AP High Court: ఏఐ టెక్నాలజీపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- ఏఐ టెక్నాలజీతో ఓ తీర్పు ఇచ్చిన న్యాయాధికారి..
- న్యాయాధికారి తీర్పుపై హైకోర్టులో విచారణ..
- ఏఐ టెక్నాలజీపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- న్యాయధికారులు జాగ్రత్తగా ఉండాలన్న హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ న్యాయాధికారి ఏఐ టెక్నాలజీ సహాయంతో ఉత్తర్వులు జారీ చేయగా, ఆ ఉత్తర్వులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏఐ వినియోగంపై న్యాయవ్యవస్థలో అప్రమత్తత అవసరమని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చే విషయంలో ఏఐ సమాచారాన్ని యథాతథంగా స్వీకరించవద్దని న్యాయమూర్తులకు హైకోర్టు సూచించింది. ఏఐ సాధనాలు న్యాయాధికారులకు సహాయక సాధనాలు మాత్రమేనని, విశ్లేషణ సామర్థ్యానికి మానవ మేధస్సే ప్రత్యామ్నాయమని పేర్కొంది. ఏఐ ఇచ్చే సమాధానాలు నమ్మకంగా కనిపించినా, చట్టపరంగా తప్పులు ఉండే అవకాశముందని హెచ్చరించింది.
Read Also: IND vs NZ 4th T20: అలా కొట్టేసారు ఏంటి కివిస్ మామలు.. భారత్ టార్గెట్ ఏంటంటే?
Also Read
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
ఏఐ సాధనాలు కొన్ని సందర్భాల్లో అసలు ఉనికిలోనే లేని తీర్పులను సృష్టించడం, కేసుకు సంబంధం లేని తీర్పులను ఉదహరించడం అత్యంత ఆందోళనకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి తప్పిదాలు న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఏఐని ఇష్టారీతిగా ఉపయోగిస్తే తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. ఈ కేసులో, తన ఉత్తర్వుల్లో పేర్కొన్న కొన్ని తీర్పులు ఏఐ ద్వారానే వచ్చినవని, తొలిసారి ఏఐని ఉపయోగించిన కారణంగా ఈ పొరపాటు జరిగిందని సంబంధిత న్యాయాధికారి హైకోర్టుకు వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే, తన ఉత్తర్వుల్లో అన్వయించిన చట్టసూత్రం మాత్రం సరైనదేనని న్యాయాధికారి పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఏఐ వినియోగంపై న్యాయాధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, తీర్పులు పూర్తిగా చట్టపరమైన సూత్రాల ఆధారంగానే ఉండాలన్నదే హైకోర్టు స్పష్టమైన సందేశంగా నిలిచింది.
తాజావార్తలు
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
-
CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్చేస్తే..
-
Fauji vs Spirit: రిలీజ్కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?