Karnataka: టిప్పు సుల్తాన్ గూండా అన్న ఎమ్మెల్యే.. మరోసారి అంటే నాలుక కోస్తామని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Minister KS Eshwarappa comments on Tipu Sultan: కర్ణాటకలో ఇటీవల కాలంలో మతపరమైన ఉద్రిక్తతలు ఎక్కువ అవుతున్నాయి. బీజేపీ కార్యకర్తల హత్యలు, శివమొగ్గ టిప్పు సుల్తాన్ ప్లెక్స్ వర్సెస్ వీర్ సావర్కర్ ప్లెక్స్ వివాదం రాష్ట్రంలో ఉద్రిక్తతలను పెంచాయి. తాజాగా కొంతమంది నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా పరిస్థితిని తీవ్రంగా మారుస్తోంది. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప ఇటీవల టిప్పు సుల్తాన్ ముస్లిం గూండా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈశ్వరప్ప వ్యాఖ్యలను ఖండించారు.
ఇదిలా ఉంటే టిప్పు సుల్తాన్ ను మరోసారి ముస్లిం గూండా అని పిలిస్తే నాలుక కోస్తామని బెదిరింపు లేఖ రాశారు.. లేఖను ఆయన ఇంటికే పంపారు కొంతమంది దుండగులు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే ఈశ్వరప్ప. తాను ఎప్పుడూ ముస్లింలందరినీ గుండాలని పిలవలేదని.. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని ఈశ్వరప్ప అన్నారు. కర్ణాటక శివమొగ్గలో మైనారిటీలు మతపరమైన ఉద్రిక్తతలను రెకేత్తిస్తున్నారని ఆయన మంగళవారం ఆరోపించారు.
Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
Read Also: Dead Body Missing: భార్య దారుణం.. కనిపించని భర్త డెడ్ బాడీ
ముస్లింలు అందరూ గుండాలని అనడం లేదని.. ముస్లిం సమాజంలో పెద్దలు గతంలో శాంతి కోసం ప్రయత్నం చేశారని.. గుండాయిజంతో మునిగిపోతున్న యువతకు సలహా ఇవ్వాలిన ముస్లిం మత పెద్దలను కోరారు ఈశ్వరప్ప. లేని పక్షంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.
ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శివమొగ్గ సిటీలో అమీర్ అహ్మద్ సర్కిల్లో ఏర్పాటు చేసిన వీర్ సావర్కర్ పోస్టర్ను ఓ వర్గం యువకులు తొలగించారు. దీంతో మరో వర్గం వారు నిరసన తెలిపారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెల్తాయి. దీంతో ఆ ప్రాంతంతో కొన్ని రోజులు కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. ఆగస్టు 16న బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కెంపేగౌడ మెట్రో స్టేషన్లో వీడీ సావర్కర్ పెయింటింగ్ను ప్రదర్శన కూడా వివాదానికి కారణం అయింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!