-
పవన్ కల్యాణ్కి మంత్రి బాలినేని సవాల్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు బహిరంగ సవాల్ విసిరారు ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్కు దుమ్ముంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి గెలవాలని సవాల్ చేశారు.. తెలుగుదేశం పార్టీ తో కుమ్మక్కై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని సూచంచిన ఆయన.. 38 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకే ఒంటరిగా పోటి చేసే దమ్ము లేదు.. ఇక, జనసేన పార్టీ ఎంత? ఎన్నికల్లో పొత్తు లేకుండా ఎప్పుడైనా […] -
ఇవాళ కూడా పెరిగిన పెట్రో ధరలు
ఆల్టైం హైకి చేరిన పెట్రో ధరలు.. కొన్ని రోజుల పాటు స్థిరంగా కొనసాగాయి.. కానీ, మళ్లీ వరుసగా మూడు రోజుల నుంచి పెరుగుతూ పోతున్నాయి.. ఇవాళ లీటర్ పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 30 పైపలు పెరిగింది.. దీంతో.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.14కు చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.48గా పలుకుతుంది. ఇక, ముంబైలో పెట్రోల్ ధర రూ.108.15కు పెరగగా.. డీజిల్ ధర రూ.98.12గా ఉంది. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో కూడా చమురు ధరలు […] -
రాజ్ఘాట్, విజయ్ఘాట్లో నివాళులర్పించిన మోడీ
రాజ్ఘాట్, విజయ్ఘాట్లో నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోడీ.. జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతిని.. భారత రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతిని పురస్కరించుకుని.. ఇవాళ ఉదయం రాజ్ఘాట్, విజయ్ఘాట్లో నివాళులర్పించారు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ.. వారి సమాధుల వద్ద నివాళులర్పించారు. మరోవైపు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు రెండు ఘాట్ల దగ్గర పుష్పాంజలి ఘటించారు. ఇక, ఇద్దరు నేతల జయంతి […] -
తెలుగు అకాడమీ కేసు.. ఆ ముగ్గురి కోసం వేట..
సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారంలో నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు సీసీఎస్ పోలీసులు.. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ముగ్గురు కోసం వేట ప్రారంభించారు.. తెలుగు అకాడమీలో మొత్తం రూ.63.47 కోట్లను నగదు రూపంలో విత్ డ్రా చేశారు.. ఆ ముగ్గురు నిందితులు.. ఇన్నవో కారులో ఆంధ్రతో పాటు ఇతర ప్రాంతాలకు డబ్బులు తరలించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.. డబ్బులు కొల్లగొట్టడంలో ఏపీ మర్కంటైల్ సొసైటీ చైర్మన్.. సహకరించినట్టు […] -
జనసేనానికే కోవిడ్ రూల్సా..? సీఎంకు వర్తించవా..?
పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. అయితే, ఎన్ని ఆటంకాలు కల్పించినా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతాం అని ప్రశ్నించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. జనసేన కార్యక్రమానికే కోవిడ్ రూల్సా..? సీఎం జగనుకు కోవిడ్ రూల్స్ వర్తించవా..? అని మండిపడ్డారు.. సీఎం జగన్ ఈ రోజు విజయవాడ బెంజి సర్కిల్లో నిర్వహించే కార్యక్రమానికి కోవిడ్ రూల్స్ ఎందుకు వర్తింపచేయడం లేదని నిలదీసిన ఆయన.. విజయవాడను దిగ్బంధించి మరీ వేల మందితో చెత్త […] -
బండి సంజయ్ పాదయాత్ర.. తొలిదశకు ఇవాళే ముగింపు
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత ఇవాళ్టితో ముగియనుంది.. ఈ సందర్భంగా హుస్నాబాద్ లో రోడ్ షో, ముగింపు సభ నిర్వహణకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.. ఇక, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రాబోతున్నారు.. మెత్తం 36 రోజుల పాటు 438 కిలో మీటర్లు మేర పాదయాత్ర చేశారు బండి సంజయ్.. ఎనిమిది జిల్లాల్లోని 19 అసెంబ్లీ, 6 పార్లమెంట్ నియోజకవర్గాలను […] -
మహాత్ముడి జయంతి.. అహింసే ఆయన మార్గం..
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ… ఆయనే మహాత్మా గాంధీ.. 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్ బందర్లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించిన ఆయన.. జాతిపితగా అందరూ గౌరవించే స్థానానికి ఎదిగారంటే.. ఆయన నమ్మిన సత్యం, అహింస సిద్ధాంతాలు.. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం లాంటి ఆయుధాలు.. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే నంటూ ఆయన వేసిన అడుగులే కారణం.. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో […] -
పవన్ కల్యాణ్ పర్యటనపై తీవ్ర ఉత్కంఠ.. ఇంకా అనుమతి రాలే..!
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కదలిన జనసేన పార్టీ.. ఎక్కడికక్కడ శ్రమదానంతో రోడ్లను కొంతమేరకు అయినా బాగుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.. తూర్పు గోదావరితో పాటు అనంతపురం జిల్లాలో పవన్ పర్యటన కొనసాగనుంది.. అయితే.. పవన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.. పవన్, రాజమండ్రి సభకోసం జనసేన ఏర్పాట్లు చేస్తోంది. సర్కార్కు పవన్కు మధ్య తాజాగా రగులుతున్న రాజకీయం నేపథ్యంలో సత్తా చాటాలని జనసేన […] -
మహిళలకు శుభవార్త.. నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
ప్రతీ ఏడాది తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం… ఇక, ఈ ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా ఇచ్చే చీరల పంపిణీ ఇవాళ ప్రారంభం కానుంది.. ఇప్పటికే జీహెచ్ఎంసీతో పాటు ఆయా జిల్లాల్లో చీరల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. రాష్ట్రంలో అర్హులైన మహిళలకు చీరల పంపిణీ శనివారం నుంచి చేస్తామని టెస్కో ఎండి శైలజా రామయ్యర్ వెల్లడించారు.. ఆహారభద్రత కార్డు కింద పేర్లు నమోదైన 18 ఏళ్లు […] -
నేడు కడప టూర్ కి సీఎం వైఎస్ జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి తన సొంత జిల్లాలో పర్యటనకు వెళ్లనున్నారు.. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్లు పరిశీలించారు. ఇడుపులపాయలోని హెలిప్యాడ్, సీఎం బస చేసే నివాసం వద్ద పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక, ఇవాళ రాత్రి ఇడుపులపాయలోనే […]
తాజావార్తలు
-
Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
-
Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!
-
Darling Re Release: ప్రభాస్ ఫ్యాన్పై థియేటర్ మేనేజ్మెంట్ దాడి?
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!
ట్రెండింగ్
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!