Fake Property Sale: ఒక్క ప్రాపర్టీనే 25 మందికి అమ్మేశారు.. వీరి మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి గురుగ్రామ్ ఒక స్వర్గధామంలా కనిపిస్తుంది. కానీ, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ భారీ కుంభకోణం ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కళ్లు చెదిరే లాభాలు, గ్యారెంటీ అద్దెలు అంటూ ఆశ చూపి ఒకే ఆస్తిని పదుల సంఖ్యలో వ్యక్తులకు విక్రయించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ రికార్డులు, డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని నమ్మించి చేసిన ఈ మాయాజాలం రియల్ ఎస్టేట్ పారదర్శకతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. దాదాపు రూ.500 కోట్ల విలువైన ఈ స్కామ్, కేవలం సామాన్యులనే కాకుండా బడా ఇన్వెస్టర్లను సైతం నివ్వెరపోయేలా చేసింది. గురుగ్రామ్లోని అత్యంత ఖరీదైన కమర్షియల్ ప్రాజెక్టులలో ఒకటైన ’32nd Avenue’ వేదికగా ఈ భారీ మోసం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ప్రమోటర్ , సీఈఓ ధ్రువ్ దత్ శర్మ ఫిబ్రవరి 2026లో పోలీసులకు చిక్కడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
మోసం చేసిన తీరు ఇదే..
Also Read
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
- First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
- RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
నిందితుడు అత్యంత చాకచక్యంగా 3,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఒక కమర్షియల్ ఫ్లోర్ను ఎంపిక చేసుకున్నాడు. 2021 నుంచి 2023 మధ్య కాలంలో అదే స్థలాన్ని ఏకంగా 25 మంది వేర్వేరు వ్యక్తులకు విక్రయించాడు. ప్రతి కొనుగోలుదారుడికి నకిలీ అగ్రిమెంట్లు, తప్పుడు వివరాలతో కూడిన పత్రాలను సృష్టించి ఇచ్చాడు. నెలవారీ అద్దె ఇస్తామని నమ్మించి కొనుగోలుదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. 2025 ఆగస్టు వరకు అద్దెలు చెల్లించి నమ్మకం కలిగించి, ఆపై హఠాత్తుగా చేతులెత్తేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Also Read:Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!
బాధితులందరి వద్ద పేమెంట్ రిసిప్టులు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అయినా వారికి ఆస్తి దక్కకపోవడానికి కారణం ‘ప్రియారిటీ ఆఫ్ రిజిస్ట్రేషన్’. చట్ట ప్రకారం.. ఒకే ఆస్తిని పదే పదే విక్రయించినప్పుడు, అందరికంటే ముందుగా (ఫస్ట్ ఇన్ టైమ్) ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారికే చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయి. మిగిలిన వారు తమ సొమ్మును రికవరీ చేసుకోవడానికి క్రిమినల్ కేసులు వేయాల్సి ఉంటుంది తప్ప, ఆస్తిపై వారికి యాజమాన్య హక్కులు ఉండవు.
కొనేముందు ఈ 7 పత్రాలు తప్పనిసరి సరి చూసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే మదర్ డీడ్, సేల్ డీడ్, ఎన్కాంబ్రాన్స్ సర్టిఫికెట్ (EC), మ్యుటేషన్ రికార్డ్స్, ప్రాపర్టీ ట్యాక్స్ రికార్డ్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC), రేరా (RERA) రిజిస్ట్రేషన్ కచ్చితంగా ఉండాలి. కేవలం రిజిస్ట్రేషన్ పత్రం చూడటమే కాకుండా, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో సదరు ఆస్తిపై గతంలో ఏవైనా లావాదేవీలు జరిగాయా అని ‘సెర్చ్ రిపోర్ట్’ తీసుకోవడం అత్యంత ముఖ్యం.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!