Venu Goapl Reddy
Author- NTV Telugu-
Army Dog: విషమంగా ఆర్మీడాగ్ ఆరోగ్యం.. ఉగ్రవాదులతో తలపడి తీవ్రంగా గాయపడ్డ “జూమ్”
Next 48 Hours Critical For Army Dog: అనంత్నాగ్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో గాయపడిన ఆర్మీ డాగ్ ‘జూమ్’ పరిస్థితి విషమంగానే ఉందని.. మరో 24-48 గంటలు గడిస్తే కానీ పరిస్థితిని చెప్పలేమని.. వైద్య బృందం చికిత్స అందిస్తోందని భారత ఆర్మీ అధికారులు బుధవారం వెల్లడించారు. ఆర్మీ డాగ్ జూమ్ కు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ప్రస్తుతం ఆర్మీ డాగ్ పరిస్థితి నిలకడగా ఉంది. వెనకాలు విరగడంతో పాటు ముఖంపై గాయాలకు చికిత్స చేశారు డాక్టర్లు. తదుపరి 24-48 గంటలు క్లిష్టమైనవని.. భారత… -
Supreme Court: ప్రార్థనా స్థలాల చట్టంపై కేంద్రానికి మరో రెండు వారాల గడువు..
SC grants Centre two more weeks to file response on pleas challenging Places of Worship Act 1991: ప్రార్థనా స్థలాల చట్టం-1991లోని నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించేందుకు కేంద్రానికి మరో రెండు వారాలు గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. అక్టోబర్ 31 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. నవంబర్ 14న విచారణను వాయిదా వేసింది. 1991 ప్రార్థన స్థలాల చట్టంలోని కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా పలువురు వ్యక్తులు పిటిషన్లు దాఖలు చేశారు. -
Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ వేర్పాటువాదిపై భారత్ అభ్యర్థనను తిప్పిపంపిన ఇంటర్పోల్
Interpol Sent Back India's Request For Notice Against Khalistan Separatist: ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై భారత్ చేసిన అభ్యర్థనను ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్(ఇంటర్పోల్) తిప్పిపంపింది. పన్నూపై ఉగ్రవాద ఆరోపణల నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీస్ కోసం భారతదేశం అభ్యర్థించింది. అయితే ఈ అభ్యర్థనను ఇంటర్పోల్ తిప్పిపంపినట్లు తెలుస్తోంది. సీబీఐ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్ని ఇన్పుట్లను సమర్పించింది. అయితే ఇంటర్పోల్ ప్రశ్నలను లేవనెత్తింది. -
Muzaffarnagar Riots Case: ముజఫర్నగర్ అల్లర్ల కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష
BJP MLA Gets 2 Years In Jail In Muzaffarnagar Riots Case: ముజఫర్నగర్ అల్లర్ల కేసులో ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మంగళవారం ఈ కేసును విచారించిన కోర్టు బీజేపీ ఎమ్మెల్యేకు విక్రమ్ సైనీతో పాటు 11 మందికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి గోపాల్ ఉపాధ్యాయ అల్లర్లకు పాల్పడినందుకు ఇతర నేరాలకు కలిపి మొత్తం 11 మందిని దోషులుగా నిర్థారించారు. జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 10,000 జరిమానా విధించారు. -
Allahabad High Court: మొదటి భార్యను చూసుకోలేని ముస్లిం వ్యక్తికి రెండో పెళ్లి చేసుకునే హక్కు లేదు.
Allahabad High Court verdict on second marriage of Muslim man: ముస్లిం వ్యక్తి రెండో వివాహంపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మొదటి భార్య, ఆమె సంతానాన్ని చూసుకోలేని ముస్లిం వ్యక్తికి రెండో పెళ్లి చేసుకునే హక్కు లేదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఒక ముస్లిం వ్యక్తి తన భార్య, పిల్లలను చూసుకోకపోతే, ఖురాన్ అతన్ని రెండవ వివాహం చేసుకోవడానికి అనుమతించదని తీర్పు వెల్లడించింది. మొదటి భార్య అనుమతి లేకుండా రెండో వివాహాం చేసుకున్న వ్యక్తి మొదటి భార్యను శిక్షించడమే… -
Supreme Court: “తలాక్-ఎ-హసన్”పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
Supreme Acceptance of Trial on Talaq-e-Hasan Divorce: ఏకపక్ష చట్టవిరుద్ధమైన విడాకులు, తలాక్-ఎ-హసన్ వంటి విడాకులు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. తలాక్-ఎ-హసన్ అనేది ఇస్లాంలో విడాకులకు ఓ రూపం. దీని ద్వారా పెళ్లయిన పురుషుడు తన భార్యకు ప్రతీ నెల ‘తలాక్’ పదాన్ని చెప్పడం ద్వారా వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. -
PM Narendra Modi:ఉజ్జయిని “మహాకాల్ లోక్ కారిడార్”ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
PM Narendra modi dedicates Shri Mahakal Lok to the nation: మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకాల్ లోక్ కారిడార్ మొదటి దశలను ప్రారంభించే ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాంప్రదాయ వస్త్రధారణలో 12 జ్యోతిర్లాంగాల్లో ఒకటైన మహాకాలేశ్వర్ ఆలయ గర్భగుడిలో పూజలు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియాలు ప్రధాని మోదీ వెంట ఉన్నారు. -
India Economic Growth: భారత వృద్ధిరేటును తగ్గించిన ఐఎంఎఫ్.. ప్రపంచ మాంద్యం తప్పదా..?
IMF reduced India's economic growth: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) భారత వృద్ధిరేటును తగ్గించింది. 2022లో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాను మంగళవారం 7.4 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది. ఏప్రిల్ 2022 ఆర్థిక సంవత్సర ప్రారంభంలో ఐఎంఎఫ్ భారతదేశ ఎకనామిక్ గ్రోత్ రేట్ ను 7.4గా ఉండవచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది జనవరిలో 2022 వృద్ధిరేటు 8.2 శాతంగా ఉంటుందని అంచానా వేసింది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భారత వృద్ధిరేటును క్రమంగా తగ్గిస్తూ వస్తోంది ఐఎంఎఫ్. -
Pakistan: భారత్తో సంబంధాలు లేవంటూనే.. దిక్కులేక వాటిని కొనుగోలు చేస్తున్న పాకిస్తాన్
Pakistan is buying 60 lakh mosquito nets from India: పీకల్లోతు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా భారత వ్యతిరేకతను వీడటం లేదు పాకిస్తాన్. భారతదేశంలో ఎలాంటి వాణిజ్య సంబంధాలు పెట్టుకోమని చెబుతోంది. కాశ్మీర సమస్యకు పరిష్కారం లభించేంత వరకు, ఆర్టికల్ 370 పునుద్ధరించే వరకు తాము భారత్ తో సంబంధాలు పెట్టుకోమని అంటోంది. దీంతో అక్కడ టొమోటో, ఆలు వంటి నిత్యావసర ధరలు కొండేక్కాయి. కిలోకి రూ. 100కు పైగా ధరలు చేరాయి. భారత్ నుంచి… -
Eknath Shinde: ఏక్నాథ్ షిండే వర్గానికి గుర్తు కేటాయించిన ఈసీ.. గుర్తు ఏంటంటే..?
EC allots the 'Two Swords And Shield symbol' to Eknath Shinde Shiv Sena: శివసేన పార్టీ రెండు వర్గాలుగా చీలిన సంగతి తెలిసిందే. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏక్ నాథ్ షిండే వర్గంతోనే ఉన్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే మాత్రం అసలైన శివసేన తమదే అంటోంది. ఈ వ్యవహారంపై ఇటీవల సుప్రీంకోర్టు, ఈ వ్యవహారంపై అంతిమ నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘానిదే అని చెప్పింది. నవంబర్ నెలలో అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో…
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!