Tejashwi Yadav: చంద్రబాబు, నితీష్కుమార్ను బ్లాక్మెయిల్ చేసేందుకే బిల్లు.. తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు
- చంద్రబాబు, నితీష్కుమార్ను బ్లాక్మెయిల్ చేసేందుకే కేంద్రం బిల్లు
- ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును బెదిరించేందుకే కేంద్రం తొలగింపు బిల్లు తీసుకొచ్చిందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన నేరారోపణలపై అరెస్టైన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు 30 రోజుల్లోగా పదవి నుంచి తొలగిపోవాలి.. లేదంటే తొలగింపబడే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. తాజాగా ఈ బిల్లుపై తేజస్వి యాదవ్ స్పందిస్తూ చంద్రబాబు, నితీష్ కుమార్ కోసమే ఈ బిల్లు తీసుకొచ్చారని ఆరోపించారు. బ్లాక్ మెయిల్ చేయడానికి.. బెదిరించడానికి కేంద్రం కుట్ర పన్నిందన్నారు.
ఇది కూడా చదవండి: Kerala: మలయాళ నటికి యువ నాయకుడు లైంగిక వేధింపులు.. సోషల్ మీడియాలో బాధితురాలు ఆవేదన
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
ప్రస్తుతం మోడీ ప్రభుత్వం టీడీపీ, జేడీయూల మద్దతుతోనే నడుస్తుంది. అయితే భవిష్యత్లో వాళ్లిద్దరిని బెదిరించడానికి తొలగింపు బిల్లును కేంద్రం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఇదంతా ఒక కుట్రలో భాగంగా జరుగుతుందన్నారు. దేశం అభివృద్ధి కంటే.. నాశనానికి హింసాత్మక వ్యూహాలుు రచిస్తున్నారన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను జైల్లో పెట్టించారని.. కొత్త చట్టం ద్వారా ఇప్పుడు ఇతరులను కూడా బెదిరించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు, నిర్దిష్ట నాయకులను లక్ష్యంగా చేసుకునేందుకు ఈ బిల్లును తీసుకువస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే నితీష్ కుమార్, చంద్రబాబుపై కొత్త కేసులు నమోదు చేసే అవకాశం ఉందని.. వాళ్లిద్దరిని అదుపులో ఉంచుకునేందుకు ఏమైనా చేస్తారన్నారు.
ఇది కూడా చదవండి: B Sudershan Reddy: ప్రతిపక్ష కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్రెడ్డి నామినేషన్
ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకే ఈ బిల్లు తీసుకొస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. బుధవారం ఈ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.
#WATCH | On the bill for the removal of the PM, CMs, and ministers held on serious criminal charges, RJD leader Tejashwi Yadav says, "They are bringing this for Nitish Kumar and Chandrababu Naidu. They have only one job – to blackmail. If PMLA is slapped in ED cases, there can be… pic.twitter.com/tLCGm79lW7
— ANI (@ANI) August 21, 2025
తాజావార్తలు
-
Dil Raju: 300 కోట్ల బడ్జెట్లో భారీ వాటా హీరోకే.. టాలీవుడ్పై దిల్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
-
Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!