50 percent tariff on India: పన్ను పోటు.. అమెరికా తర్వాత భారత్పై 50 శాతం ట్యాక్స్ విధించేందుకు సిద్ధమైన మరో దేశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
50 percent tariff on India: ప్రపంచ వాణిజ్యంలో భారత్కు మరో సవాల్ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా భారతదేశంపై 50 శాతం సుంకాలు విధిస్తుండగా, ఇప్పుడు అదే బాటలో మరో దేశం అడుగులు వేయడానికి సిద్ధమవుతోంది. భారతదేశం మరియు చైనా నుంచి దిగుమతి చేసుకునే వాహనాలపై 50 శాతం సుంకం విధించే అంశాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
వాహన దిగుమతులే కారణం
బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, దక్షిణాఫ్రికా వాణిజ్యం, పరిశ్రమ మరియు పోటీ విభాగం ఈ అంశంపై అంతర్గత సమీక్ష చేపట్టింది. భారత్, చైనా నుంచి భారీగా వాహనాల దిగుమతులు జరుగుతుండటంతో స్థానిక ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని దక్షిణాఫ్రికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు దేశాల నుంచి వచ్చే వాహనాలపై అధిక సుంకాలు విధించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, స్థానిక కంపెనీలను కాపాడుకోవడం, దేశీయ తయారీదారులకు పోటీ నుంచి ఊరట కల్పించడమే ఈ ప్రతిపాదిత చర్య ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. తక్కువ ధరకు భారత్, చైనా నుంచి వస్తున్న వాహనాలు ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్లో స్థానిక తయారీదారులకు గట్టి పోటీని ఇస్తున్నాయని విధాన నిర్ణేతలు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
- Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
- Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్హౌస్
- Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
దిగుమతుల్లో భారత్, చైనా ఆధిపత్యం
2024 గణాంకాల ప్రకారం, దక్షిణాఫ్రికాకు వాహనాలను సరఫరా చేసే అతిపెద్ద దేశాలుగా భారత్, చైనా నిలిచాయి. మొత్తం వాహన దిగుమతుల్లో భారత్ వాటా 53 శాతం కాగా, చైనా వాటా 22 శాతంగా ఉంది. గత నాలుగేళ్లలో చైనా నుంచి దిగుమతులు 368 శాతం పెరిగితే, భారత్ నుంచి దిగుమతులు 135 శాతం పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇక, వాహనాలకే కాకుండా, వాటి విడిభాగాల దిగుమతులపై కూడా సుంకాలు విధించే అవకాశాన్ని దక్షిణాఫ్రికా పరిశీలిస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుత సుంకాల జాబితాలో మార్పులు చేయాలనే దిశగా చర్యలు తీసుకుంటోంది.
అమెరికా తర్వాత మరో దెబ్బ?
అమెరికా ఇప్పటికే భారతదేశం నుంచి వెళ్లే ఉత్పత్తులపై 50 శాతం సుంకం విధిస్తోంది. దీని వల్ల అమెరికా మార్కెట్లో భారత వస్తువుల ధరలు పెరిగాయి. అయినప్పటికీ, గత డిసెంబర్ త్రైమాసికంలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు పెరగడం విశేషం. ఇప్పుడు దక్షిణాఫ్రికా కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంటే, భారత్కు అంతర్జాతీయ వాణిజ్యంలో మరో పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రతిపాదన ఇంకా సమీక్ష దశలోనే ఉన్నప్పటికీ, అమలులోకి వస్తే భారత్-దక్షిణాఫ్రికా వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఎలాంటి దౌత్యపరమైన చర్యలు తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
-
Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
-
Honor X80: 10,000mAh భారీ బ్యాటరీతో హానర్ X80 వచ్చేస్తోంది.. పవర్ఫుల్ ఫీచర్లు హైలైట్!
-
Jagapathi Babu: “నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో”: జగపతి బాబు
-
Kitchen Hacks : మిక్సీ జార్ వేడెక్కుతుందా..? ఈ చిన్న తప్పే మసాలా రుచి పాడుచేస్తోంది.!
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?