దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వెంటాడుతూనే ఉంది.. అయితే, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందట.. దీనికోసం క్లౌడ్-సీడింగ్ ట్రయల్స్ నిర్వహిస్తుంది.. ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తుండగా.. ఒక్కొక్కటి వేర్వేరు రోజుల్లో, విమానాలు మేఘాలలోకి రసాయనాలను ఇంజెక్ట్ చేయడానికి ఒకటి నుండి ఒకటిన్నర గంటల పాటు పనిచేస్తాయని ఓ అధికారి తెలిపారు.
వరల్డ్ క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్.. కోహ్లీ అంటూ భారత మాజీ క్రికెటర్, జాతీయ మాజీ సెలెక్టర్ శరణ్దీప్ సింగ్ ప్రశంసించారు.. విరాట్ కోహ్లీని ఒక ఐకాన్గా.. ఈ ఫార్మాట్ ఆడిన గొప్ప టెస్ట్ క్రికెటర్లలో ఒకరిగా తాను భావిస్తున్నానని అన్నారు శరణ్దీప్ సింగ్.. కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు, 123 మ్యాచ్ల్లో 46.85 సగటుతో 9230 పరుగులు చేసిన కింగ్.. ఒక అద్భుతం.. నిజానికి విరాట్ ఒక ఐకాన్. టెస్ట్ క్రికెట్ ఆడిన గొప్ప ఆటగాళ్లలో అతను ఒకడు.. అతను ఎల్లప్పుడూ…
ధృవీకరించబడిన వ్యాపారాల నుండి సందేశాలను ఫిల్టర్ చేయడానికి ట్రూకాలర్ AI- ఆధారిత సందేశ IDలను పరిచయం చేసింది.. ట్రూకాలర్లో ఈ ఐడీలు ప్రీమియం సబ్స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేయకుండా అందరికీ అందుబాటులోకి తెచ్చింది.. స్పామ్ టెక్స్ట్లతో నిండిపోయిన ఇన్బాక్స్లోని ప్రామాణిక సందేశాలను ఫిల్టర్ చేయడంలో వినియోగదారులకు సేవలు అందించాలన్న లక్ష్యంతో ట్రూకాలర్ ఈ రోజు ఒక కొత్త ఫీచర్ను విడుదల చేసింది.
అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. విజయనగరం కలెక్టరేట్లో జరిగిన డీఆర్సీ సమావేశానికి హాజరైన ఆమె.. డీఆర్సీలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఏదో కాకి లెక్కలతో కాగితాల దొంతులుగా ప్రెస్నోట్ మా కిచ్చి వెళ్లిపోతున్నారని ఫైర్ అయ్యారు.. కానీ, ఆ పేపర్లు తర్వాత చెత్త బుట్టలోకి వెళ్లిపోతున్నాయి.. అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అబ్బూరి మాధురీ అనే మహిళ సూసైడ్ కలకలం రేపుతోంది.. సూసైడ్ కు ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేసి మాధురి.. తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు వెల్లడించింది..
హీరో విశాల్కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. వేదికపైనే స్పృహ తప్పి పడిపోయారు విశాల్.. తమిళనాడులోని విల్లుపురంలో ఈ ఘటన జరిగింది.. విల్లుపురంలో ఈ రోజు జరిగిన కూవాకం కూతాండవర్ దేవాలయ ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరునంగైవుల అలకిప్ పోటీ నిర్వహించబడింది.
పంచాయతీరాజ్ శాఖ గ్రామ పంచాయతీ పరిధిలోని భారత రక్షణ దళాల సిబ్బందికి చెందిన ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు మంజూరు చేయాలని ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.. ఈ నిర్ణయం మన దేశ భద్రత కోసం తమ జీవితాలను అంకితం చేసే మన రక్షణ దళాలు, సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, పారామిలిటరీ, CRPF సిబ్బంది యొక్క అచంచల ధైర్యాన్ని గౌరవిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వరుసగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్నారు.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను సమన్వయం చేసుకుంటూ.. అన్ని పార్టీలకు చెందినవారికి సముచిత స్థానం కల్పిస్తూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్నారు.. ఇవాళ 22 మందికి నామినేటెడ్ పోస్టులు కట్టబెడుతూ మరో లిస్ట్ విడుదల చేశారు..
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో ఐదుగురు జవాన్లు అమరులైనట్లు వెల్లడించారు DGMO రాజీవ్ ఘాయ్.. ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలపై తొలిసారి ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ DGMOలు సంయుక్త మీడియా సమావేశం.. నిర్వహించారు.. అందులో DGMO రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్లో ఐదుగురు సైనికులు అమరులయ్యారు.. ఐదుగురు జవాన్లు, పాక్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు సంతాపం తెలియజేస్తున్నాం.. అమర జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదు అన్నారు..