Municipal Elections: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మున్సిపల్ ఎన్నికలకు అంతా సిద్ధం.. ముహూర్తం అప్పుడే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లింది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కార్ సమరశంఖం పూరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే 3 నుంచి 4 నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల సందడి ముగియగా.. ఏపీలో కూడా అదే జోష్తో మున్సిపల్ పోరుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులందరూ ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం కావాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
ఏపీ కేబినెట్ భేటీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రాథమిక కసరత్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త జనాభా లెక్కల సేకరణలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రకారమే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. దీని ప్రకారం వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
గత కొద్ది కాలంగా పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికి క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేయాలని, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మంత్రులకు సీఎం దిశానిర్దేశం
మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయానికి నిదర్శనంగా మారుతాయని, కాబట్టి ఏమాత్రం అశ్రద్ధ వహించకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పట్టణ ఓటర్లను ఆకర్షించేలా ప్రత్యేక వ్యూహాలు రచించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రింకింగ్ వాటర్, రోడ్ల మరమ్మతులు వంటి మౌలిక అంశాలపై దృష్టి సారించి, సమస్యలను పరిష్కరించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లడం ద్వారా సానుకూల ఫలితాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా త్వరలోనే మోగనుండటంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ప్రధాన పార్టీలన్నీ అప్పుడే అభ్యర్థుల ఎంపిక మరియు వార్డుల వారీగా వ్యూహాలపై దృష్టి పెట్టాయి.
తాజావార్తలు
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?