చేతులు కాలాక.. ఆకులు పట్టుకోవడమంటే ఇదేనేమో.. విపత్తు జరిగితేనే తప్ప అధికారులు మొద్ద నిద్ర వీడరేమో. ఇటీవల ఢిల్లీలో కురిసిన భారీ వర్షానికి ఓ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి నీళ్లు ప్రవేశించి లైబ్రరీలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు జలసమాధి అయిపోయారు.
కేరళలోని వయనాడ్ను కనీవినీ ఎరుగని రీతిలో భారీ విలయం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అందరూ గాఢనిద్రలో ఉండగా మధ్య రాత్రిలో ఒక్కసారిగా కొండచరియలు విరుచుకుపడడంతో గ్రామాలు.. గ్రామాలే నామరూపాలు లేకుండా పోయాయి.
చైనాలో భారత్ ఇన్ఫ్లుయెనర్స్ ప్రవర్తనపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఆమె చర్యను జాత్యహంకారంగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలుకుతున్నారు. అసలు ఇంతకీ ఏమైంది? ఆమెపై మండిపడడానికి గల కారణమేంటో ఈ వార్త చదవండి.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో కీలక బిల్లు ఆమోదించింది. ‘లవ్ జిహాద్’ బిల్లుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై దోషులకు యావజ్జీవం శిక్ష పడే అవకాశం ఉంటుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతరులపై దాఖలు చేసిన సీబీఐ చార్జిషీట్ను ఆగస్టు 12న ఢిల్లీ కోర్టు పరిశీలించాలని నిర్ణయించింది.
చెన్నైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్పై ఉక్కుపాదం మోపారు. శ్రీలంకకు అక్రమంగా తరలిస్తుండగా రూ.70 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ను స్వాధీనం చేసుకున్నారు
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఢిల్లీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా.. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందినట్లుగా ఆరోపణలు రావడంతో ఆమెపై యూపీఎస్సీ యాక్షన్ తీసుకుంది.
సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్కు విడాకులు మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కునాల్ కపూర్ భార్య ధర్మాసనాన్ని ఆశ్రయించడంతో సుప్రీం కోర్టు తాజాగా స్టే విధించింది