్చకు రా.. మంత్రి లోకేష్కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్!
- Mega DSC: 'మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ'.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్!
- AP Weather Update: తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు!
భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు. అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు సంభవించిట్లు సమాచారం. తక్కువ లోతులో సంభవించిన భూకంపంగా నిపుణులు దీనిని చెబుతున్నారు. భూగర్బ నిర్మాణాల్లో సర్దుబాట్ల కారణంగా ఈ ప్రకంపనలు స్వల్పంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
తాజావార్తలు
-
Pakistan: మరో గల్ఫ్ దేశంతో పాక్ రక్షణ ఒప్పందం.. కన్నేసుంచిన భారత్
-
Istamart CEO: ఇన్స్టామార్ట్ సీఈఓ రాజీనామా.. భారీగా పెరిగిన స్విగ్గీ షేర్లు..
-
Earthquake: జపాన్లో 7.1తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
-
Johnson & Johnson: వేల కోట్ల సెటిల్మెంట్కి రెడీ అయిన ప్రపంచ దిగ్గజ కంపెనీ.. అక్షరాల రూ.52 వేల కోట్లు ఇవ్వడానికి డీల్!
-
Allu Arjun: హేటర్స్కు అల్లు అర్జున్ స్ట్రాంగ్ మెసేజ్.. ఏం చెప్పాడు భయ్యా!
ట్రెండింగ్
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!