Venu Goapl Reddy
Author- NTV Telugu-
CM Hemant Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ కు బిగ్ షాక్.. అనర్హతకు ఈసీ సిఫారసు..
Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నేత, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ కు షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. తనకు తాను మైనింగ్ లీజును పొడగించడం ద్వారా ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించినందుకు ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ చేసిన అభ్యర్థనపై ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ కు పంపింది. ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని సీల్డ్ కవర్ లో పంపినట్లు జార్ఖండ్ రాజ్ భవన్ వర్గాలు వెల్లడించారు. -
Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు.. దోషుల విడుదలపై గుజరాత్ ప్రభుత్వ స్పందన కోరిన సుప్రీంకోర్టు
Supreme Court On Bilkis Bano Case: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషులను విడుదల చేయడంతో ప్రతిపక్షాలు గుజరాత్ ప్రభుత్వం, బీజేపీ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఏకంగా ప్రధాని నరేంద్రమోదిని టార్గెట్ చేశారు. ఎర్రకోటపై మహిళ గౌరవం గురించి మాట్లాడిన 24 గంటల్లో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాాల్పడిన వ్యక్తుల్ని విడుదల చేయడాన్ని విమర్శించారు. ఇలా చేయడం ద్వారా భారత మహిళలకు ఏ సందేశం ఇస్తున్నారంటూ విమర్శించారు. -
Pegasus Spyware Case: ఎలాంటి పెగాసస్ స్పైవేర్ గుర్తించలేదు.. విచారణకు కేంద్రం సహకరించలేదు
Supreme Court On Pegasus Spyware Case: దేశ రాజకీయాలకు ఓ కుదుపుకుదిపేసి పెగాసస్ స్పైవేర్ పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ తన రిపోర్టును ఈ రోజు సుప్రీంకోర్టుకు అందచేసింది. దీనిపై సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారించింది. 29 ఫోన్లను పరిశీలించగా.. 5 ఫోన్లలో మాల్వేర్లు గుర్తించామని..అయితే పెగాసస్ స్పైవేర్ కు సంబంధించి ఎలాంటి రుజువు లేదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. అయితే ఈ విచారణ సమయంలో భారత ప్రభుత్వం తమకు సహకరించలేదని కమిటీ… -
PM Security Breach Case: ప్రధాని భద్రతా వైఫల్యంలో పంజాబ్ ఎస్ఎస్పీదే బాధ్యత: సుప్రీంకోర్టు
supreme court on PM Security Breach Case: ఈ ఏడాది పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెక్యూరిటీ వైఫల్యం తలెత్తింది. పంజాబ్ ఫిరోజ్ పూర్ పర్యటనలో ఉండగా.. పంజాబ్ ప్రభుత్వం తగిన భద్రత కల్పించలేదనే విమర్శలు వచ్చాయి. ప్రధాన మంత్రి వంటి హైప్రొఫైల్ వ్యక్తి కాన్వాయ్ కొంతసేపు ఓ ఫ్లై ఓవర్ పై నిలిచిపోయింది. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఈ విషయం విచారణ కోసం రైటైర్డ్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా నేతృత్వంలో… -
Supreme Court: నేడు సుప్రీం కోర్టు ముందుకు హై ప్రొఫైల్ కేసులు..
Pegasus, PMLA, Bilkis Bano Among Big Cases Set For Hearing in supreme court Today: సుప్రీం కోర్టు ముందుకు నేడు కీలక కేసులు విచారణకు రానున్నాయి. దేశంలో ప్రముఖంగా ఉన్న బిల్కిస్ బానో కేసు నుంచి తీస్తా సెతల్వాడ్ కేసు, మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ), పెగాసస్ స్పైవేర్ కేసు, ప్రధాన మంత్రి సెక్యూరిటీ లోపాలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. -
COVID 19: దేశంలో 10 వేలకు పైగా కరోనా కేసులు.. పెరిగిన రికవరీలు
corona cases in india: దేశంలో కరోనా కేసుల నమోదు స్థిరంగా సాగుతోంది. గతంలో పోలిస్తే కాస్త తక్కువగానే కేసులు సంఖ్య నమోదు అవుతోంది. రెండు వారాల క్రితం వరకు దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైగా ఉండేది. అయితే ఇటీవల కాలంలో డైలీ కేసులు 10 వేలకు అటూ ఇటూగా నమోదు అవుతున్నాయి. కోవిడ్ రికవరీల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. -
Earthquake: జమ్మూ కాశ్మీర్ లో వరసగా తొమ్మిది భూకంపాలు.. పొంచి ఉన్న ప్రమాదం
Back-To-Back Earthquakes Hits Jammu Kashmir: జమ్మూాకాశ్మీర్ లో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాలయ రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల్లో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే ఇలా వరసగా భూకంపాలు రావడం ముందస్తు ప్రమాదాన్ని సూచిస్తోందని చెబుతున్నారు నిపుణులు. ఈ వారంలో వరసగా తొమ్మది భూకంపాల రావడం మాత్రం చాలా అరదనే చెప్పవచ్చు. ఈ వారంలో 4.1,3.2 తీవ్రతతో తొమ్మిది వరస భూకంపాలు వచ్చాయి. -
Karnataka: టిప్పు సుల్తాన్ గూండా అన్న ఎమ్మెల్యే.. మరోసారి అంటే నాలుక కోస్తామని హెచ్చరిక
Karnataka Minister KS Eshwarappa comments on Tipu Sultan: కర్ణాటకలో ఇటీవల కాలంలో మతపరమైన ఉద్రిక్తతలు ఎక్కువ అవుతున్నాయి. బీజేపీ కార్యకర్తల హత్యలు, శివమొగ్గ టిప్పు సుల్తాన్ ప్లెక్స్ వర్సెస్ వీర్ సావర్కర్ ప్లెక్స్ వివాదం రాష్ట్రంలో ఉద్రిక్తతలను పెంచాయి. తాజాగా కొంతమంది నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా పరిస్థితిని తీవ్రంగా మారుస్తోంది. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప ఇటీవల టిప్పు సుల్తాన్ ముస్లిం గుండా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఓ వర్గం నుంచి తీవ్ర… -
Russia-Ukraine War: ఉక్రెయిన్ రైల్వే స్టేషన్ పై రష్యా దాడి.. 22 మంది మృతి
Russian Strike On Ukraine Rail Station: ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ రెండు దేశాల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభం అయింది.. ఆరు నెలలు పూర్తి అయినా రెండు దేశాలు పట్టువీడటం లేదు. ముఖ్యంగా రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సర్వనాశనం అవుతోంది. ఇదిలా ఉంటే రష్యా జరిపిన మిస్సైల్ దాడిలో 22 మంది మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ బుధవారం వెల్లడించారు. -
Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో నేడు సుప్రీంకోర్టు కీలక విచారణ..
Supreme Court To Hear Plea Against 11 Convicts' Release in Bilkis Bano Case: బిల్కిస్ బానో అత్యాచార నిందితులను విడుదల చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది . 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఐదు నెలల గర్భవతి బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో 11 మంది దోషులుగా తేలారు.. శిక్ష అనుభవిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. 11 మంది దోషులను రిమిషన్ పాలసీ కింది గుజరాత్ ప్రభుత్వం విడుదల…
తాజావార్తలు
-
Tamannaah : తమన్నాకి ఐటెం సాంగ్స్ కూడా ఇవ్వట్లేదా?
-
Iran Hit List: ఇరాన్ హిట్లిస్ట్లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
-
God of War: పాపం త్రివిక్రమ్.. మళ్ళీ కథ మార్చాల్సిందేనా?
-
Naga Vamsi: పైరసీకి పక్కా ప్లాన్తో నాగ వంశీ చెక్.. ‘లెనిన్’ విషయంలో ఏం జరిగింది?
-
Tollywood : సింగిల్ థియేటర్స్ మూత పడడానికి స్టార్ హీరోలే కారణమా?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!