PM Modi: నేడు బీహార్, బెంగాల్లో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
- నేడు బీహార్, బెంగాల్లో మోడీ పర్యటన
- పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ శుక్రవారం బీహార్, పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోడీ ప్రారంభించనున్నారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు మోడీ ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం కూడా బీహార్లో పర్యటించనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో మూడు కొత్త మెట్రో లైన్లను ప్రారంభించనున్నారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం రూ.18,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. బీహార్లో రూ.13,000 కోట్లు, బెంగాల్లో రూ.5,200 కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: Nitish Kumar: మదర్సా కార్యక్రమంలో నితీష్ కుమార్ షాక్.. టోపీ ధరించేందుకు నిరాకరణ.. వీడియో వైరల్
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
గయ, పాట్నా, బెగుసరాయ్లో నాలుగు గంటల పాటు మోడీ పర్యటించనున్నారు. గయ, బక్సర్లో రూ. 6,880 కోట్ల వ్యయంతో నిర్మించిన 660 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు. ఉత్తర బీహార్లోని ముజఫర్పూర్లో హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ను పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అలాగే నమామి గంగే కార్యక్రమం కింద ముంగేర్లో రూ.520 కోట్లతో నిర్మించిన మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని కూడా ప్రారంభించనున్నారు. అదనంగా బీహార్ అంతటా దాదాపు రూ.1,260 కోట్ల విలువైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇక గయ నుంచి రెండు రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. గయ-ఢిల్లీకి అనుసంధానించే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, బీహార్లోని వైశాలి-జార్ఖండ్లోని కోడెర్మాతో అనుసంధానించే బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్రత్యేక రైలును ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ అల్టిమేటం… రెండు వారాల్లో శాంతి చర్చలు.. లేకపోతే?
ఇక సాయంత్రం పశ్చిమ బెంగాల్లో మోడీ పర్యటించనున్నారు. రూ.5,200 కోట్లకు పైగా విలువైన రవాణా ప్రాజెక్ట్లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సాయంత్రం 4:15 గంటలకు కోల్కతా మెట్రో మూడు కొత్త విస్తరణ పనులను ప్రారంభించనున్నారు. అలాగే అదనంగా కోనా ఎక్స్ప్రెస్వేపై రూ.1,200 కోట్లకు పైగా విలువైన 7.2 కి.మీ ఎలివేటెడ్ కారిడార్కు పునాది వేయనున్నారు. హౌరా-కోల్కతా మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!