India: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్గా ఇండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Now World’s 3rd Largest Auto Market After China And US: ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమార్కెట్ గా ఇండియా ఉంది. ప్రస్తుతం ఈ విషయంలో ఇండియా మరో ఘనత సాధించింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్ గా అవతరించింది. జపాన్ దేశాన్ని అధిగమించి మన దేశం ఈ స్థానంలోకి చేరింది. నిక్కీ ఆసియా ప్రకారం.. మొదటిసారిగా ఇండియా మూడో స్థానానికి చేరినట్లు శుక్రవారం వెల్లడించింది. భారతదేశంలో ఈ ఏడాది వాహనాల విక్రయం కనీసం 4.25 మిలియన్ యూనిట్లుగా ఉందని.. జపాన్ విక్రయించిన వాహనాలు 4.2 మిలియన్ల కన్నా ఎక్కువ అమ్మకాలను నమోదు చేసినట్లు నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఆటోమార్కెట్ గా చైనా ఉండగా.. రెండో స్థానంలో అమెరికా, మూడో స్థానంలో ఇండియా, నాలుగో స్థానంలో జపాన్ దేశాలు ఉన్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రకారం, జనవరి-నవంబర్ 2022 మధ్య భారతదేశంలో 4.13 మిలియన్ల వాహనాలను డెలివరీ చేశారు. భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఆదివారం నివేదించిన డిసెంబర్ అమ్మకాలను కలుపుకుంటే.. మొత్తంగా దాదాపుగా 4.25 మిలియన్ యూనిట్లకు చేరుకుంది.
Also Read
- TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
- 2026 Audi Q7: సూపర్ ఫాస్ట్ SUV.. 4.8 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకునే 2026 Audi Q7
- Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
- Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
Read Also: China: మూడేళ్ల తర్వాత యధాస్థితికి చైనా.. సాధారణ వ్యాధుల జాబితాలోకి కోవిడ్
నిక్కీ ఆసియా ప్రకారం టాటా మోటార్స్, ఇతర వాహన తయారీ కంపెనీలు సంవత్సరాంతపు ఫలితాలతో పాటు వాణిజ్య వాహనాల నాల్గోత్రైమాసిక అమ్మకాలను కలుపుకుంటే భారతదేశంలో విక్రయించబడిన వాహనాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 2021లో చైనా 26.27 మిలియన్ల వాహనాలను విక్రయించి ప్రపంచ ఆటో మార్కెట్ లో అగ్రగామిగా ఉంది. ఇక అమెరికా 15.4 మిలియన్ వాహనాలతో రెండో స్థానంలో జపాన్ 4.44 మిలియన్ల యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో ఉంది.
ఇటీవల భారత ఆటో మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతోందని నిక్కీ ఆసియా వెల్లడించింది. 2018లో దాదాపుగా 4.4 మిలియన్ వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే 2019లో 4 మిలియన్ల కన్నా తక్కువ అమ్మకాలు నమోదు అయ్యాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత 2021లో మార్కెట్ కోలుకుని 4 మిలియన్ల యూనిట్ల వాహనాల అమ్మకాలను చేరుకుంది. అయితే అమ్మకాలపై సెమికండక్టర్ల కొరత కూడా ప్రభావం చూపించినట్లు నివేదిక వెల్లడించింది.
పెట్రోల్, డిజిల్ తో నడిచే వాహనాలే ఇండియాలో ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 2021లో ఓ నివేదిక ప్రకారం కేవలం 8.5 శాతం భారతీయ కుటుంబాలు మాత్రమే ప్యాసింజర్ వాహనాలను కలిగి ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం పెట్రోల్ దిగుమతి ఫలితంగా వాణిజ్య లోటు ఏర్పడటంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల పై సబ్సిడీలు అందిస్తోంది.
- Tags
- automobiles
- china
- india
- Japan
- us
తాజావార్తలు
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?