COVID 19: దేశంలో భారీగా తగ్గిన కరోనా .. 10 వేల దిగువకు కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CORONA CASES IN INDIA:దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత వారం రోజూవారీ కేసుల సంఖ్య సగటున 15 వేలకు పైగా నమోదు అయ్యేది. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో కేవలం 9,531 కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 36 మంది మరణించారు. 11,726 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 97,648కు చేరింది.
దేశంలో కరోనా కేసులు ప్రారంభం అయిన రెండున్నరేళ్లలో ఇప్పటి వరకు 4,43,48,960 కరోనా కేసులు నమోదు అయితే వీరిలో 4,37,23,944 మంది కోలుకోగా.. మరణించిన వారి సంఖ్య 5,27,368కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.59 ఉండగా.. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.22గా ఉంది. రోజూవారీ పాజిటివిటీ రేటు 4.15 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 36 మంది మరణిస్తే ఒక్క కేరళలోనే కరోనాతో 10 మంది చనిపోయారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ నుండి నలుగురు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, మణిపూర్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ మరియు హర్యానా నుండి ఇద్దరు చొప్పున మరణించారు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
Read Also: Pakistan: దైవదూషణ చేశాడంటూ హిందువుపై దాడి..
ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా ప్రపంచానికి అందనంత ఎత్తులో ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 210.02 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో 35,33,466 మందికి వ్యాక్సినేషన్ చేశారు. గడిచిన 24 గంటల్లో 2,29,546 పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు మొత్తం 88.27 కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కేసులను పరిశీలిస్తే.. కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. నిన్న ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా 5,51,288 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 60,08,28,427 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. 64,71,809 మంది మహమ్మారి వల్ల మరణించారు. 57,50,66,049 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!