AP Government: అదానీకి షాక్..! ఆ ప్లాంట్లు రద్దు చేసిన ఏపీ సర్కార్..
- అదానీ గ్రూప్ కు ఏపీ సర్కార్ షాక్..!..
- పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన..
- అదానీ గ్రూప్నకు పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు ఇచ్చిన గత ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: అదానీ గ్రూప్కు కేటాయింపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం.. అదానీ గ్రూప్ కు ఇచ్చిన పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఆంధ్రా – ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో అదాని గ్రూప్నకు పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు ఇచ్చింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. అయితే, గిరిజనులకు దక్కాల్సిన ప్లాంట్లు అదానీ గ్రూప్ కు ఇవ్వడంతో వెనక్కు తీసుకుంది కూటమి సర్కార్.. మరోవైపు, తమ ప్రాంతానికి చెందిన గిరిజనులతో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం.. అయినా, గత ప్రభుత్వం అదానీ గ్రూప్ కు పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లను ఇవ్వగా.. వాటిని ఇప్పుడు రద్దు చేసింది కూటమి ప్రభుత్వం..
Read Also: Delhi Rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
Also Read
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక విధాన నిర్ణయాలపై ఫోకస్..
కాగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అదానీ గ్రూప్ యొక్క పెదకోట పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ను 1,000 నుండి 1,800 మెగావాట్లకు విస్తరించడానికి మరియు అనకాపల్లి జిల్లాలో రైవాడ PSP ని 600 నుండి 900 మెగావాట్లకు విస్తరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆమోదం పర్యావరణవేత్తల నుండి విమర్శలు వచ్చాయి.. జనవరి 2023లో సర్వే కోసం పెదకోట మరియు ఇతర గ్రామాలను సందర్శించిన సర్వే బృందాన్ని గిరిజనులు అడ్డుకున్నారు.. మరోవైపు, సామాజిక కార్యకర్త మరియు భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి E.A.S. శర్మ… ఏపీ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు రాసిన లేఖలో, PESA చట్టం (పంచాయతీల షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ చట్టం, 1996) మరియు అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించి స్థానిక గిరిజన ప్రజలను సంప్రదించకుండా ప్రాజెక్టు అనుమతులు ఏకపక్షంగా ఇవ్వబడ్డాయని ఆరోపించారు.. అదానీ గ్రూప్కు ఇచ్చిన ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడానికి అనుమతించడమే కాకుండా, స్థానిక ప్రవాహం నుండి నీటిని జల ప్రాజెక్టు కోసం ఉపయోగించుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారని మండిపడ్డారు.. గిరిజన ప్రజలకు ప్రత్యేక హక్కులను ఇచ్చే రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ కింద పెడకోట ప్రాంతాన్ని నోటిఫై చేశారని శర్మ పేర్కొన్నారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అదానీకి ఇచ్చిన పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది..
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!