Veerababu Burugadda
Author- NTV Telugu-
అస్సాంలో సుఖోయ్ యుద్ధ విమానం ఆచూకీ గల్లంతు.. గాలిస్తున్న ఎయిర్ఫోర్స్..
అస్సాం గగనతలంలో భారత వాయుసేనకు చెందిన అత్యంత శక్తివంతమైన సుఖోయ్-30 ఎంకేఐ (Su-30 MKI) యుద్ధ విమానం ఆచూకీ గల్లంతయ్యింది. మార్చి 5, గురువారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో కార్బీ ఆంగ్లాండ్లోని చోకిహోలా ప్రాంతం వద్ద ఈ విమానానికి రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. సాధారణ శిక్షణలో భాగంగా గాలిలోకి ఎగిరిన ఈ యుద్ధ విమానం, సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలి ఉండవచ్చని రక్షణ వర్గాలు అనుమానిస్తున్నాయి. Also Read:CM Revanth Reddy: విజయ్ – […] -
AP Govt: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ , వార్డు సచివాలయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కూటమి సర్కార్ ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ.. ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ‘గ్రామ, వార్డు సచివాలయాల’ పేరును ‘స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు’ కార్యాలయాలుగా మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనమండలి తాజాగా ఆమోదం తెలిపింది. సచివాలయ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. స్వర్ణ […] -
Railway Station: తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్కు మహర్దశ.. విమానాశ్రయం తరహాలో అభివృద్ధి..
ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న నాంపల్లి స్టేషన్కు కేంద్ర ప్రభుత్వం మహర్దశ కల్పించనుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’ కింద ఈ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నాంపల్లి రైల్వే స్టేషన్ రూపురేఖలను పూర్తిగా మార్చేయనున్నట్లు వెల్లడించారు. 2027 చివరి నాటికి ఈ స్టేషన్ అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో అత్యాధునిక హంగులతో సిద్ధం కానుంది. దీని కోసం తొలి […] -
Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త ట్రైన్స్.. ఈ ప్రాంతాల మధ్యే..
తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు రైల్వే శాఖ అదిరిపోయే వార్తను అందించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ రెండు నూతన ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించనుంది. ఈ మేరకు రైల్వే ఉన్నతాధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. కేవలం కనెక్టివిటీ పెంచడమే కాకుండా.. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ వీక్లీ రైళ్లను ప్రవేశపెట్టారు. Also Read:Advance Tax Deadline: అడ్వాన్స్ టాక్స్ లాస్ట్ డేట్ మార్చి 15.. […] -
ATM Withdrawal Limit: ఆ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్.. ఏటీఎం విత్ డ్రా లిమిట్ 50 శాతం తగ్గింపు..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన ఖాతాదారులకు షాకిస్తూ డెబిట్ కార్డుల ద్వారా జరిపే నగదు విత్డ్రా పరిమితుల్లో భారీ మార్పులు చేసింది. సైబర్ మోసాలను అరికట్టడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. నూతన ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం.. ఎంపిక చేసిన ప్రీమియం డెబిట్ కార్డులపై రోజువారీ నగదు విత్ డ్రా పరిమితిని ఏకంగా 50 శాతం […] -
Free Bus Travel: ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ నెల 16 నుంచి వారికి కూడా ఫ్రీ..
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) భారీ ఊరటనిచ్చాయి. పరీక్షల సమయంలో విద్యార్థులకు రవాణా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో.. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారికంగా ప్రకటించింది. హాల్ టికెట్ చూపిస్తే చాలు.. ఈ సౌకర్యం పొందడానికి విద్యార్థులు ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. తమ వెంట ఉన్న పరీక్ష హాల్ టికెట్ను బస్సు కండక్టర్కు చూపిస్తే సరిపోతుంది. తమ నివాస […] -
AP Govt: ఎక్కువ మంది పిల్లలు కనే దంపతులకు రూ.25 వేలు.. సీఎం చంద్రబాబు ప్రకటన..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ నుంచి జనాభా నిర్వహణ వైపు అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు (TFR) భవిష్యత్తులో మానవ వనరుల కొరతకు దారితీస్తుందని భావిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు.. శాసనసభలో సంచలన ప్రకటన చేశారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన విధానం ప్రకారం.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు ప్రభుత్వం రూ. 25,000 నగదు ప్రోత్సాహకాన్ని అందించనుంది. గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాధాన్యతగా ఉండగా.. ఇప్పుడు […] -
Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..
తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో వాతావరణం అనూహ్యంగా మారనుంది. మార్చి మధ్య వరకు భానుడి భగభగలు కొనసాగనుండగా.. ఆ తర్వాత అకాల వర్షాలు పలకరించనున్నాయని వాతావరణ శాఖ (IMD) , వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ముదిరిపోతున్నాయి. మార్చి 18వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా […] -
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు తీపి కబురు.. ఇక వేగంగా డబ్బులు.. ఈ ఒక్క పని చేస్తేనే..
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రైవేట్ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తీపి కబురు అందించింది. పీఎఫ్ ఉపసంహరణ (Withdrawal) ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులకు స్వస్తి పలుకుతూ.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఈపీఎఫ్ఓ సేవల్లో మానవ ప్రమేయం తగ్గిస్తూ.. పూర్తిస్థాయిలో ఆటోమేషన్ విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటివరకు మనం పీఎఫ్ క్లెయిమ్ కోసం ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. ఆ పత్రాలను సంబంధిత […] -
Women’s Day: తెలంగాణ మహిళలకు ఉమెన్స్ డే గిఫ్ట్.. ఉచితంగానే..
తెలంగాణ రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళల సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న డ్వాక్రా మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనుంది.
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!