Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ap Government Plans Strict Rules To Keep Children Away From Social Media Crackdown On Fake Posts

Social Media Restrictions: సోషల్‌ మీడియాకు చిన్నారులను దూరంగా ఉంచాల్సిందే.. ఫేక్‌ పోస్టులపై కఠిన చర్యలు..

Published Date :January 28, 2026 , 9:42 pm
By Sudhakar Ravula
Social Media Restrictions: సోషల్‌ మీడియాకు చిన్నారులను దూరంగా ఉంచాల్సిందే.. ఫేక్‌ పోస్టులపై కఠిన చర్యలు..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Social Media Restrictions: సోషల్ మీడియా ప్రభావం చిన్నారులపై తీవ్రంగా పడుతున్న నేపథ్యంలో, నిర్ణీత వయసుకు లోబడిన మైనర్లను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు, ఫేక్ న్యూస్, విద్వేషపూరిత పోస్టులు చేసే వారిపై ఇకపై కఠిన చర్యలు తప్పవని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో సోషల్ మీడియా నియంత్రణపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (GoM) సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. చిన్నారుల భద్రత, సమాజంలో శాంతి భద్రతలు, డిజిటల్ వేదికలపై బాధ్యతాయుత ప్రవర్తనకు మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరంపై మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చింది.

Read Also: Ajit Pawar: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కొత్త వీడియోలో షాకింగ్ విజువల్స్..

Also Read

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
  • CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్‌పాట్.!
  • Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
  • Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
Add as a preferred
source on google

నిర్ణీత వయస్సు కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ఇవ్వకూడదన్న అంశంపై సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు మంత్రుల బృందం సూచించింది. అలాగే, ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని ఆదేశించారు మంత్రి నారా లోకేష్‌..

ఇక, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, మలేషియాలో ‘మై డిజిటల్ ఐడీ’ ద్వారా ఈ-కేవైసీ అనుసంధానం చేసి 16 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే సోషల్ మీడియా యాక్సెస్ ఇస్తున్నారని వివరించారు. ఈ తరహా విధానాలను మన రాష్ట్రంలో అమలు చేయవచ్చా అనే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. మరోవైపు.. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టే వారితో పాటు, కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే హెబిచ్యువల్ అఫెండర్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయంలో సోషల్ మీడియా సంస్థల బాధ్యతను కూడా ఖరారు చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గూగుల్, మెటా, ట్విట్టర్ (ఎక్స్) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల కంప్లయన్స్ ఆఫీసర్లను వచ్చే మంత్రుల బృంద సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు.

సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకునేందుకు ఐటీ యాక్ట్ సెక్షన్–46 ప్రకారం రాష్ట్రస్థాయి అడ్జుడికేటింగ్ ఆఫీసర్‌ను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కొన్ని కేసుల్లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘సహయోగ్’ పోర్టల్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రుల బృందానికి వివరించారు. ఇక, కంప్యూటర్ రిలేటెడ్ నేరాలు, సైబర్ లా ఉల్లంఘనలు కట్టడి చేయడం, సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, సాంకేతిక నిపుణుల నియామకం వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. డిజిటల్ వేదికలు సమాజానికి మేలు చేసేలా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP government latest news
  • AP social media rules
  • children and social media policy
  • cyber crime AP
  • fake news action Andhra Pradesh

తాజావార్తలు

  • Kerala Chief Minister: కేరళ సీఎం ఈయనేనా.?

  • Vijay-Governor: గవర్నర్‌కు విజయ్ మరో షాకింగ్ లెటర్.. మ్యాజిక్ ఫిగర్ ఎంతేశారంటే..!

  • PF Withdrawal: ATM నుండి PF డబ్బులు…! తాజా అప్‌డేట్‌ ఇదే..

  • Ashu Reddy: షాకింగ్.. చీటింగ్ కేసు నడుస్తుండగానే ఎంగేజ్మెంట్ చేసుకున్న అషు రెడ్డి

  • Vijay Cabinet: విజయ్ కేబినెట్ లిస్ట్ రెడీ.. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే..!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions