రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత్లో కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోడీ స్వయంగా వెళ్లి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఒకే కారులో ప్రయాణం చేశారు.
హెచ్-1బీ వీసాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన ఆంక్షలు విధించారు. దీంతో చాలా మంది హెచ్-1బీ వీసా దొరకక నానా యాతన పడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల వారు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
ఇండిగో విమాన సంస్థ ఇచ్చిన షాక్తో ప్రయాణికులు ఎయిర్పోర్టులో నరకయాతన పడుతున్నారు. అటు ప్రయాణాలు లేక.. ఇటు ఇంటికి వెళ్లలేక.. తిండి తిప్పలు లేక విమానాశ్రయాల్లోనే పడిగాపులు పడుతున్నారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముర్షిదాబాద్లో బాబ్రీ మసీదు ప్రతిరూపాన్ని నిర్మించాలనే ప్రతిపాదనపై తీసుకొచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు
ఎయిరిండియా విమాన సంస్థపై ప్రముఖ సితార్ వాయిద్య కళాకారిణి అనౌష్క శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎయిరిండియా విమానంలో ప్రయాణించేటప్పుడు తన సితార్ విరిపోయిందని.. దీనికి ఎయిరిండియానే కారణమంటూ తీవ్ర కోపాన్ని వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం వీడియో వైరల్గా మారింది.
వచ్చే ఏడాది ప్రారంభంలోనే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి నాలుగోసారి అధికారం కోసం మమత.. ఈసారైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తహతహలాడుతున్నాయి.
రూపాయి మారకం విలువ ప్రస్తుతం క్షీణించింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించి 90 మార్కు దాటింది. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంట్ హాల్లోకి వెళ్తున్న వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీని ఇదే విషయంపై మీడియా ప్రశ్నించింది.
పసిడి ప్రియులకు గుడ్న్యూస్. గురువారం బంగారం ధరలు తగ్గాయి. పుత్తడి ధరలు రోజుకో విధంగా ఉంటున్నాయి. ఒకరోజు స్వల్పంగా తగ్గుతుంటే.. ఇంకో రోజు భారీగా పెరిగిపోతున్నాయి.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు న్యూయార్క్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ మేయర్ ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ హెచ్చరికలు జారీ చేశారు. నెతన్యాహు న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ మనవడు దేవేంద్ర గెహ్లాట్ వివాదంలో చిక్కుకున్నాడు. అతడి భార్య దివ్య గెహ్లాట్ వరకట్న వేధింపులు ఆరోపణలు చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.