Municipal Elections: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మున్సిపల్ ఎన్నికలకు అంతా సిద్ధం.. ముహూర్తం అప్పుడే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లింది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కార్ సమరశంఖం పూరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే 3 నుంచి 4 నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల సందడి ముగియగా.. ఏపీలో కూడా అదే జోష్తో మున్సిపల్ పోరుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులందరూ ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం కావాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
ఏపీ కేబినెట్ భేటీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రాథమిక కసరత్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త జనాభా లెక్కల సేకరణలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రకారమే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. దీని ప్రకారం వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
Also Read
- Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
- ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
- Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
- YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
గత కొద్ది కాలంగా పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికి క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేయాలని, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మంత్రులకు సీఎం దిశానిర్దేశం
మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయానికి నిదర్శనంగా మారుతాయని, కాబట్టి ఏమాత్రం అశ్రద్ధ వహించకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పట్టణ ఓటర్లను ఆకర్షించేలా ప్రత్యేక వ్యూహాలు రచించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రింకింగ్ వాటర్, రోడ్ల మరమ్మతులు వంటి మౌలిక అంశాలపై దృష్టి సారించి, సమస్యలను పరిష్కరించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లడం ద్వారా సానుకూల ఫలితాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా త్వరలోనే మోగనుండటంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ప్రధాన పార్టీలన్నీ అప్పుడే అభ్యర్థుల ఎంపిక మరియు వార్డుల వారీగా వ్యూహాలపై దృష్టి పెట్టాయి.
తాజావార్తలు
-
Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
-
Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
-
Mr Perfect Copyright Case: దిల్రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసులో కీలక పరిణామం!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..