Tejashwi Yadav: చంద్రబాబు, నితీష్కుమార్ను బ్లాక్మెయిల్ చేసేందుకే బిల్లు.. తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు
- చంద్రబాబు, నితీష్కుమార్ను బ్లాక్మెయిల్ చేసేందుకే కేంద్రం బిల్లు
- ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును బెదిరించేందుకే కేంద్రం తొలగింపు బిల్లు తీసుకొచ్చిందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన నేరారోపణలపై అరెస్టైన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు 30 రోజుల్లోగా పదవి నుంచి తొలగిపోవాలి.. లేదంటే తొలగింపబడే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. తాజాగా ఈ బిల్లుపై తేజస్వి యాదవ్ స్పందిస్తూ చంద్రబాబు, నితీష్ కుమార్ కోసమే ఈ బిల్లు తీసుకొచ్చారని ఆరోపించారు. బ్లాక్ మెయిల్ చేయడానికి.. బెదిరించడానికి కేంద్రం కుట్ర పన్నిందన్నారు.
ఇది కూడా చదవండి: Kerala: మలయాళ నటికి యువ నాయకుడు లైంగిక వేధింపులు.. సోషల్ మీడియాలో బాధితురాలు ఆవేదన
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ప్రస్తుతం మోడీ ప్రభుత్వం టీడీపీ, జేడీయూల మద్దతుతోనే నడుస్తుంది. అయితే భవిష్యత్లో వాళ్లిద్దరిని బెదిరించడానికి తొలగింపు బిల్లును కేంద్రం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఇదంతా ఒక కుట్రలో భాగంగా జరుగుతుందన్నారు. దేశం అభివృద్ధి కంటే.. నాశనానికి హింసాత్మక వ్యూహాలుు రచిస్తున్నారన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను జైల్లో పెట్టించారని.. కొత్త చట్టం ద్వారా ఇప్పుడు ఇతరులను కూడా బెదిరించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు, నిర్దిష్ట నాయకులను లక్ష్యంగా చేసుకునేందుకు ఈ బిల్లును తీసుకువస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే నితీష్ కుమార్, చంద్రబాబుపై కొత్త కేసులు నమోదు చేసే అవకాశం ఉందని.. వాళ్లిద్దరిని అదుపులో ఉంచుకునేందుకు ఏమైనా చేస్తారన్నారు.
ఇది కూడా చదవండి: B Sudershan Reddy: ప్రతిపక్ష కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్రెడ్డి నామినేషన్
ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకే ఈ బిల్లు తీసుకొస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. బుధవారం ఈ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.
#WATCH | On the bill for the removal of the PM, CMs, and ministers held on serious criminal charges, RJD leader Tejashwi Yadav says, "They are bringing this for Nitish Kumar and Chandrababu Naidu. They have only one job – to blackmail. If PMLA is slapped in ED cases, there can be… pic.twitter.com/tLCGm79lW7
— ANI (@ANI) August 21, 2025
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!