Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లాలోని చారిత్రాత్మక ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణ పనులకు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. బ్యారేజీ వద్ద పునరుద్ధరణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం.. గేట్ల వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సూచనల మేరకు మిగిలిన 117 గేట్లకు కొత్త గేట్లను అమర్చే పనులను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్యకాలంలో ధవళేశ్వరం బ్యారేజీలో 58 కొత్త గేట్లను అమర్చిన విషయాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇప్పుడు మిగిలిన 117 గేట్లను అత్యాధునిక సాంకేతికతతో మార్చే పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి మొత్తం పనులు పూర్తవుతాయని అధికారులు సీఎంకు హామీ ఇచ్చారు.
Also Read
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్తో ఇండియా విజయం..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటి పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రస్తుతం సముద్రంలోకి 27 వేల క్యూసెక్కుల నీరు వెళ్తోందని అధికారులు వివరించగా.. కాల్వల ద్వారా ఎంత నీటిని విడుదల చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 14,700 క్యూసెక్కుల నీటిని కాల్వలకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాల్వల చివరి ఆయకట్టు భూముల వరకు నీరు సక్రమంగా చేరేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం గోదావరి డెల్టా అభివృద్ధిపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. గోదావరి, కోనసీమ ప్రాంతాలు ప్రకృతి అందాలకు నిలయమని, ఆ ప్రత్యేకతను భవిష్యత్తులో కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కోనసీమకు పోటీగా రాయలసీమ కూడా వ్యవసాయంలో ముందుకు వస్తోందని పలువురు ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానించగా.. రాయలసీమలో ప్రస్తుతం నాణ్యమైన ఉద్యాన పంటలు విస్తృతంగా పండుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులు పూర్తయితే బ్యారేజీ భద్రత మరింత బలోపేతం కావడంతో పాటు వరద నిర్వహణ సామర్థ్యం పెరుగుతుందని అధికారులు తెలిపారు. అలాగే గోదావరి డెల్టాలోని లక్షలాది ఎకరాలకు సాగునీటి సరఫరా మరింత సమర్థవంతంగా జరిగి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!