Social Media Ban for Children Below 16: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం..! సీఎం కీలక ఆదేశాలు
- 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకం నిషేధంపై ఏపీ సర్కార్ కసరత్తు..
- అధ్యయనం చేయాలని పోలీస్శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశం..
- విచ్చలవిడితనానికి బ్రేకులు వేయాల్సిందేనన్న సీఎం..
- ఎవరు వ్యక్తిత్వ హననానికి పాల్పడినా వదిలిపెట్టొద్దని ఆదేశం..
- అవసరమైతే ప్రత్యేకమైన చట్టం తెస్తామన్న చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Social Media Ban for Children Below 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది.. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ విషయంలో సమగ్రంగా అధ్యయనం చేయాలని పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు, యువతపై ప్రతికూల ప్రభావాలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా విచ్చలవిడితనానికి బ్రేకులు వేయాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. చిన్నారుల మానసిక ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: Tamarind Pulihora Recipe: అచ్చం గుడిలో పెట్టె ప్రసాదంలా ఉండే చింతపండు పులిహోర.. చేసేయండి ఇలా!
Also Read
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
ఇక, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఈ అంశంపై ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించాలని సీఎం సూచించారు. 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై అధ్యయనం చేయాలి.. వరుసగా అవగాహనా సదస్సులు నిర్వహించాలి.. తల్లిదండ్రులు, విద్యార్థులకు సోషల్ మీడియా ప్రమాదాలపై అవగాహన కల్పించాలి.. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశించారు. చట్టపరమైన అంశాలు, సాంకేతిక పరిష్కారాలు, అవగాహనా కార్యక్రమాలు అన్నింటినీ కలిపిన సమగ్ర ప్రణాళిక ఉండాలని సూచించారు. పిల్లల భద్రత, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Anil Ravipudi: ‘పెద్ది’ ట్రైలర్ పై..అనిల్ రావిపూడి భారీ ప్రశంసలు!
-
PV Sindhu: క్రీడా రంగంలో ఏఐ విప్లవం.. అథ్లెట్ల కోసం ‘టెంపుల్’ స్మార్ట్ సెన్సార్ ప్యాచ్.. ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు!
-
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
-
Manchu Manoj: మనోజ్కు డైరెక్టర్ గోపీచంద్ మాలినేని బర్త్ డే విషెస్.. బాలయ్య సినిమాలో మంచు మనోజ్ కీ రోల్!
ట్రెండింగ్
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?