Mamata Banerjee: ఎన్నికల సమయంలో మమత యాక్షన్.. ముస్లిం ఎమ్మెల్యే సస్పెండ్
- ఎన్నికల సమయంలో మమత యాక్షన్
- పార్టీ నుంచి ముస్లిం ఎమ్మెల్యే కబీర్ సస్పెండ్
- పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముర్షిదాబాద్లో బాబ్రీ మసీదు ప్రతిరూపాన్ని నిర్మించాలనే ప్రతిపాదనపై తీసుకొచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Priyanka Gandhi: రూపాయి విలువ పడిపోతే నన్నెందుకు అడుగుతున్నారు.. వాళ్లను అడగండి.. ప్రియాంకాగాంధీ రుసరుసలు
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
బాబ్రీ మసీదు ప్రతిపాదనపై పార్టీ నుంచి తీవ్ర అభ్యంతరాలు ఉన్నప్పటికీ డిసెంబర్ 6న ముర్షిదాబాద్లోని బెల్దంగాలో బాబ్రీ మసీదు ప్రతిరూపానికి శంకుస్థాపన చేయాలనే ప్రణాళికను హుమాయున్ కబీర్ ప్రకటించారు. దీంతో పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొండిగా వ్యవహరించిన ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: MSG : మనశంకర వరప్రసాద్.. సెకండ్ సాంగ్ రిలీజ్ కు డేట్ లాక్
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ ప్రత్యేక సర్వేపై గురువారం భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దులోని ముర్షిదాబాద్ జిల్లాలో నిరసనలకు మమత పిలుపునిచ్చారు. అయితే నిరసన ర్యాలీలో పాల్గొనే ముందు మమత ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది.
‘‘ముర్షిదాబాద్కు చెందిన మా ఎమ్మెల్యేలలో ఒకరు అకస్మాత్తుగా బాబ్రీ మసీదును నిర్మిస్తానని ప్రకటించడాన్ని మేము గమనించాము. అకస్మాత్తుగా బాబ్రీ మసీదు ఎందుకు? మేము ఇప్పటికే అతన్ని హెచ్చరించాము. టీఎంసీ నిర్ణయం ప్రకారం మేము ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ను సస్పెండ్ చేస్తున్నాము.’’ అని పార్టీ నాయకుడు, కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ నిర్ణయాన్ని ప్రకటించారు.
అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 6న ముర్షిదాబాద్లోని బెల్దంగాలో బాబ్రీ మసీదు ప్రతిరూపానికి శంకుస్థాపన చేయాలనే ప్రణాళికను ఎమ్మెల్యే కబీర్ తీసుకొచ్చారు. అయితే హుమాయున్ కబీర్ ప్రకటనలు శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తుంటే… ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదని బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారని వర్గాలు తెలిపాయి. మొత్తానికి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రకటన చేయడంతో ఎమ్మెల్యే కబీర్ను సస్పెండ్ చేశారు.
తాజావార్తలు
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!