Manish Sisodia: ఇలా చేస్తే ఈడీ, సీబీఐ కేసులు మూసేస్తాం.. బీజేపీ ఆఫర్ చేసింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi deputy CM Manish Sisodia made sensational comments against BJP: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ లిక్కర్ స్కామ్ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఏ1 నిందితుడి.. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ వ్యవహారం బీజేపీ, ఆప్ పార్టీల మధ్య తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మనీష్ సిసోడియా ఏ1 అయినప్పటికీ ఇందులో ప్రధాన పాత్ర సీఎం కేజ్రీవాల్ దే అని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే కేజ్రీవాల్ కు పెరుగుతున్న పాపులారిటీని ఓర్వలేకే కేంద్రం ఈడీ, సీబీఐలను వినియోగించి దాడులు చేయిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. రానున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో తమను అడ్డుకునేందుకే ఇలా బీజేపీ చేస్తోందని ఆప్ ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే మనీష్ సిసోడియా బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తాను ఆప్ పార్టీ నుంచి వైదొలిగితే అన్ని కేసులను మూసేస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని సోమవారం వెల్లడించారు. బీజేపీలో చేరితే ఈడీ, సీబీఐ కేసులు ఎత్తేస్తామని నాకు బీజేపీ ఆఫర్ చేసిందని.. తనపై కేసులన్నీ అవాస్తమని.. మీరు ఏంచేయాలనుకుంటే అది చేయండి అంటూ బీజేపీకి సవాల్ విసిరారు సిసోడియా. ‘‘బిజెపికి నా సమాధానం — నేను మహారాణా ప్రతాప్ మరియు రాజ్పుత్ వారసుడను. నేను తల నరికివేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ కుట్రదారులు మరియు అవినీతిపరుల ముందు ఎన్నటికీ తలవంచలేను. నాపై ఉన్న కేసులన్నీ అబద్ధం. మీరు ఏమి చేయాలనుకుంటే అది చేయండి.’’ అంటూ ట్వీట్ చేశారు.
Also Read
Read Also: Icon Star: జాతీయ జెండా… తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్!
మనీష్ సిసోడియా ఆరోపణలను బీజేపీ నేత మనోజ్ తివారీ తిప్పికొట్టారు. కేసుల్లో చిక్కుకోవడంతోనే సిసోడియా ఇలా కట్టుకథలు అల్లుతున్నాడని వ్యాఖ్యానించారు. మహారాణా ప్రతాప్ తో పోల్చుకోవడం సిగ్గు చేటని అన్నారు. మహారాణా ప్రతాప్ ప్రజలతో మద్యం తాగించాడా..? అని ప్రశ్నించారు. మీరు ఢిల్లీ ప్రతీ మూలలో మద్యం అమ్ముతున్నారని విమర్శించారు. మీరు ఢిల్లీలో మహిళల ఆర్తనాదాలను విస్మరిస్తున్నారని.. మహారాణా ప్రతాప్ ఒకప్పుడు మహిళల కోసం ఆయుధాలు పట్టాడని మనీష్ తివారీ అన్నారు.
ఈ వివాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. ద్రవ్యోల్భనం ఆకాశాన్ని అంటుతుంటే.. రూపాయి విలువ పడిపోతుంటే.. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని.. ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!