Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Sensational Details In Madanapalle Kidney Racket Case

Madanapalle Kidney Racket: మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు.. ఒక్కో కిడ్నీ పాతిక లక్షలకు

Published Date :November 16, 2025 , 9:10 pm
By Venkatesh
  • మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు
  • ఒక్కో కిడ్నీ పాతిక లక్షలకు
  • రెండు అక్రమ కిడ్నీ ఆపరేషన్లను గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా చేపట్టారు
Madanapalle Kidney Racket: మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు.. ఒక్కో కిడ్నీ పాతిక లక్షలకు
  • Follow Us :
  • google news
  • dailyhunt

అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అవసరమే కానీ, డబ్బు సంపాదించేందుకు మానవ అవయవాలతో వ్యాపారం చేయడం తప్పే కదా. అమాయకులకు డబ్బు ఎరగా చూపి దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు సంచలనం సృష్టిస్తోంది. నిందితుల రిమాండ్ రిపొర్టు‌ లో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. రెండు అక్రమ కిడ్నీ ఆపరేషన్లను గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు ఒక్కో కిడ్నీ నీ పాతిక లక్షల అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు.

Also Read:Andhra Pradesh:విశాఖలో మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ హోటల్ ప్రాజెక్ట్.. 2000 మందికి ఉపాధి

Also Read

  • Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
  • White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
  • TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఎప్పుడంటే.?
  • Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..

కిడ్నీ దాత కావాలంటూ మదనపల్లె డయాలసిస్ సెంటర్ లో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న బాలు, కదిరి డయాలసిస్ సెంటర్ టెక్నీసియాన్ మెహరాజ్ లను పార్థసారథి రెడ్డి కోరాడు. వైజాగ్ జిల్లా గాజువాక కు చెందిన బ్రోకర్లు పద్మ, కాకర్ల సత్య, సూరిబాబుతో బాలు, మెహరాజ్ సంప్రదింపులు జరిపారు. వైజాగ్ చెందిన హారిక, యమునా తో ఆరు లక్షల రూపాయలు ఒప్పందం కుదిర్చిన బ్రోకర్లు.. కిడ్నీ ఆపరేషన్ చేయడానికి గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్ ఆంజనేయులకు ఒక్కో ఆపరేషన్ కు ఐదు లక్షల ఇచ్చేలా పార్థసారథి రెడ్డి డీల్ కుదుర్చుకున్నారు.

తొలిగా ఈనెల తొమ్మిదివ తేది ఉదయం వైజాగ్ కు చెందిన హారిక అనే యువతి కిడ్నిని తొలగించి మదనపల్లె చెందిన ముబాషిరా అమర్చడం ద్వారా 25 లక్షలు పొందారు నిందితులు. వచ్చిన డబ్బుల్లో డా. అంజనేయులు – రూ.5.5 లక్షలు, డా. పార్థసారథి – రూ. 4 లక్షలు, దాత హారిక – రూ. 6 లక్షలు మిగిలిన డబ్బును పంచుకున్న మెహరాజ్,బాలు. మరో కిడ్నిని సాయంత్రం యమున కు ఆపరేషన్ చేసి తొలగించారు పార్థసారథి రెడ్డి.. కిడ్నీ ఆపరేషన్ తర్వాత నొప్పి తట్టుకోలేక యమునా మృతి చెందింది. యమునా మృతి చెందడంతో గుట్టుచప్పుడు కాకుండా మదనపల్లి నుండి తిరుపతికి మృతదేహాన్ని తరలించారు. యమునతో సహజీవనం చేస్తున్న సూరిబాబుకు ఆరు లక్షల రూపాయల డబ్బులు ఇస్తామని ఇవ్వకపోవడం, యమునా మృతి చెందిందని చెప్పడంతో ఆందోళన చెంది పోలీసులకు సమాచారం ఇచ్చాడు సూరిబాబు..

Also Read:India WTC Ranking Drop: భారత్‌కు ఓటమి ఎఫెక్ట్.. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఎన్ని పాయింట్లు కోల్పోయిందంటే.. !

పోలీసులకు సూరిబాబు సమాచారం ఇవ్వడంతో కిడ్నీ అమ్మకం వ్యవహారం బయటపడింది. తొలుత యమునకు పరీక్షలు నిర్వహించిన ఆంజనేయులు ఆమె శరీరం కిడ్నీ ఇవ్వడానికి సరిపోదంటూ తిప్పి పంపారు. అరెస్టు చేసిన వారిచ్చిన సమాచారంతో మరో 8 మంది పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటివరకు 15మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.. కేసులో కీలక నిందితుడిగా ఉన్న డాక్టర్ పార్థసారధి రెడ్డి కోసం తమిళనాడు, కర్నాటక, రాష్ట్రాల్లో గాలిస్తున్నారు పోలీసులు. యమునా కిడ్నీనీ గోవాకు చెందిన కిడ్నీ పేషంట్ రాజన్ దామోదర్ నాయక్ కు అమర్చినట్లు సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Crime News
  • annamayya district
  • Global Hospital
  • illegal kidney operation
  • Madanapalle kidney racket

తాజావార్తలు

  • Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!

  • TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన

  • Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

  • CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..

  • Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions