India: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్గా ఇండియా..
India Now World’s 3rd Largest Auto Market After China And US: ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమార్కెట్ గా ఇండియా ఉంది. ప్రస్తుతం ఈ విషయంలో ఇండియా మరో ఘనత సాధించింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్ గా అవతరించింది. జపాన్ దేశాన్ని అధిగమించి మన దేశం ఈ స్థానంలోకి చేరింది. నిక్కీ ఆసియా ప్రకారం.. మొదటిసారిగా ఇండియా మూడో స్థానానికి చేరినట్లు శుక్రవారం వెల్లడించింది. భారతదేశంలో ఈ ఏడాది వాహనాల విక్రయం కనీసం 4.25 మిలియన్ యూనిట్లుగా ఉందని.. జపాన్ విక్రయించిన వాహనాలు 4.2 మిలియన్ల కన్నా ఎక్కువ అమ్మకాలను నమోదు చేసినట్లు నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఆటోమార్కెట్ గా చైనా ఉండగా.. రెండో స్థానంలో అమెరికా, మూడో స్థానంలో ఇండియా, నాలుగో స్థానంలో జపాన్ దేశాలు ఉన్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రకారం, జనవరి-నవంబర్ 2022 మధ్య భారతదేశంలో 4.13 మిలియన్ల వాహనాలను డెలివరీ చేశారు. భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఆదివారం నివేదించిన డిసెంబర్ అమ్మకాలను కలుపుకుంటే.. మొత్తంగా దాదాపుగా 4.25 మిలియన్ యూనిట్లకు చేరుకుంది.
Also Read
- Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
- BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
Read Also: China: మూడేళ్ల తర్వాత యధాస్థితికి చైనా.. సాధారణ వ్యాధుల జాబితాలోకి కోవిడ్
నిక్కీ ఆసియా ప్రకారం టాటా మోటార్స్, ఇతర వాహన తయారీ కంపెనీలు సంవత్సరాంతపు ఫలితాలతో పాటు వాణిజ్య వాహనాల నాల్గోత్రైమాసిక అమ్మకాలను కలుపుకుంటే భారతదేశంలో విక్రయించబడిన వాహనాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 2021లో చైనా 26.27 మిలియన్ల వాహనాలను విక్రయించి ప్రపంచ ఆటో మార్కెట్ లో అగ్రగామిగా ఉంది. ఇక అమెరికా 15.4 మిలియన్ వాహనాలతో రెండో స్థానంలో జపాన్ 4.44 మిలియన్ల యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో ఉంది.
ఇటీవల భారత ఆటో మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతోందని నిక్కీ ఆసియా వెల్లడించింది. 2018లో దాదాపుగా 4.4 మిలియన్ వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే 2019లో 4 మిలియన్ల కన్నా తక్కువ అమ్మకాలు నమోదు అయ్యాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత 2021లో మార్కెట్ కోలుకుని 4 మిలియన్ల యూనిట్ల వాహనాల అమ్మకాలను చేరుకుంది. అయితే అమ్మకాలపై సెమికండక్టర్ల కొరత కూడా ప్రభావం చూపించినట్లు నివేదిక వెల్లడించింది.
పెట్రోల్, డిజిల్ తో నడిచే వాహనాలే ఇండియాలో ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 2021లో ఓ నివేదిక ప్రకారం కేవలం 8.5 శాతం భారతీయ కుటుంబాలు మాత్రమే ప్యాసింజర్ వాహనాలను కలిగి ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం పెట్రోల్ దిగుమతి ఫలితంగా వాణిజ్య లోటు ఏర్పడటంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల పై సబ్సిడీలు అందిస్తోంది.
- Tags
- automobiles
- china
- india
- Japan
- us
తాజావార్తలు
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
-
Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
-
Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
-
Shreyas Iyer: “222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది”.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
-
Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో