PM Modi: ప్రధాని మోడీ సరికొత్త పంథా.. ఉక్రెయిన్కు ఎలా వెళ్లనున్నారంటే…!
- ప్రధాని మోడీ సరికొత్త పంథా
- రైల్లో ఉక్రెయిన్కు వెళ్లనున్నట్లు సమాచారం
- పోలాండ్.. ఉక్రెయిన్లో పర్యటించనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. రేపటి నుంచి మూడ్రోజుల పాటు పోలాండ్, ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. అయితే ఈసారి ప్రధాని మోడీ సరికొత్త పంథాను ఎంచుకున్నారు. విమానాల్లో కాకుండా ఉక్రెయిన్కు రైల్లో ప్రయాణం చేసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 10 గంటల పాటు ట్రైన్లో ప్రయాణం చేయనున్నారు. ఇలా వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడు మొత్తం 20 గంటలు ప్రయాణం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Bihar: పామును నోటితో కరిచి చంపేసిన చిన్నారి.. వైద్యుల దగ్గరకు తీసుకెళ్తే..!
Also Read
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
- AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
ప్రధాని మోడీ ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్లో పర్యటించనున్నారు. 22వ తారీఖున పోలాండ్ సరిహద్దులో నుంచి రైలు మార్గం గుండా విలాసవంతమైన ట్రైనులో ప్రయాణిస్తూ ఉక్రెయిన్ చేరుకోనున్నారు. ఆగస్టు 23న ఉక్రెయిన్ చేరుకున్న తర్వాత అక్కడ 7 గంటల పాటు పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత ప్రధాని మోడీ ఉక్రెయిన్లో పర్యటించడంతో ప్రధాన్యత సంతరించుకుంది. గత 30 ఏళ్లలో భారత ప్రధాని ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి: Kolkata Doctor Murder Case: “నాన్న.. తిని మందులు వేసుకుని పడుకో”.. బాధితురాలి చివరి కాల్
ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోడీ చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై చర్చించనున్నారు. ఏడు గంటల పాటు గడిపిన తర్వాత తిరుగు ప్రయాణంలోనూ మోడీ రైలు ద్వారానే పోలాండ్కు వస్తారు. ఇలా మూడు రోజుల పర్యటన ముగించుకుని మోడీ భారత్కు రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సహా పలువురు నేతలు ఉక్రెయిన్ పర్యటించినప్పుడు రైలు మార్గాన్నే ఎంచుకోవడం విశేషం. మొత్తానికి మోడీ వెళ్లేటప్పుడు 10 గంటలు.. వచ్చేటప్పుడు మరో 10 గంటల పాటు రైల్లో ప్రయాణం చేయనున్నారు.
ఇక మోడీ ప్రయాణించే రైల్లో విలాసవంతమైన క్యాబిన్లు ఉంటాయి. సమావేశాల కోసం పెద్ద పెద్ద టేబుల్స్, సోఫా, టీవీతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన పడక గది ఉంటుంది. వీటి భద్రత కూడా అదే స్థాయిలో ఉండేలా ఉక్రెయిన్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రష్యాతో యుద్ధం నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోనున్నారు.
ఇది కూడా చదవండి: Tesla Job Offer: బంపర్ ఆఫర్.. 7గంటల పనికి రూ.28,000!..అర్హతలివే..
తాజావార్తలు
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..