Wayanad landslides: వయనాడ్ విలయంపై శాస్త్రవేత్తల అనుమానాలివే..!
- వయనాడ్ విలయంపై శాస్త్రవేత్తల కొత్త అనుమానాలు
- అరేబియా సముద్రం వేడెక్కడమే కారణమని వెల్లడి
కేరళలోని వయనాడ్ను కనీవినీ ఎరుగని రీతిలో భారీ విలయం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అందరూ గాఢనిద్రలో ఉండగా మధ్య రాత్రిలో ఒక్కసారిగా కొండచరియలు విరుచుకుపడడంతో గ్రామాలు.. గ్రామాలే నామరూపాలు లేకుండా పోయాయి. ఇప్పటికే వంద మంది మృతదేహాలను వెలికితీయగా.. మరికొందరు శిథిలాల్లో చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా వందలాది మంది గాయాలు పాలయ్యారు. ఈ ఘోరం.. కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఒక్కసారిగా ఇంత పెద్ద స్థాయిలో విపత్తు సంభవించడంపై వాతావరణశాఖ నిపుణులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
అయితే ఈ విపత్తుకు అరేబియా సముద్రం వేడెక్కడమే కారణంగా భావిస్తున్నారు. నిమిషాల వ్యవధిలోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం కారణంగానే వాయనాడ్లో కొండచరియలు విరిగిపడ్డాయని వాతావరణ శాస్త్రవేత్త చెప్పారు. అరేబియా సముద్రం వేడెక్కడం కారణంగా డీప్ క్లౌడ్ సిస్టమ్స్ ఏర్పడి.. తక్కువ వ్యవధిలో కేరళలో అత్యంత భారీ వర్షాలు కురిశాయని.. దీంతో కొండచరియలు విరిగిపడతాయని సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త మంగళవారం తెలిపారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
చురుకైన రుతుపవనాల కారణంగా ఆఫ్షోర్ ద్రోణి ప్రభావంతో కాసర్గోడ్, కన్నూర్, వాయనాడ్, కాలికట్, మలప్పురం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోని అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రాడార్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్ అభిలాష్ తెలిపారు. గత రెండు వారాలుగా కొంకణ్ ప్రాంతం తేమగా ఉంది. అరేబియా సముద్రంలో సోమవారం మేసోస్కేల్ క్లౌడ్ వ్యవస్థ ఏర్పడింది. దీని కారణంగా వాయనాడ్, కాలికట్, మలప్పురం, కన్నూర్లలో అత్యంత భారీ వర్షాలు కురిశాయని.. ఫలితంగా స్థానికంగా కొండచరియలు విరిగిపడ్డాయని ఆయన తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 30 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని అభిలాష్ చెప్పారు. అంతేకాకుండా మరో రెండు రోజులు ఇలానే ఉంటుందని తెలిపారు.
మంగళవారం తెల్లవారుజామున కేరళలోని వాయనాడ్ జిల్లాలోని కొండ ప్రాంతాలలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కనీసం 100 మంది మరణించారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!