PM Modi: ప్రధాని మోడీ సరికొత్త పంథా.. ఉక్రెయిన్కు ఎలా వెళ్లనున్నారంటే…!
- ప్రధాని మోడీ సరికొత్త పంథా
- రైల్లో ఉక్రెయిన్కు వెళ్లనున్నట్లు సమాచారం
- పోలాండ్.. ఉక్రెయిన్లో పర్యటించనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. రేపటి నుంచి మూడ్రోజుల పాటు పోలాండ్, ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. అయితే ఈసారి ప్రధాని మోడీ సరికొత్త పంథాను ఎంచుకున్నారు. విమానాల్లో కాకుండా ఉక్రెయిన్కు రైల్లో ప్రయాణం చేసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 10 గంటల పాటు ట్రైన్లో ప్రయాణం చేయనున్నారు. ఇలా వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడు మొత్తం 20 గంటలు ప్రయాణం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Bihar: పామును నోటితో కరిచి చంపేసిన చిన్నారి.. వైద్యుల దగ్గరకు తీసుకెళ్తే..!
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ప్రధాని మోడీ ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్లో పర్యటించనున్నారు. 22వ తారీఖున పోలాండ్ సరిహద్దులో నుంచి రైలు మార్గం గుండా విలాసవంతమైన ట్రైనులో ప్రయాణిస్తూ ఉక్రెయిన్ చేరుకోనున్నారు. ఆగస్టు 23న ఉక్రెయిన్ చేరుకున్న తర్వాత అక్కడ 7 గంటల పాటు పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత ప్రధాని మోడీ ఉక్రెయిన్లో పర్యటించడంతో ప్రధాన్యత సంతరించుకుంది. గత 30 ఏళ్లలో భారత ప్రధాని ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి: Kolkata Doctor Murder Case: “నాన్న.. తిని మందులు వేసుకుని పడుకో”.. బాధితురాలి చివరి కాల్
ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోడీ చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై చర్చించనున్నారు. ఏడు గంటల పాటు గడిపిన తర్వాత తిరుగు ప్రయాణంలోనూ మోడీ రైలు ద్వారానే పోలాండ్కు వస్తారు. ఇలా మూడు రోజుల పర్యటన ముగించుకుని మోడీ భారత్కు రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సహా పలువురు నేతలు ఉక్రెయిన్ పర్యటించినప్పుడు రైలు మార్గాన్నే ఎంచుకోవడం విశేషం. మొత్తానికి మోడీ వెళ్లేటప్పుడు 10 గంటలు.. వచ్చేటప్పుడు మరో 10 గంటల పాటు రైల్లో ప్రయాణం చేయనున్నారు.
ఇక మోడీ ప్రయాణించే రైల్లో విలాసవంతమైన క్యాబిన్లు ఉంటాయి. సమావేశాల కోసం పెద్ద పెద్ద టేబుల్స్, సోఫా, టీవీతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన పడక గది ఉంటుంది. వీటి భద్రత కూడా అదే స్థాయిలో ఉండేలా ఉక్రెయిన్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రష్యాతో యుద్ధం నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోనున్నారు.
ఇది కూడా చదవండి: Tesla Job Offer: బంపర్ ఆఫర్.. 7గంటల పనికి రూ.28,000!..అర్హతలివే..
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!