Ajay Mishra: రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union minister Ajay mishra Controversial comments on Farmers:కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. తన కార్యకర్తలతో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతో పాటు రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఆందోళన చేస్తున్న రైతులన్ని కుక్కలతో పోల్చడంతో పాటు.. రైతు నేత రాకేష్ టికాయత్ ను బీ గ్రేడ్ వ్యక్తిగా అభివర్ణించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై ఒక్కసారిగా విమర్శలు చెలరేగాయి. తనపై వస్తున్న విమర్శలు తప్పని తన సహచరులతో మాట్లాడుతున్న సందర్భంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయాందోళనకు గురైన ప్రజలు
Also Read
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
నేను లక్నోకు కారులో వేగం వెళ్తున్నాను అనుకోండి..కుక్కలు అరుస్తాయి.. కారు వెంటపడుతాయి.. అది వాటి అలవాటు అని అన్నారు. మాకు అలాంటి అలవాటు లేదని కాబట్టి వాటి గురించి మేము ఎక్కువగా మాట్లాడమని అన్నారు. మీ మద్దతు వల్లే నేను ధైర్యంగా ఉన్నానని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ప్రజలు ఎప్పుడూ ప్రశ్నల్ని లేవనెత్తుతుంటారని.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జర్నలిస్టులు వారికి మద్దతుగా నిలిచి గందరగోళానికి గురిచేస్తారని వ్యాఖ్యానించారు. రాకేష్ టికాయత్ గురించి నాకు బాగా తెలుసని.. ఆయన ఓ బీ గ్రేడ్ వ్యక్తి అని.. అలాంటి వారు చేసే వ్యాఖ్యలకు విలువ ఉండదని.. గతంలో రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని.. అలాంటి వ్యక్తుల అడిగే ప్రశ్నలకు బదులు ఇవ్వనిని కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై రాకేష్ టికాయత్ స్పందించారు. కొడుకు జైలుకు వెళ్లిన ఆక్రోశంలో ఉన్న ఆయన ఇలా మాట్లాడటం సాధారణమే అని అన్నారు.
గతేడాది కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేశారు. అయితే ఆ సయమంలో యూపీలో లఖీంపూర్ ఖేరీ ఘటన జరిగింది. కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా ఆందోళన చేస్తున్న రైతులపైకి వాహనాలను వేగంగా నడిపి నలుగురు రైతులు చనిపోయిన ఘటనకు కారణం అయ్యాడు. ఈ ఘటనలో నలుగురు రైతులతో పాటు మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ ఘటన కోర్టులో విచారణలో ఉంది.
Farmer leader @RakeshTikaitBKU is a ‘second rate person’ ; ‘Dogs bark on the side of the road, have nothing to say about them’ – the words of Union minister @ajaymishrteni at a speech in his constituency Lakhimpur Kheri live streamed by his supporters yesterday. pic.twitter.com/96rZTqxqPH
— Alok Pandey (@alok_pandey) August 23, 2022
తాజావార్తలు
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
-
Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!