Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లాలోని చారిత్రాత్మక ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణ పనులకు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. బ్యారేజీ వద్ద పునరుద్ధరణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం.. గేట్ల వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సూచనల మేరకు మిగిలిన 117 గేట్లకు కొత్త గేట్లను అమర్చే పనులను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్యకాలంలో ధవళేశ్వరం బ్యారేజీలో 58 కొత్త గేట్లను అమర్చిన విషయాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇప్పుడు మిగిలిన 117 గేట్లను అత్యాధునిక సాంకేతికతతో మార్చే పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి మొత్తం పనులు పూర్తవుతాయని అధికారులు సీఎంకు హామీ ఇచ్చారు.
Also Read
- Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
- Ayodhya: అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం.. విద్యార్థి అరెస్ట్!
- Indore: పెళ్లైన కొన్ని గంటలకే విడాకులు.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే..!
- Anti Paper Leak Amendment Bill: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..
బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటి పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రస్తుతం సముద్రంలోకి 27 వేల క్యూసెక్కుల నీరు వెళ్తోందని అధికారులు వివరించగా.. కాల్వల ద్వారా ఎంత నీటిని విడుదల చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 14,700 క్యూసెక్కుల నీటిని కాల్వలకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాల్వల చివరి ఆయకట్టు భూముల వరకు నీరు సక్రమంగా చేరేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం గోదావరి డెల్టా అభివృద్ధిపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. గోదావరి, కోనసీమ ప్రాంతాలు ప్రకృతి అందాలకు నిలయమని, ఆ ప్రత్యేకతను భవిష్యత్తులో కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కోనసీమకు పోటీగా రాయలసీమ కూడా వ్యవసాయంలో ముందుకు వస్తోందని పలువురు ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానించగా.. రాయలసీమలో ప్రస్తుతం నాణ్యమైన ఉద్యాన పంటలు విస్తృతంగా పండుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులు పూర్తయితే బ్యారేజీ భద్రత మరింత బలోపేతం కావడంతో పాటు వరద నిర్వహణ సామర్థ్యం పెరుగుతుందని అధికారులు తెలిపారు. అలాగే గోదావరి డెల్టాలోని లక్షలాది ఎకరాలకు సాగునీటి సరఫరా మరింత సమర్థవంతంగా జరిగి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy: ధరణి అక్రమాలు, భూ సమస్యలపై సెట్ విచారణ
-
Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
-
Operation Muskaan : ‘ఆపరేషన్ ముస్కాన్’ సక్సెస్.. 6,307 మంది చిన్నారులకు కొత్త జీవితం.!
-
Ayodhya: అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం.. విద్యార్థి అరెస్ట్!
-
Extramarital affairs: అలా వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. చివరికిలా..!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!