AP High Court: ఏఐ టెక్నాలజీపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- ఏఐ టెక్నాలజీతో ఓ తీర్పు ఇచ్చిన న్యాయాధికారి..
- న్యాయాధికారి తీర్పుపై హైకోర్టులో విచారణ..
- ఏఐ టెక్నాలజీపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- న్యాయధికారులు జాగ్రత్తగా ఉండాలన్న హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ న్యాయాధికారి ఏఐ టెక్నాలజీ సహాయంతో ఉత్తర్వులు జారీ చేయగా, ఆ ఉత్తర్వులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏఐ వినియోగంపై న్యాయవ్యవస్థలో అప్రమత్తత అవసరమని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చే విషయంలో ఏఐ సమాచారాన్ని యథాతథంగా స్వీకరించవద్దని న్యాయమూర్తులకు హైకోర్టు సూచించింది. ఏఐ సాధనాలు న్యాయాధికారులకు సహాయక సాధనాలు మాత్రమేనని, విశ్లేషణ సామర్థ్యానికి మానవ మేధస్సే ప్రత్యామ్నాయమని పేర్కొంది. ఏఐ ఇచ్చే సమాధానాలు నమ్మకంగా కనిపించినా, చట్టపరంగా తప్పులు ఉండే అవకాశముందని హెచ్చరించింది.
Read Also: IND vs NZ 4th T20: అలా కొట్టేసారు ఏంటి కివిస్ మామలు.. భారత్ టార్గెట్ ఏంటంటే?
Also Read
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
- AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
ఏఐ సాధనాలు కొన్ని సందర్భాల్లో అసలు ఉనికిలోనే లేని తీర్పులను సృష్టించడం, కేసుకు సంబంధం లేని తీర్పులను ఉదహరించడం అత్యంత ఆందోళనకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి తప్పిదాలు న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఏఐని ఇష్టారీతిగా ఉపయోగిస్తే తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. ఈ కేసులో, తన ఉత్తర్వుల్లో పేర్కొన్న కొన్ని తీర్పులు ఏఐ ద్వారానే వచ్చినవని, తొలిసారి ఏఐని ఉపయోగించిన కారణంగా ఈ పొరపాటు జరిగిందని సంబంధిత న్యాయాధికారి హైకోర్టుకు వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే, తన ఉత్తర్వుల్లో అన్వయించిన చట్టసూత్రం మాత్రం సరైనదేనని న్యాయాధికారి పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఏఐ వినియోగంపై న్యాయాధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, తీర్పులు పూర్తిగా చట్టపరమైన సూత్రాల ఆధారంగానే ఉండాలన్నదే హైకోర్టు స్పష్టమైన సందేశంగా నిలిచింది.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?