Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితదే ముఖ్యపాత్ర.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi liquor Scam..Allegations on MLC Kavita: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్కామ్ లింకులు బయటపడుతున్నాయి. తాజాగా కేంద్ర బీజేపీ నాయకులు ఈ స్కామ్ లో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, ఈ స్కామ్ లో సీఎం కేసీఆర్ కుటుంబం ఉందని ఆరోపించారు. ఈ లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్ కుమార్తె కవితదే ముఖ్యపాత్ర అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీతో పాటు లిక్కర్ మాఫియా నుంచి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు రూ. 150 కోట్లు అందాయని సంచలన అన్నారు. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్ లో ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించారని… ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్, ఇతర ఎక్సైజ్ అధికారులతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఓబెరాయ్ హోటల్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం ప్రైవేట్ విమానంలో ఢిల్లీకి వచ్చేవారని..దీనికి తెలంగాణకు చెందిన లిక్కర్ మాఫియా సహకరించేదని ఆరోపించారు.
Read Also: KTR On Bandi Sanjay: అమిత్ షాకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా ?
Also Read
- EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
- Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబంలోని పలువురు ఈ లిక్కర్ మాఫియాలో భాగస్వాములు ఉన్నారని వ్యాఖ్యానించారు. సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇద్దరు కలిసి ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారని అన్నారు. తెలంగాణలో కూడా ఇలాంటి మద్య విధానమే ఉందని.. పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి విధానాన్నే అమలు చేస్తున్నారని.. ఎంపీ పర్వేజ్ వర్మ అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఎల్1 లైసెన్సు హోల్డర్లని ఆరోపించారు.
మద్యం మాఫియాను దక్షిణాది నుంచి ఢిల్లీకి తీసుకువచ్చింది కేసీఆర్ కూతురు కవితే అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. రెడ్డి బ్రదర్స్ ను కూడా తీసుకువచ్చిందని ఆయన అన్నారు. కవిత ఢిల్లీకి వచ్చి రూ.4.5 కోట్లతో డీల్ కుదిర్చారని అన్నారు. ఆప్ పంజాబ్, గోవా ఎన్నికల సందర్భంగా అడ్వాన్సుగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. పంజాబ్ లో లిక్కర్ ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయించారని.. చద్ధా ఫ్యామిలీ నుంచి రూ. 4.5 కోట్లు ముట్టాయని ఆయన వ్యాఖ్యానించారు. రూ. 3 కోట్లు నగదు, రూ.1.5 కోట్ల క్రెడిట్ నోట్ తీసుకున్నారని అన్నారు. ఇదంతా కేసీఆర్ కూతురు కవిత ద్వారానే జరిగిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!