Stock Market: స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్.. రికార్డు స్థాయిలో సిప్(SIP)లు.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్చి 2026 నెలలో భారతదేశ మ్యూచువల్ ఫండ్ రంగం కొత్త రికార్డులను సృష్టించింది. సామాన్యులు నెలల వారీగా పెట్టుబడి పెట్టే SIP ఇన్ ఫ్లో మొదటిసారిగా రూ. 32,087 కోట్లకు చేరింది. ఫిబ్రవరితో పోలిస్తే ఇది 8 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే సిప్ పెట్టుబడులు ఏకంగా 24 శాతం పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో దాదాపు 9.72 కోట్ల సిప్ ఖాతాలు ఉన్నాయి. ప్రజలు క్రమశిక్షణతో కూడిన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారని ఇది స్పష్టం చేస్తోంది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోని మొత్తం ఆస్తుల విలువ (AUM) రూ. 73.73 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో కేవలం సిప్ ద్వారా వచ్చిన ఆస్తులే రూ. 15.10 లక్షల కోట్లు (సుమారు 20.5 శాతం) ఉండటం విశేషం.
మ్యూచువల్ ఫండ్ ఖాతాల సంఖ్య మార్చి నాటికి 27.39 కోట్లకు చేరింది. కేవలం ఒక్క నెలలోనే 33.63 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఈక్విటీ ఫండ్లలోకి పెట్టుబడులు రావడం ఇది వరుసగా 61వ నెల. దీర్ఘకాలికంగా సంపదను సృష్టించుకోవడానికి భారతీయులు మ్యూచువల్ ఫండ్లను నమ్ముతున్నారని దీనిని బట్టి అర్థమవుతోంది.
Also Read
- Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
- LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
- UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
- Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
Also Read:Inter Results : ఎల్లుండి ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..!
సిప్ పెట్టుబడులు బలంగా ఉన్నప్పటికీ.. ఫిబ్రవరితో పోలిస్తే ఆస్తుల విలువ (Net AUM) కొంత తగ్గింది. అయితే.. రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం, ప్రజలు తమ ఆర్థిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవడం వల్ల ఈ వృద్ధి సాధ్యమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!