COVID 19: దేశంలో భారీగా తగ్గిన కరోనా .. 10 వేల దిగువకు కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CORONA CASES IN INDIA:దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత వారం రోజూవారీ కేసుల సంఖ్య సగటున 15 వేలకు పైగా నమోదు అయ్యేది. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో కేవలం 9,531 కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 36 మంది మరణించారు. 11,726 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 97,648కు చేరింది.
దేశంలో కరోనా కేసులు ప్రారంభం అయిన రెండున్నరేళ్లలో ఇప్పటి వరకు 4,43,48,960 కరోనా కేసులు నమోదు అయితే వీరిలో 4,37,23,944 మంది కోలుకోగా.. మరణించిన వారి సంఖ్య 5,27,368కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.59 ఉండగా.. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.22గా ఉంది. రోజూవారీ పాజిటివిటీ రేటు 4.15 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 36 మంది మరణిస్తే ఒక్క కేరళలోనే కరోనాతో 10 మంది చనిపోయారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ నుండి నలుగురు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, మణిపూర్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ మరియు హర్యానా నుండి ఇద్దరు చొప్పున మరణించారు.
Also Read
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
- Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
- Amul milk: సామాన్యుడి జేబుకు 'అముల్' చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
Read Also: Pakistan: దైవదూషణ చేశాడంటూ హిందువుపై దాడి..
ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా ప్రపంచానికి అందనంత ఎత్తులో ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 210.02 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో 35,33,466 మందికి వ్యాక్సినేషన్ చేశారు. గడిచిన 24 గంటల్లో 2,29,546 పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు మొత్తం 88.27 కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కేసులను పరిశీలిస్తే.. కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. నిన్న ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా 5,51,288 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 60,08,28,427 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. 64,71,809 మంది మహమ్మారి వల్ల మరణించారు. 57,50,66,049 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజావార్తలు
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
-
Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
-
Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!