PM Modi: నేడు బీహార్, బెంగాల్లో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
- నేడు బీహార్, బెంగాల్లో మోడీ పర్యటన
- పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ శుక్రవారం బీహార్, పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోడీ ప్రారంభించనున్నారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు మోడీ ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం కూడా బీహార్లో పర్యటించనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో మూడు కొత్త మెట్రో లైన్లను ప్రారంభించనున్నారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం రూ.18,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. బీహార్లో రూ.13,000 కోట్లు, బెంగాల్లో రూ.5,200 కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: Nitish Kumar: మదర్సా కార్యక్రమంలో నితీష్ కుమార్ షాక్.. టోపీ ధరించేందుకు నిరాకరణ.. వీడియో వైరల్
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
గయ, పాట్నా, బెగుసరాయ్లో నాలుగు గంటల పాటు మోడీ పర్యటించనున్నారు. గయ, బక్సర్లో రూ. 6,880 కోట్ల వ్యయంతో నిర్మించిన 660 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు. ఉత్తర బీహార్లోని ముజఫర్పూర్లో హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ను పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అలాగే నమామి గంగే కార్యక్రమం కింద ముంగేర్లో రూ.520 కోట్లతో నిర్మించిన మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని కూడా ప్రారంభించనున్నారు. అదనంగా బీహార్ అంతటా దాదాపు రూ.1,260 కోట్ల విలువైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇక గయ నుంచి రెండు రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. గయ-ఢిల్లీకి అనుసంధానించే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, బీహార్లోని వైశాలి-జార్ఖండ్లోని కోడెర్మాతో అనుసంధానించే బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్రత్యేక రైలును ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ అల్టిమేటం… రెండు వారాల్లో శాంతి చర్చలు.. లేకపోతే?
ఇక సాయంత్రం పశ్చిమ బెంగాల్లో మోడీ పర్యటించనున్నారు. రూ.5,200 కోట్లకు పైగా విలువైన రవాణా ప్రాజెక్ట్లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సాయంత్రం 4:15 గంటలకు కోల్కతా మెట్రో మూడు కొత్త విస్తరణ పనులను ప్రారంభించనున్నారు. అలాగే అదనంగా కోనా ఎక్స్ప్రెస్వేపై రూ.1,200 కోట్లకు పైగా విలువైన 7.2 కి.మీ ఎలివేటెడ్ కారిడార్కు పునాది వేయనున్నారు. హౌరా-కోల్కతా మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!