ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. అబ్బాయిలదే పైచేయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి.. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం 1,75,8687 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. టెస్ట్కు 1,66,460 మంది విద్యార్థులు హాజరయ్యారని.. వారిలో 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని వెల్లడించారు మంత్రి.. ఇక, విద్యార్థుల రెస్పాన్స్ షీట్ లను ఈ నెల 26 నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తామన్న ఆయన.. రేపటి నుంచి వెబ్సైట్లో ర్యాంక్ కార్డులను అందుబాటులో ఉంచుతామన్నారు.. ఈనెల 18వ తేదీ నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్టు తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.. మరోవైపు ఇప్పటికే ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు ఈనెల 3నుంచి ఐదు విడతలుగా నిర్వహించిన పరీక్షలు నిన్నటితో ముగిశాయి. ఈ పరీక్షలకు 83,822మంది దరఖాస్తు చేయగా.. 78,066మంది హాజరైనట్టు తెలియజేవారు. అయితే, ఈఏపీసెట్ను గతంలో ఎంసెట్గా పిలిచేవారు.. వైద్యవిద్యలో ప్రవేశాలకోసం జాతీయస్థాయిలో ప్రత్యేక పరీక్ష (నీట్) నిర్వహిస్తుండడంతో.. ఎంసెట్లో ‘ఎం’ అనే అక్షరాన్ని తొలగించారు.. ఫార్మసీ ప్రవేశాలను ఈ ప్రవేశ పరీక్ష ద్వారానే నిర్వహిస్తుంన్నదున ఎం స్థానంలో పీ ని చేర్చి ఈఏపీసెట్గా మార్పు చేశారు అధికారులు.
ఏపీ ఈఏపీ సెట్ లో ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మాకు మొత్తంగా 2,59,688 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని.. ఈ నెల 14 అగ్రి, ఫార్మా ప్రవేశ పరీక్షల ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు.. గత రెండేళ్లతో పోల్చుకుంటే అర్హులైన విద్యార్థుల శాతం తగ్గిపోయింది.. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య మాత్రం పెరిగినట్టు వెల్లడించారు.. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు, సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. మరోవైపు.. ఫలితాల్లో ఈసారి అమ్మాయిలు వెనుకబడ్డారు.. మొదటి పది ర్యాంకుల్లో కనీసం ఒక్ ర్యాంకు కూడా సాధించలేకపోయారు.. మొదటి ర్యాంక్ అనంతపురం జిల్లాకు చెందిన కోయి శ్రీ నిఖిల్.. సెకండ్ ర్యాంక్ వరద మహంత్ నాయుడు, రాజాం, శ్రీకాకుళం జిల్లా నిలిచారు.
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!