AP High Court: ఏఐ టెక్నాలజీపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- ఏఐ టెక్నాలజీతో ఓ తీర్పు ఇచ్చిన న్యాయాధికారి..
- న్యాయాధికారి తీర్పుపై హైకోర్టులో విచారణ..
- ఏఐ టెక్నాలజీపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- న్యాయధికారులు జాగ్రత్తగా ఉండాలన్న హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ న్యాయాధికారి ఏఐ టెక్నాలజీ సహాయంతో ఉత్తర్వులు జారీ చేయగా, ఆ ఉత్తర్వులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏఐ వినియోగంపై న్యాయవ్యవస్థలో అప్రమత్తత అవసరమని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చే విషయంలో ఏఐ సమాచారాన్ని యథాతథంగా స్వీకరించవద్దని న్యాయమూర్తులకు హైకోర్టు సూచించింది. ఏఐ సాధనాలు న్యాయాధికారులకు సహాయక సాధనాలు మాత్రమేనని, విశ్లేషణ సామర్థ్యానికి మానవ మేధస్సే ప్రత్యామ్నాయమని పేర్కొంది. ఏఐ ఇచ్చే సమాధానాలు నమ్మకంగా కనిపించినా, చట్టపరంగా తప్పులు ఉండే అవకాశముందని హెచ్చరించింది.
Read Also: IND vs NZ 4th T20: అలా కొట్టేసారు ఏంటి కివిస్ మామలు.. భారత్ టార్గెట్ ఏంటంటే?
Also Read
- Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
- YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- AP PECET-2026 ఫలితాలు విడుదల.. 89.76 శాతం ఉత్తీర్ణత
- CM Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్తో ముందుకు ఏపీ.. సింగపూర్లో చంద్రబాబు కీలక ప్రసంగం
ఏఐ సాధనాలు కొన్ని సందర్భాల్లో అసలు ఉనికిలోనే లేని తీర్పులను సృష్టించడం, కేసుకు సంబంధం లేని తీర్పులను ఉదహరించడం అత్యంత ఆందోళనకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి తప్పిదాలు న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఏఐని ఇష్టారీతిగా ఉపయోగిస్తే తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. ఈ కేసులో, తన ఉత్తర్వుల్లో పేర్కొన్న కొన్ని తీర్పులు ఏఐ ద్వారానే వచ్చినవని, తొలిసారి ఏఐని ఉపయోగించిన కారణంగా ఈ పొరపాటు జరిగిందని సంబంధిత న్యాయాధికారి హైకోర్టుకు వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే, తన ఉత్తర్వుల్లో అన్వయించిన చట్టసూత్రం మాత్రం సరైనదేనని న్యాయాధికారి పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఏఐ వినియోగంపై న్యాయాధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, తీర్పులు పూర్తిగా చట్టపరమైన సూత్రాల ఆధారంగానే ఉండాలన్నదే హైకోర్టు స్పష్టమైన సందేశంగా నిలిచింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
-
Vivo T5 Lite 5G: వివో T5 Lite 5G త్వరలో భారత్లోకి.. 6,500mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
-
Obsession : ఇండియాలో అబ్సెషన్ కలెక్షన్ల సునామీ… కన్జ్యూరింగ్ రికార్డ్స్ బ్రేక్
-
RBI Young Professionals Recruitment 2026: ఆర్బీఐలో జాబ్స్.. నెలకు రూ.1.5 లక్షల స్టైపెండ్.. అర్హతలు, దరఖాస్తు వివరాలివే
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?