యువత తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయంటారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వమే ఇందుకు నిదర్శనం. గతేడాది విద్యార్థుల ఉద్యమానికి తలొగ్గి.. రాజీనామా చేసి కట్టుబట్టలతో భారత్కు పారిపోయి వచ్చేశారు. తాజాగా నేపాల్లో కూడా అదే పరిస్థితి తలెత్తింది.
నేపాల్లో రెండో రోజు కూడా రణరంగంగా మారింది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేయాలంటూ సోమవారం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రభుత్వం దిగొచ్చి బ్యాన్ ఎత్తేసింది.
నేపాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోమవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. దీంతో భద్రతా దళాలు-నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20 మంది నిరసనకారులు చనిపోయారు. ఇక కేపీ శర్మ ఓలి ప్రభుత్వం నిరసనలకు దిగొచ్చి... సోషల్ మీడియాపై విధించిన బ్యాన్ను ఎత్తేసింది.
బీహార్లో ఎన్నికల వార్ నడుస్తోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నేతలు మాటల-తూటాలు పేల్చుకుంటున్నారు. ఇక నవంబర్ కల్లా బీహార్ ఎన్నికలు ముగించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది.
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. వివాహేతర సంబంధాలతో పచ్చని సంసారాలను కూల్చుకుంటున్నారు. దేశంలో ఎక్కడొక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి.
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు పార్లమెంట్ హౌస్లో ప్రారంభమైంది. తొలి ఓటు ప్రధాని మోడీ వేశారు. అనంతరం ఎంపీలంతా ఒక్కొక్కరిగా ఓట్లు వేస్తున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో ఓటింగ్ ప్రారంభమైంది. తొలి ఓటు ప్రధాని మోడీ వేశారు. రహస్య బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ.రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్రెడ్డి బరిలో ఉన్నారు.
గాజాలో మానవతాసాయం అందించేందుకు 44 దేశాల పౌరులను తీసుకెళ్తున్న గ్రెటా థన్బర్గ్ నౌక్పై డ్రోన్ దాడి జరిగింది. ట్యునీషియా దగ్గర ఈ దాడి జరిగింది. పోర్చుగీస్ జెండా కలిగిన గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా నౌక అనుమానిత దాడిలో దెబ్బతిన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.