Indigo Flights-DGCA: ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు.. ఇండిగో అధికారులను పిలిచిన డీజీసీఏ
- దేశ వ్యాప్తంగా 200 ఇండిగో విమానాలు రద్దు
- ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులకు నరకయాతన
- సమాధానం చెప్పేవాళ్లు లేక ఆందోళనలు
- ఇండిగో అధికారులను పిలిచిన డీజీసీఏ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండిగో విమాన సంస్థ ఇచ్చిన షాక్తో ప్రయాణికులు ఎయిర్పోర్టులో నరకయాతన పడుతున్నారు. అటు ప్రయాణాలు లేక.. ఇటు ఇంటికి వెళ్లలేక.. తిండి తిప్పలు లేక విమానాశ్రయాల్లోనే పడిగాపులు పడుతున్నారు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రెండు రోజుల నుంచి 200 విమానాలు ఆగిపోయాయి. కొన్ని నడుస్తున్నా.. అవి కూడా సమయ పాలన లేకుండా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏ ఎయిర్పోర్టుల్లో చూసినా వేలాది మంది ప్రయాణికులతో గజిబిజి గందరగోళం నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఎయిర్పోర్టులకు చేరుకున్న ప్రయాణికులు అయోమయం, గందరగోళానికి గురవుతున్నారు. సమాధానాలు చెప్పేవాళ్లు లేక ఆందోనలు, నిరసనలు చేపడుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రయాణికులు వేడుకోలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: ఎన్నికల సమయంలో మమత యాక్షన్.. ముస్లిం ఎమ్మెల్యే సస్పెండ్
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
పైకి సిబ్బంది కొరత, సాంకేతిక సమస్య అని చెబుతున్నప్పటికీ ఇంకేదో సమస్య ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇండిగో విమాన సంస్థ నుంచి సరైన వివరణ బయటకు రాలేదు. అయితే ప్రస్తుతం ఎయిర్పోర్టులో గందరగోళం నెలకొనడంతో ఇండిగో అధికారులను పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) సమావేశానికి పిలిచింది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో విమానాల రాకపోకలకు గల కారణాలను అడిగి తెలుసుకోనుంది.
ఇది కూడా చదవండి: Air India-Anoushka Shankar: నా సితార్ను నాశనం చేశారు.. ఎయిరిండియాపై కళాకారిణి ఆగ్రహం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 200 విమానాలు రద్దయ్యాయి. ఇక గురువారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో 33 విమానాలు రద్దు కాగా.. బెంగళూరులో 73, హైదరాబాద్లో 68, అహ్మదాబాద్లో ఐదు, కోల్కతాలో నాలుగు విమానాలు రద్దు అయ్యాయి. బుధవారం నుంచి సిబ్బంది కొరత కారణంగా ఈ ఇబ్బందులు తలెత్తినట్లుగా విమాన సంస్థ చెబుతోంది.
సహజంగా శీతాకాలంలో ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి. విదేశాల్లో క్రిస్మస్ సెలవులు ఉంటాయి. దీంతో ఎక్కువ ప్రయాణాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఫీక్ టైమ్లో ఇండిగో విమానాలు ఆగిపోవడంతో ఎమర్జెన్సీ జర్నీ చేసేవాళ్లంతా ఆగమాగం అయిపోతున్నారు. సమస్య పరిష్కరించాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!