ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మొక్కితే వరాలిచ్చే వనదేవతలైన సమ్మక్క సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటికే మేడారానికి క్యూ కట్టారు. మరి మీరు కూడా రేపు మేడారానికి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ విషయం మీకోసమే.. రేపు ఎల్లుండి మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మేడారంలో రేపు క్యాబినెట్ మీటింగ్ కి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎల్లుండి పునర్నిర్మాణం చేసిన వన […]
దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురును అందించింది. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని భారీగా పెంచింది. గతంలో ఉన్న లక్షను.. రూ.2 లక్షల కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటేనే ఈ పెంచిన నగదు ప్రోత్సాహకం లభించనున్నది. ఈ రూ.2 లక్షల ను భార్య పేరు మీద ప్రభుత్వం ఇవ్వనున్నది. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఇద్దరు దివ్యాంగులు ఒకరినొకరు వివాహం చేసుకున్నా వారికి ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల ఆర్థిక […]
తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. ఏకంగా 20మంది ఐపీఎస్ లను బదిలీ చేసి పోస్టింగ్స్ ఇచ్చింది. డా. గజరావు భూపాల్ (IPS 2008) సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నుంచి బదిలీ అయి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ – ప్రొవిజనింగ్ & లాజిస్టిక్స్గా నియామకం అయ్యారు. అదనంగా IG – స్పోర్ట్స్ & వెల్ఫేర్ ఇన్చార్జ్ గా నియమితులయ్యారు. అభిషేక్ మొహంతీ (IPS 2011) నార్కోటిక్స్ బ్యూరో DIG నుంచి, విజిలెన్స్ […]
ఎయిర్టెల్ తన కస్టమర్లకు అదిరిపోయే బెనిఫిట్స్ తో రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లు వివిధ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రూపొందించింది. కంపెనీ బెస్ట్ ప్లాన్స్ లో ఓ ప్లాన్ 1.5GB రోజువారీ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఎయిర్టెల్ తన కస్టమర్లకు రూ. 859 ప్లాన్ను అందిస్తోంది. ఈ ప్లాన్లో రోజుకు 1.5GB డేటా, అపరిమిత లోకల్, STD, రోమింగ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. స్పామ్ ప్రొటెక్షన్, […]
మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. చిట్టిబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేశారు.. ఇరిగేషన్, ఎడ్యుకేషన్కు మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. భారత తొలి ప్రధాని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకే తొలి ప్రాధాన్యత ఇచ్చారని, తమ ప్రభుత్వం కూడా వాటికే ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో సీఎం రేవంత్రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. Also Read:CM Revanth Reddy: మహబూబ్ నగర్ పై సీఎం రేవంత్ […]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో రూ.1284 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ నగర పాలక సంస్థ పరిధిలో ఎం.వి.ఎస్ డిగ్రీ,పి.జి కళాశాలలో రూ.200 కోట్లతో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేశారు. రూ.20.50 కోట్లతో ఎం. వి.ఎస్.డిగ్రీ కళాశాల అదనపు తరగతి గదులకు శంకు స్థాపన చేశారు. Also […]
భారత నావికాదళంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇదొక గోల్డెన్ ఛాన్స్. భారత నావికాదళం షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ (నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ – జనవరి 2027 (ST 27) కోర్సు) కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులు జనవరి 24 నుండి ఫిబ్రవరి 24, 2026 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 260 ఖాళీలను భర్తీ […]
ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికైనా లేదా ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికైనా సెలవులు ముఖ్య భాగం. కొన్ని దేశాలు ఏటా చాలా సెలవులను ప్రకటిస్తుంటాయి. మరికొన్ని పరిమిత సెలవులను ప్రకటిస్తుంటాయి. ఈ సెలవులు జాతీయ కార్యక్రమాలు, సాంస్కృతిక వైవిధ్యం, మతపరమైన సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, ఏ దేశంలో గరిష్ట సంఖ్యలో సెలవులు ఉన్నాయో, ఏ దేశంలో తక్కువ సంఖ్యలో ప్రభుత్వ సెలవులు ఉన్నాయి? వాటిల్లో భారత్ స్థానం ఎంత? ఆ వివరాలు మీకోసం.. అత్యధిక సెలవులు […]
మీ పిల్లలకు చిప్స్ ప్యాకెట్స్ కొనిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. చిప్స్ ప్యాకెట్ పేలి ఓ బాలుడు కంటి చూపును కోల్పోయాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. బలంగీర్ జిల్లాలో చిప్స్ ప్యాకెట్ పేలిన ఘటనలో ఎనిమిదేళ్ల బాలుడి జీవితంలో చీకట్లుకమ్ముకున్నాయి. టిట్లాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాగర్డ్ఘాట్ గ్రామంలో సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఆ చిన్నారి ఒక కంటి చూపును కోల్పోయాడు. Also Read:US Iran Tensions: ఇరాన్పై దాడికి యూఎస్ సిద్ధం.. ఖతార్ […]
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. అప్పు చెల్లింపు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగగా, ఆదర్షనగర్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది రమ్య సుధ (36) అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. పట్టణంలో బట్టల వ్యాపారం నిర్వహిస్తున్న భర్త శ్రీధర్. భార్య రమ్యసుధ వరంగల్ జిల్లా రాయపర్తి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నది. బట్టల వ్యాపారం సరిగా లేక, ఇంటి నిర్మాణం కోసం అప్పులు ఎక్కువైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. Also Read:Bhartha Mahasayulaku […]