చిత్తూరులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చిత్తూరు రూరల్ చెర్లోపల్లిలో జరిగిన ఘటనపై పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 12వ తేదీన ఇంట్లో మంచంపై విగతజీవిగా పడి ఉన్న సరోజ అనే మహిళది సహజ మరణంగా భావించారు. జూన్ 13వ తేదీన అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే, సరోజ కొడుకు కన్నన్ కు ఒక బాలుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆరా తీస్తే, పక్కింటిలో ఉన్న స్నేహితురాలు నదియానే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు నిర్వహించనుంది.. దీని కోసం జిల్లాకు 2 లక్షల రూపాయల చొప్పున రూ.52 లక్షలు రెవెన్యూ డేకు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.. రెవెన్యూ డే సందర్భంగా ప్రతీ రెవెన్యూ జిల్లా కార్యాలయంలో వేడుకలు నిర్వహించనున్నారు.. రెవెన్యూ ఉద్యోగుల బాధ్యతలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జరగనున్నాయి
బనకచర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలంగాణతో నేను ఎప్పుడైనా గొడవపడ్డానా? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ వాళ్లతో పోరాటం ఎందుకు? కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ కట్టుకోండి.. మిగిలిన నీటినే మేం వాడుకుంటాం అన్నారు.. ప్రాజెక్టుల విషయంలో తెలంగాణతో పోరాటం చేయను అని స్పష్టం చేశారు.. బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటాలు అవసరం లేదు.. ఎవరి నీరు వారిది.. అవసరమైతే ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుందాం.. సముద్రంలోకి పోయే నీటిని ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో వాడుకుందాం అన్నారు చంద్రబాబు..
ఒక వైపు పాజిటివ్ తో యోగా జరుగుతుంటే మరికొందరు రప్పా రప్పా అంటున్నారు.. ఒకప్పుడు ఊళ్లలో గ్రామ దేవతలకు పొట్టేళ్లు బలి ఇచ్చి రప్పా రప్పా అనేవారు.. ఇప్పుడు.. ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.. ఒకప్పుడు నేరస్తుల తో దూరంగా ఉండేవారం.. ఇప్పుడు నేరస్తులతో కలిసి రాజాకీయాలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
1,29,249 ప్రాంతాల్లో ఏపీలో యోగా చేయబోతున్నారు.. దేశమంతా 8 లక్షల ప్రాంతాల్లో యోగా చేయబోతున్నారు.. ఇది చరిత్రలో జరగలేదు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. విశాఖతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే యోగా కార్యక్రమం, ఏర్పాట్లపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యోగ పై ప్రజల్లో ఇంట్రెస్ట్ వచ్చింది.. 1 కోటి 5 లక్షల 58 వేలకు పైగా అంతర్జాతీయ యోగా డే కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.. ఇండియా మొత్తంలో 8 లక్షల లోకేషన్ లలో యోగాలో పాల్గొంటారు. యోగాను…
రప్పా.. రప్పా నరుకుతాం.. అంటే.. సంతోషం అంటారు జగన్..! ఖండించాలి కదా..? రప్పా.. రప్పా.. ఎవర్ని నరుకుతారు.. ప్రజలనా..? ప్రజాస్వామ్యన్నా..? అని ప్రశ్నించారు ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో చేసిన కామెంట్లపై స్పందించిన పయ్యావుల.. రాష్ట్రంలో రౌడీలు తన వెనక నడవమని జగన్ చెప్తున్నారు.. జగన్ ఎప్పుడూ భయపెట్టి రాజకీయం చెయ్యాలని అనుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడు హౌస్ అరెస్ట్ లు చేశారు.. అధికారం పోయాక రౌడీలను ఏకం చేస్తున్నారని విమర్శించారు.
సర్పంచ్ ఎస్సీ కావడంతో వేదిక కిందనే బీజేపీ , టీడీపీ నాయకులు నిలబెట్టారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. దీనిపై దళిత సంఘాలు ఆందోళనలు కూడా చేపట్టారు.. ఈ నేపథ్యంలో క్షమాపణ చెప్పారు ఎమ్మెల్యే పార్థసారథి..
పొగాకు, మామిడి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మామిడి, పొగాకు, కోకో పంటల మద్ధతు ధరలపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఈ ఏడాది హెచ్డీ బర్లీ పొగాకు 80 మిలియన్ కేజీల మేర ఉత్పత్తి వచ్చిందని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు.
ఆంక్షలు, ఉద్రిక్తతల మధ్య వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన సాగింది. రెంటపాళ్లలో వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించారు జగన్. అధినేతకు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చారు అభిమానులు, కార్యకర్తలు.