Venu Goapl Reddy
Author- NTV Telugu-
Minister Harish Rao: భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా రంజాన్కి కానుకలు అందించలేదు.
Minister Harish Rao: భారత దేశంలో తెలంగాణ తప్పా ఏ రాష్ట్రం కూడా ముస్లింలకు రంజాన్ పండగ కానుకలను అందించలేదని, గత ప్రభుత్వాలు ముస్లింలకు పండగ కానుకను అందించలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేటలోని కొండ భూదేవి గార్డెన్స్ లో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ కానుకలను హరీష్ రావు పంపిణీ చేశారు. రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల పండగలకు సరుకులు అందిస్తున్నారమని ఆయన వెల్లడించారు. -
Bhatti Vikramarka: మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రిని అడిగి భజన శాఖ తీసుకోవాలి..
Bhatti Vikramarka: కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మంత్రి హారీష్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్ ఆస్పత్రిలో జరిగిన సంఘటనను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. హరీష్ రావు వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖను వదిలేసి భజన శాఖను తీసుకున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిని అడిగి హరీష్ రావు భజన శాఖను తీసుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజామాబాద్ ఆసుపత్రిలో పేషెంట్లు స్ట్రేచర్లు లేక కాళ్లు పట్టుకుని గుంజుకుపోవాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. -
NASA: అంగారకుడిపై ఎగిరిన బుల్లి హెలికాప్టర్.. వీడియో..
NASA: రెండేళ్ల క్రితం నాసా అంగారకుడిపైకి పరిశోధన నిమిత్తం పర్సువరెన్స్ రోవర్ తోపాటు ఓ తేలికపాటి ఎగిరే హెలికాప్టర్ ను పంపింది. మార్స్ పై ఉండే తేలికపాటి వాతావరణంలో ఇంజెన్యూటీ హెలికాప్టర్ ఎగురుతుందా..? లేదా..? అనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు రోవర్ తో పాటు పంపించాయి. ఇప్పటికే పలు మార్లు అంగారకుడి వాతావరణంపై ఈ హెలికాప్టర్ ఎగిరింది. తాజాగా 50వ సారి ఎగిరింది. ఏప్రిల్ 13న ఈ చిన్న హెలికాప్టర్ 145.7 సెకన్లలో 1,057.09 అడుగుల (322.2 మీటర్లు) ఎత్తు వరకు ప్రయాణించింది. -
MHA: అతిక్ అహ్మద్ హత్య.. జర్నలిస్టుల కోసం కేంద్రం మార్గదర్శకాలు..
After Atiq Ahmed Murder, Centre Prepares Advisory For Journalists: ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పోలీస్ కస్టడీలో ఉన్న అతిక్ అహ్మద్ అతని సోదరులు అఫ్రాప్ అహ్మద్ లను పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చిచంపారు ముగ్గురు నిందితులు. అతిక్, అఫ్రాఫ్ లను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకువస్తున్న సమయంలో జర్నలిస్టులుగా నటిస్తున్న ముగ్గురు నిందితులు దగ్గర నుంచి కాల్చి చంపారు. -
Atiq Ahmed: 17 ఏళ్లకే మర్డర్.. 27 ఏళ్లకు ఎమ్మెల్యే.. 44 ఏళ్ల క్రిమినల్ హిస్టరీ..
Atiq Ahmed: అతిక్ అహ్మద్ ఒకానొక సమయంలో ఉత్తర్ ప్రదేశ్, ముఖ్యంగా ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో తిరుగులేని డాన్ గా ఎదిగాడు. చివరి రోజులను మాత్రం సీఎం యోగి ఆదిత్య నాథ్ దెబ్బకు బయపడుతూ బతికాడు. ఉత్తర్ ప్రదేశ్ వస్తే ఎప్పుడు ఎన్ కౌంటర్ అవుతానో అని తీవ్రంగా భయపడేవాడు. శనివారం రాత్రి ముగ్గురు నిందితుల చేతిలో అతిక్ అహ్మద్ తో పాటు అతని తమ్ముడు అష్రఫ్ అహ్మద్ దారుణంగా హత్యకు గురయ్యారు. -
Uttar Pradesh: మూడేళ్ల పాపపై 10 ఏళ్ల బాలుడి అత్యాచారం..
Uttar Pradesh: దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇదిలా ఉంటే మైనర్లు కూడా అత్యాచారాలకు పాల్పడుతుండటం సమాజాన్ని కలవరపరుస్తోంది. తెలిసీతెలియని వయసులో ఉన్న పిల్లలు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడటం షాక్ కు గురిచేస్తోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. -
Elephant Fights Off Crocodile: బిడ్డను రక్షించడానికి మొసలితో ఏనుగు పోరాటం.. వీడియో వైరల్..
ఒక నెటిజన్.. ‘‘మొసలి రక్షించబడింది, లేకపోతే దాని లోపల ఉన్న మొత్తం బయటకు వచ్చేది’’ అని వ్యాఖ్యానించారు. మరొకరు మొసలి తప్పించుకున్నా కూడా తన పిల్లను రక్షించుకోవడానికి ఇంకా తల్లి ఏనుగు చెరువులో వెతుకుతూనే ఉందని, ఇది తల్లి పిల్లల రక్షణ పట్ల ఉన్న ప్రవృత్తి అన్నారు. -
Imran Khan: పాక్ ఆర్మీ చీఫ్ పై ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు.. మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్ అంటూ..
Imran Khan: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతల మధ్య పాకిస్తాన్ బతుకీడుస్తోంది. అక్కడి జనాలకు తినడానికి తిండి కరువైంది. విదేశీమారక నిల్వలు లేక దిగుమతులు చేసుకోలేని పరిస్థితి. అరబ్ దేశాలు, ఆల్ టైం ఫ్రెండ్ చైనా కూడా పెద్దగా పాకిస్తాన్ ను పట్టించుకోవడం లేదు. దీనికి తోడు ఇటీవల కాలంలో పాక్ ప్రభుత్వం, -
Tomatoes grown in space: అంతరిక్షంలో పండించిన టొమాటో… భూమికి తీసుకువస్తున్న డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్
Tomatoes grown in space: అంతరిక్షం ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. మనం ఇప్పటి వరకు అంతరిక్షం గురించి, విశ్వం గురించి తెలుసుకుంది చాలా తక్కువ మాత్రమే. అంతరిక్షంపై శాస్త్రవేత్తలు ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. భూమి నుంచి దాదాపుగా 500 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమిస్తూ పూర్తిగా శూన్యంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటుంది. ఈ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో వ్యోమగాములు కొన్ని నెలల పాటు ఉంటూ పలు పరిశోధనలు చేస్తుంటారు. -
Madhya Pradesh: కరోనాతో చనిపోయినట్లు ప్రకటించబడిన వ్యక్తి.. రెండేళ్ల తర్వాత సజీవంగా ఇంటికి..
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ లో చనిపోయాడని అధికారుల చేత నిర్థారించబడిన వ్యక్తి రెండేళ్లకు సజీవంగా ఇంటికి రావడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ఘటన ఆ కుటుంబాన్ని, సన్నిహితులను షాకింగ్ కు గురిచేయడంతో పాటు తమ వ్యక్తి సజీవంగానే ఉన్నాడని తెలుసుకుని అంతా సంతోషిస్తున్నారు.
తాజావార్తలు
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో