జనసేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా శుభాకంక్షలు తెలిపిన వారితో పాటు.. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదులు తెలుపుతూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు.. సీఎం చంద్రబాబు మొదలు కొని.. జనసేన కార్యకర్తల వరకు ఎవరినీ వదలకుండా ప్రత్యేక ధన్యవాదులు తెలిపిన పవన్ కల్యాణ్ ట్వీట్లు కాస్తా ఇప్పుడు వైరల్గా మారిపోయాయి.
రాజధాని అమరావతికి కేంద్ర సాయంపై శాసనమండలిలో సమాధానం ఇస్తూ క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ.. అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని.. ఈ రుణంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు.. ఈ నిధుల్లో గ్రాంట్ ఎంత... రుణం ఎంత అనేది చర్చించి చెబుతాం. హడ్కో ద్వారా 11 వేల కోట్లు రుణం తీసుకుంటున్నాం.
నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా నాగం వర్షిత్ రెడ్డి నియామకం కమల దళంలో కల్లోలం రేపుతోందట. నియామకం తర్వాత రేగిన అసమ్మతి జ్వాలల్ని ఆర్పేందుకు అధిష్టానం ఎంతగా ప్రయత్నిస్తున్నా... తిరిగి ఎక్కడో ఒక చోట రేగుతూనే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వర్షిత్ రెడ్డి మొదటి నుండి క్యాడర్ను కలుపుకుని పోవడం లేదని, ఏకపక్ష నిర్ణయాలతో చేటు చేస్తున్నారన్నది ఆయన వ్యతిరేకుల ప్రధాన ఆరోపణ.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తిరగాలని డిసైడయ్యారు. అన్ని జిల్లాలకు వెళ్ళి, పార్టీ మీటింగ్స్ పెట్టి కేడర్లో ఉత్సాహం నింపాలన్నది ప్లాన్ అట. సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతోంది గులాబీ పార్టీ. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించేలా కార్యాచరణ ఖరారైందట
చోటా, మోటా నాయకులు కొందర్ని వెనకేసుకుని తిరుగుతూ అదితి ఎంకరేజ్ చేస్తున్నారని, వాళ్లేమో... పేనుకు పెత్తనం ఇచ్చిన చందాన చెలరేగిపోతున్నారన్నది విజయనగరం టీడీపీ సీనియర్స్ మాట. ప్రత్యేకించి అశోక్గజపతితో కలిసి రాజకీయ ప్రయాణం చేసిన వారిని ఇప్పుడీ ఛోటా మోటా లీడర్స్ టార్గెట్ చేస్తున్నారట. ఎమ్మెల్యే అదితి వెనక తిరుగుతున్న అనురాధ బేగం అనే నాయకురాలు బంగ్లాలో సర్వం నేనే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట.
కొన్ని నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన జరిగినా.. అది వివాదాస్పదంగానే మారుతూ ఉంటుంది. అక్కడి నాయకుల రాశి ఫలాలు అలా ఉంటాయని అంటారు కొందరు. ఇంకా కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే... రాశి ఫలాలు అనేకంటే.... వాళ్ల మాటలు, చేతలు అనడం కెరక్ట్ అంటారు ఎక్కువ మంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఇలాంటివి మాత్రం తప్పవు. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి అనంతపురం జిల్లా రాప్తాడు.
ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన మరో సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది.. గన్నవరంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులోని మిస్టరీని ఛేదించారు ఆత్కూరు పోలీసులు.. గన్నవరం మండలం వీరపనేని గూడెంలో ఈనెల 9వ తేదీన స్నేహితురాలి ఇంటి నుండి రాత్రి సమయంలో బయటకు వచ్చిన మైనర్ బాలిక అదృశ్యమైంది..
మహానంది క్షేత్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది.. పాతికేళ్ల నాటి నాగనంది సదనం కూల్చివేత సంఘటనలో గాయపడిన ఇద్దరు కార్మికులు శివ సన్నిధిలో మృత్యువాత పడ్డారు. క్షేత్రంలోని గాజులపల్లె టోల్ గేట్ వద్ద పాతికేళ్ల క్రితం భక్తుల కోసం నాగనంది సదనం వసతి గృహాలను నిర్మించారు ఆలయ అధికారులు.
ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కావలి గ్రీష్మ.. ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.. దీంతో.. ఏపీ మహిళా కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు గ్రీష్మ..