Social Media Ban for Children Below 16: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం..! సీఎం కీలక ఆదేశాలు
- 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకం నిషేధంపై ఏపీ సర్కార్ కసరత్తు..
- అధ్యయనం చేయాలని పోలీస్శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశం..
- విచ్చలవిడితనానికి బ్రేకులు వేయాల్సిందేనన్న సీఎం..
- ఎవరు వ్యక్తిత్వ హననానికి పాల్పడినా వదిలిపెట్టొద్దని ఆదేశం..
- అవసరమైతే ప్రత్యేకమైన చట్టం తెస్తామన్న చంద్రబాబు..
Social Media Ban for Children Below 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది.. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ విషయంలో సమగ్రంగా అధ్యయనం చేయాలని పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు, యువతపై ప్రతికూల ప్రభావాలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా విచ్చలవిడితనానికి బ్రేకులు వేయాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. చిన్నారుల మానసిక ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: Tamarind Pulihora Recipe: అచ్చం గుడిలో పెట్టె ప్రసాదంలా ఉండే చింతపండు పులిహోర.. చేసేయండి ఇలా!
Also Read
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
ఇక, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఈ అంశంపై ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించాలని సీఎం సూచించారు. 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై అధ్యయనం చేయాలి.. వరుసగా అవగాహనా సదస్సులు నిర్వహించాలి.. తల్లిదండ్రులు, విద్యార్థులకు సోషల్ మీడియా ప్రమాదాలపై అవగాహన కల్పించాలి.. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశించారు. చట్టపరమైన అంశాలు, సాంకేతిక పరిష్కారాలు, అవగాహనా కార్యక్రమాలు అన్నింటినీ కలిపిన సమగ్ర ప్రణాళిక ఉండాలని సూచించారు. పిల్లల భద్రత, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
-
jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!