ఇండియా, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ICC పురుషుల T20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్లో 20 జట్లు పాల్గొంటున్నాయి. బంగ్లాదేశ్ గత టోర్నమెంట్ (2024)లో టాప్-7లో ఉండటం వల్ల డైరెక్ట్గా క్వాలిఫై అయింది. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) భద్రతా ఆందోళనల కారణంగా భారత్లో జరిగే తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ICCని అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో ICC బంగ్లాదేశ్కు జనవరి […]
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్ట్ ధిక్కరణ కేసులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత కేసులో స్పీకర్ కోర్ట్ ఆదేశాలను ధిక్కరించారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. ప్రధాన పిటిషన్ తో ట్యాగ్ చేసిన సుప్రీం కోర్టు.. ఈ కేసులో కేటీఆర్ వేసిన పిటిషన్ తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ధర్మాసనం ట్యాగ్ చేసింది. […]
ఉగ్రీన్ కొత్త పవర్ బ్యాంక్, మాగ్ఫ్లో Qi2 ను విడుదల చేసింది. ఇది 100W వరకు ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. పవర్ బ్యాంక్ 100W వరకు వైర్డ్ ఛార్జింగ్కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది USB-A తో జత చేయబడిన అంతర్నిర్మిత USB-C కేబుల్తో వస్తుంది. ఇది స్టాండ్గా పనిచేసే మడతపెట్టే భాగాన్ని కూడా కలిగి ఉంది. Ugreen MagFlow Qi2 ధర రూ. 5,838. దీనిని కంపెనీ అధికారిక వెబ్సైట్ నుండి అలాగే Amazon నుండి […]
బస్సులో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఓ యువతి వీడియో తీసింది. యువతి నిందారోపణ తట్టుకోలేక బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. బస్సులో దీపక్ అనే వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ తాకాడు అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఓ యువతి.. వీడియో వైరల్ కావడంతో అవమాన భారంతో తాను అలాంటి స్వభావం గల వాడిని కాదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీపక్. మృతుడిని కోజికోడ్లోని గోవిందపురంలో నివసిస్తున్న పుతియారాకు చెందిన దీపక్ […]
దొంగతనానికి వెళ్లి బయటికి రాలేక అక్కడే ఇరుక్కుపోయిన సంఘటనలు చూశాం కదా. మరికొందరు మద్యం మత్తులో దొంగతనం చేసిన ఇంట్లోనే నిద్రపోయి యజమానులకు పట్టుబడిన కేసులు ఉన్నాయి. తాజాగా కామారెడ్డిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బీర్కూర్ మండల కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ తాగిన మైకంలో బయటకు వెళ్ళ లేక ఇంట్లోనే పడుకున్నాడు. యజమాని వచ్చి తాళం తీసి చూసే వరకు ఇత్తడి,ఇనుప సామాన్లు సంచిలో నింపుకుని పడుకుని కనిపించిన వైనం. […]
సిద్దిపేటలో ఆదర్శ్ నగర్ స్ట్రీట్ నంబర్ 7 లో దారుణం చోటుచేసుకుంది. భార్య శ్రీలతపై అనుమానంతో భర్త ఎల్లయ్య కత్తితో పొడిచి చంపాడు. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, పిల్లలు కూడా తనకి పుట్టలేదన్న అనుమానంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్య శ్రీలత(35) ని కత్తితో పొడిచి చంపిన భర్త ఎల్లయ్య.. అనంతరం కూతురు(15), కొడుకు(12)పై కత్తితో దాడికి యత్నించాడు. తండ్రి దాడిలో తప్పించుకుని పారిపోయిన కుమారుడు. అనంతరం గడ్డి మందు తాగి కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు […]
అక్రమ సంబంధాలు కడుపున పుట్టిన పిల్లలను సైతం చంపేలా చేస్తున్నాయి. ఓ తల్లి తన ప్రియుడితో అసభ్యకర రీతిలో ఉండగా తన ఐదేళ్ల కొడుకు చూడడంతో దారుణానికి పాల్పడింది. భర్తకు చెప్తాడని భావించి ఆమె తన కొడుకును రెండంతస్తుల ఇంటి పైకప్పు నుండి తోసేసి చంపేసింది. ఈ సంఘటన ఏప్రిల్ 28, 2023న గ్వాలియర్ జిల్లాలోని థాటిపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. అయితే ఆ తల్లి ఈ నిజాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్త పడింది. కానీ […]
ఉత్తరాఖండ్లోని ఉధమ్ సింగ్ నగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడిపై దాడి జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యే కుమారుడిని చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతన్ని ఐసియులో చేర్చారు. నివేదికల ప్రకారం, కిచ్చా కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ క్యాబినెట్ మంత్రి తిలక్రాజ్ బెహాద్ కుమారుడు, రుద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు కౌన్సిలర్ సౌరభ్ బెహాద్ పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యే కుమారుడు, కౌన్సిలర్ సౌరభ్ బెహాద్ను […]
ఆదివారం ఇండోర్లో జరిగిన వన్డేలో భారత జట్టు 338 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. భారత గడ్డపై న్యూజిలాండ్ తొలిసారి వన్డే సిరీస్ను గెలుచుకుంది. 37 సంవత్సరాల తర్వాత కివీస్ చరిత్ర సృష్టించింది. ఇండోర్లో ఓటమితో, టీమ్ ఇండియా న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1 తేడాతో కోల్పోయింది. ఇండోర్లో జరిగిన చివరి మ్యాచ్లో కివీస్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 124 పరుగులు చేసినప్పటికీ, భారత్ 46 ఓవర్లలో 296 […]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఉదయం 6 గంటలకి కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణితో పాటు కూతురు అల్లుడు మనవరాళ్లతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రూ.251 కోట్లతో మేడారంలో అభివృద్ధి చేసిన గుడి ప్రాంగణాన్ని ప్రారంభించి భక్తులకు అంకితం ఇవ్వనున్నారు. మేడారంలో అభివృద్ధి చేసిన జంక్షన్ లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 7:45 నిమిషాలకి హెలికాప్టర్ లో శంషాబాద్ ఎయిర్ […]