Indigo Flights-DGCA: ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు.. ఇండిగో అధికారులను పిలిచిన డీజీసీఏ
- దేశ వ్యాప్తంగా 200 ఇండిగో విమానాలు రద్దు
- ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులకు నరకయాతన
- సమాధానం చెప్పేవాళ్లు లేక ఆందోళనలు
- ఇండిగో అధికారులను పిలిచిన డీజీసీఏ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండిగో విమాన సంస్థ ఇచ్చిన షాక్తో ప్రయాణికులు ఎయిర్పోర్టులో నరకయాతన పడుతున్నారు. అటు ప్రయాణాలు లేక.. ఇటు ఇంటికి వెళ్లలేక.. తిండి తిప్పలు లేక విమానాశ్రయాల్లోనే పడిగాపులు పడుతున్నారు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రెండు రోజుల నుంచి 200 విమానాలు ఆగిపోయాయి. కొన్ని నడుస్తున్నా.. అవి కూడా సమయ పాలన లేకుండా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏ ఎయిర్పోర్టుల్లో చూసినా వేలాది మంది ప్రయాణికులతో గజిబిజి గందరగోళం నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఎయిర్పోర్టులకు చేరుకున్న ప్రయాణికులు అయోమయం, గందరగోళానికి గురవుతున్నారు. సమాధానాలు చెప్పేవాళ్లు లేక ఆందోనలు, నిరసనలు చేపడుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రయాణికులు వేడుకోలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: ఎన్నికల సమయంలో మమత యాక్షన్.. ముస్లిం ఎమ్మెల్యే సస్పెండ్
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
పైకి సిబ్బంది కొరత, సాంకేతిక సమస్య అని చెబుతున్నప్పటికీ ఇంకేదో సమస్య ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇండిగో విమాన సంస్థ నుంచి సరైన వివరణ బయటకు రాలేదు. అయితే ప్రస్తుతం ఎయిర్పోర్టులో గందరగోళం నెలకొనడంతో ఇండిగో అధికారులను పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) సమావేశానికి పిలిచింది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో విమానాల రాకపోకలకు గల కారణాలను అడిగి తెలుసుకోనుంది.
ఇది కూడా చదవండి: Air India-Anoushka Shankar: నా సితార్ను నాశనం చేశారు.. ఎయిరిండియాపై కళాకారిణి ఆగ్రహం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 200 విమానాలు రద్దయ్యాయి. ఇక గురువారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో 33 విమానాలు రద్దు కాగా.. బెంగళూరులో 73, హైదరాబాద్లో 68, అహ్మదాబాద్లో ఐదు, కోల్కతాలో నాలుగు విమానాలు రద్దు అయ్యాయి. బుధవారం నుంచి సిబ్బంది కొరత కారణంగా ఈ ఇబ్బందులు తలెత్తినట్లుగా విమాన సంస్థ చెబుతోంది.
సహజంగా శీతాకాలంలో ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి. విదేశాల్లో క్రిస్మస్ సెలవులు ఉంటాయి. దీంతో ఎక్కువ ప్రయాణాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఫీక్ టైమ్లో ఇండిగో విమానాలు ఆగిపోవడంతో ఎమర్జెన్సీ జర్నీ చేసేవాళ్లంతా ఆగమాగం అయిపోతున్నారు. సమస్య పరిష్కరించాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!