Ajay Mishra: రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union minister Ajay mishra Controversial comments on Farmers:కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. తన కార్యకర్తలతో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతో పాటు రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఆందోళన చేస్తున్న రైతులన్ని కుక్కలతో పోల్చడంతో పాటు.. రైతు నేత రాకేష్ టికాయత్ ను బీ గ్రేడ్ వ్యక్తిగా అభివర్ణించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై ఒక్కసారిగా విమర్శలు చెలరేగాయి. తనపై వస్తున్న విమర్శలు తప్పని తన సహచరులతో మాట్లాడుతున్న సందర్భంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయాందోళనకు గురైన ప్రజలు
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
నేను లక్నోకు కారులో వేగం వెళ్తున్నాను అనుకోండి..కుక్కలు అరుస్తాయి.. కారు వెంటపడుతాయి.. అది వాటి అలవాటు అని అన్నారు. మాకు అలాంటి అలవాటు లేదని కాబట్టి వాటి గురించి మేము ఎక్కువగా మాట్లాడమని అన్నారు. మీ మద్దతు వల్లే నేను ధైర్యంగా ఉన్నానని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ప్రజలు ఎప్పుడూ ప్రశ్నల్ని లేవనెత్తుతుంటారని.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జర్నలిస్టులు వారికి మద్దతుగా నిలిచి గందరగోళానికి గురిచేస్తారని వ్యాఖ్యానించారు. రాకేష్ టికాయత్ గురించి నాకు బాగా తెలుసని.. ఆయన ఓ బీ గ్రేడ్ వ్యక్తి అని.. అలాంటి వారు చేసే వ్యాఖ్యలకు విలువ ఉండదని.. గతంలో రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని.. అలాంటి వ్యక్తుల అడిగే ప్రశ్నలకు బదులు ఇవ్వనిని కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై రాకేష్ టికాయత్ స్పందించారు. కొడుకు జైలుకు వెళ్లిన ఆక్రోశంలో ఉన్న ఆయన ఇలా మాట్లాడటం సాధారణమే అని అన్నారు.
గతేడాది కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేశారు. అయితే ఆ సయమంలో యూపీలో లఖీంపూర్ ఖేరీ ఘటన జరిగింది. కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా ఆందోళన చేస్తున్న రైతులపైకి వాహనాలను వేగంగా నడిపి నలుగురు రైతులు చనిపోయిన ఘటనకు కారణం అయ్యాడు. ఈ ఘటనలో నలుగురు రైతులతో పాటు మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ ఘటన కోర్టులో విచారణలో ఉంది.
Farmer leader @RakeshTikaitBKU is a ‘second rate person’ ; ‘Dogs bark on the side of the road, have nothing to say about them’ – the words of Union minister @ajaymishrteni at a speech in his constituency Lakhimpur Kheri live streamed by his supporters yesterday. pic.twitter.com/96rZTqxqPH
— Alok Pandey (@alok_pandey) August 23, 2022
తాజావార్తలు
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!