రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో దారుణం జరిగింది. ప్రైవేటు పాఠశాల భవనం పైనుంచి దూకి పదో తరగతి విద్యార్థి నీరజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. శాస్త్ర గ్లోబల్ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణ అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. 17.03 లక్షల రైతుల అకౌంట్లలో నిధులు పడ్డాయి.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ సమావేశం నిర్వహించింది.
తెలంగాణ టెట్ పలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నరసింహ రెడ్డి విడుదల చేశారు. పేపర్ 1లో 59.48 శాతం, పేపర్ 2లో 31.21 శాతం అర్హత సాధించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన మీద ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఢిల్లీలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.
ఏపీఎస్ఆర్టీసీకి బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండగా మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. యమునా జలాలను హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ కేజ్రీవాల్ ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్లోని ఓ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్.. క్లాస్ రూమ్లో స్టూడెంట్ను పెళ్లాడిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది.