PM Modi: నేడు బీహార్, బెంగాల్లో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
- నేడు బీహార్, బెంగాల్లో మోడీ పర్యటన
- పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ శుక్రవారం బీహార్, పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోడీ ప్రారంభించనున్నారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు మోడీ ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం కూడా బీహార్లో పర్యటించనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో మూడు కొత్త మెట్రో లైన్లను ప్రారంభించనున్నారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం రూ.18,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. బీహార్లో రూ.13,000 కోట్లు, బెంగాల్లో రూ.5,200 కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: Nitish Kumar: మదర్సా కార్యక్రమంలో నితీష్ కుమార్ షాక్.. టోపీ ధరించేందుకు నిరాకరణ.. వీడియో వైరల్
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
గయ, పాట్నా, బెగుసరాయ్లో నాలుగు గంటల పాటు మోడీ పర్యటించనున్నారు. గయ, బక్సర్లో రూ. 6,880 కోట్ల వ్యయంతో నిర్మించిన 660 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు. ఉత్తర బీహార్లోని ముజఫర్పూర్లో హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ను పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అలాగే నమామి గంగే కార్యక్రమం కింద ముంగేర్లో రూ.520 కోట్లతో నిర్మించిన మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని కూడా ప్రారంభించనున్నారు. అదనంగా బీహార్ అంతటా దాదాపు రూ.1,260 కోట్ల విలువైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇక గయ నుంచి రెండు రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. గయ-ఢిల్లీకి అనుసంధానించే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, బీహార్లోని వైశాలి-జార్ఖండ్లోని కోడెర్మాతో అనుసంధానించే బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్రత్యేక రైలును ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ అల్టిమేటం… రెండు వారాల్లో శాంతి చర్చలు.. లేకపోతే?
ఇక సాయంత్రం పశ్చిమ బెంగాల్లో మోడీ పర్యటించనున్నారు. రూ.5,200 కోట్లకు పైగా విలువైన రవాణా ప్రాజెక్ట్లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సాయంత్రం 4:15 గంటలకు కోల్కతా మెట్రో మూడు కొత్త విస్తరణ పనులను ప్రారంభించనున్నారు. అలాగే అదనంగా కోనా ఎక్స్ప్రెస్వేపై రూ.1,200 కోట్లకు పైగా విలువైన 7.2 కి.మీ ఎలివేటెడ్ కారిడార్కు పునాది వేయనున్నారు. హౌరా-కోల్కతా మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
తాజావార్తలు
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!