Celebrity Chef Kunal Kapur: చెఫ్ కునాల్ కపూర్ విడాకులపై సుప్రీంకోర్టు స్టే
- చెఫ్ కునాల్ కపూర్ విడాకులపై సుప్రీంకోర్టు స్టే
- సమస్యను పరిష్కరించాలని మధ్యవర్తిత్వానికి సిఫార్సు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్కు విడాకులు మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కునాల్ కపూర్ భార్య ధర్మాసనాన్ని ఆశ్రయించడంతో సుప్రీం కోర్టు తాజాగా స్టే విధించింది. సెటిల్మెంట్కు గల అవకాశాలను అన్వేషించాలని బెంచ్ కేసును న్యాయస్థానం మధ్యవర్తిత్వ కేంద్రానికి రిఫర్ చేసింది. కునాల్ దంపతులకు గత ఏప్రిల్లో హైకోర్టు విడాకులు మంజూరు అయ్యాయి.
ఇది కూాడా చదవండి: Chandrababu: న్యాయ విద్యార్థి చికిత్సకు సీఎం రూ. 10 లక్షల సాయం.. ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం సోమవారం విడాకులపై స్టే విధిస్తూ… సెటిల్మెంట్ అవకాశాలను అన్వేషించాలని మధ్యవర్తిత్వ కేంద్రానికి సుప్రీంకోర్టు రిఫర్ చేసింది. కపూర్ పట్ల భార్య క్రూరత్వానికి పాల్పడిందనే కారణంతోనే ఢిల్లీ హైకోర్టు గత ఏప్రిల్లో విడాకులు మంజూరు చేసింది. భర్త పట్ల భార్యకు ఉండాల్సిన ప్రవర్తన.. గౌరవం లేదని పేర్కొంది. జీవిత భాగస్వామి మరొకరి పట్ల ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉండడం కరెక్ట్ కాదని చెప్పింది.
ఇది కూాడా చదవండి: Vanitha: 43 ఏళ్ల వయసు.. ముగ్గురు పిల్లలు.. నాలుగో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్!
ఈ జంట ఏప్రిల్ 2008లో వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో ఒక కుమారుడు జన్మించాడు. కునాల్ కపూర్..
టెలివిజన్ షో ‘మాస్టర్చెఫ్ ఇండియా’లో న్యాయనిర్ణేతగా ఉన్నారు. కునాల్ కపూర్ విడాకులు సందర్భంగా తన పిటిషన్లో భార్య తన తల్లిదండ్రులను గౌరవించడం లేదని.. అలాగే తనను అవమానించిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కునాల్ భార్య ఖండించింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించింది.
ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు సోమవారం నుంచి లోక్ అదాలత్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పలు కేసులను పరిష్కరిస్తున్నారు. దీన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేశారు. విడాకులు తీసుకోవడానికి వచ్చిన ఓ జంట.. తర్వాత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుని కలిసి పోయారని గుర్తుచేశారు.
ఇది కూాడా చదవండి: Ayodhya Saryu River: అయోధ్య సరయూ నదిలో జనగామ జిల్లా యువతి గల్లంతు.. 24 గంటలు కావస్తున్నా..!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!