Fake Property Sale: ఒక్క ప్రాపర్టీనే 25 మందికి అమ్మేశారు.. వీరి మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి గురుగ్రామ్ ఒక స్వర్గధామంలా కనిపిస్తుంది. కానీ, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ భారీ కుంభకోణం ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కళ్లు చెదిరే లాభాలు, గ్యారెంటీ అద్దెలు అంటూ ఆశ చూపి ఒకే ఆస్తిని పదుల సంఖ్యలో వ్యక్తులకు విక్రయించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ రికార్డులు, డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని నమ్మించి చేసిన ఈ మాయాజాలం రియల్ ఎస్టేట్ పారదర్శకతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. దాదాపు రూ.500 కోట్ల విలువైన ఈ స్కామ్, కేవలం సామాన్యులనే కాకుండా బడా ఇన్వెస్టర్లను సైతం నివ్వెరపోయేలా చేసింది. గురుగ్రామ్లోని అత్యంత ఖరీదైన కమర్షియల్ ప్రాజెక్టులలో ఒకటైన ’32nd Avenue’ వేదికగా ఈ భారీ మోసం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ప్రమోటర్ , సీఈఓ ధ్రువ్ దత్ శర్మ ఫిబ్రవరి 2026లో పోలీసులకు చిక్కడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
మోసం చేసిన తీరు ఇదే..
Also Read
- Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
- Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్
- EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
- Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
నిందితుడు అత్యంత చాకచక్యంగా 3,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఒక కమర్షియల్ ఫ్లోర్ను ఎంపిక చేసుకున్నాడు. 2021 నుంచి 2023 మధ్య కాలంలో అదే స్థలాన్ని ఏకంగా 25 మంది వేర్వేరు వ్యక్తులకు విక్రయించాడు. ప్రతి కొనుగోలుదారుడికి నకిలీ అగ్రిమెంట్లు, తప్పుడు వివరాలతో కూడిన పత్రాలను సృష్టించి ఇచ్చాడు. నెలవారీ అద్దె ఇస్తామని నమ్మించి కొనుగోలుదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. 2025 ఆగస్టు వరకు అద్దెలు చెల్లించి నమ్మకం కలిగించి, ఆపై హఠాత్తుగా చేతులెత్తేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Also Read:Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!
బాధితులందరి వద్ద పేమెంట్ రిసిప్టులు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అయినా వారికి ఆస్తి దక్కకపోవడానికి కారణం ‘ప్రియారిటీ ఆఫ్ రిజిస్ట్రేషన్’. చట్ట ప్రకారం.. ఒకే ఆస్తిని పదే పదే విక్రయించినప్పుడు, అందరికంటే ముందుగా (ఫస్ట్ ఇన్ టైమ్) ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారికే చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయి. మిగిలిన వారు తమ సొమ్మును రికవరీ చేసుకోవడానికి క్రిమినల్ కేసులు వేయాల్సి ఉంటుంది తప్ప, ఆస్తిపై వారికి యాజమాన్య హక్కులు ఉండవు.
కొనేముందు ఈ 7 పత్రాలు తప్పనిసరి సరి చూసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే మదర్ డీడ్, సేల్ డీడ్, ఎన్కాంబ్రాన్స్ సర్టిఫికెట్ (EC), మ్యుటేషన్ రికార్డ్స్, ప్రాపర్టీ ట్యాక్స్ రికార్డ్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC), రేరా (RERA) రిజిస్ట్రేషన్ కచ్చితంగా ఉండాలి. కేవలం రిజిస్ట్రేషన్ పత్రం చూడటమే కాకుండా, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో సదరు ఆస్తిపై గతంలో ఏవైనా లావాదేవీలు జరిగాయా అని ‘సెర్చ్ రిపోర్ట్’ తీసుకోవడం అత్యంత ముఖ్యం.
తాజావార్తలు
-
Faculty Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్వ్యూలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు..
-
PM Modi: ఈ షో హౌస్పుల్.. బ్లాక్బస్టర్.. మెల్బోర్న్ సభపై మోడీ ప్రశంసలు
-
Ashwin: “అన్యాయం జరుగుతోంది.. ప్లేయర్స్ని ఒకేలా చూడటం లేదు”.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
-
China: “చైనా వృద్ధి 2 శాతం మాత్రమే” అన్న ఆర్థికవేత్త అనుమానాస్పద మృతి
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!