పార్టీ నిర్మాణం, గ్రామ, వార్డు స్థాయి నుంచి కొత్త కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో పార్టీ కమిటీల విషయంలో టీఆర్ఎస్ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు.. పార్టీ సంస్థాగత కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. జనరల్ సెక్రటరీలు ఇంఛార్జ్లుగా ఉన్న నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.. గత రెండు వారాలుగా జరుగుతున్న కమిటీల […]
ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు విక్రయించేందుకు సిద్ధం అవుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. వారం రోజుల్లో ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారిని ప్రారంభిస్తామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈ నెల 18వ తేదీ నుంచి పెరటాసి మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు నిలిపివేసే యోచనలో ఉంది టీటీడీ.. టోకెన్ల కోసం తమిళ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం వుండడంతో కోవిడ్ నిబంధనలు అమలు చేయడం కష్టం అవుతుందని.. […]
స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, పాలిటెక్నిక్లు, ఐటీఐలపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజ్, నియోజకవర్గానికి ఒక ఐటీఐ ఉండాలని పేర్కొన్నారు.. విశాఖపట్నంలో హై ఎండ్ స్కిల్ యూనివర్శిటీ, తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలన్న ఆయన.. కోడింగ్, లాంగ్వేజెస్, రోబోటిక్స్, ఐవోటీ లాంటి అంశాల్లో స్కిల్ కాలేజీల్లో బోధన, శిక్షణ ఉండాలన్నారు.. స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలకు, వర్క్ఫ్రం హోంకు మధ్య సినర్జీ ఉండాలని.. […]
ట్యాంక్బండ్లో వినాయక నిమజ్జనం విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది హైకోర్టు.. ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను కొట్టిహైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యథావిథిగా కొనసాగించాలని, ఉత్తర్వులను మార్పులేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సంతృప్తి చెందని పక్షంలో ఛాలెంజ్ చేసుకోమని సూచించింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. తమ ఆదేశాలపై అభ్యంతరాలుంటే ఉత్తర్వులను ఛాలెంజ్ చేసుకోవాలింది. అయితే, ఈ ఒక్క ఏడాది మినహాయింపు ఇవ్వాలని కోరింది సర్కార్.. […]
సినీ నటుడు సాయి ధరమ్ తేజ్కు రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే సృష్టించింది.. హైదరాబాద్లో బైక్ స్కిడ్ అయి ఆయన పడిపోయారు.. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తేజ్ పరిస్థితి నిలకడగా ఉందని.. శ్వాస తీసుకోవడం కొంత మెరుగైందని తాజా హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు అపోలో వైద్యులు.. మరోవైపు.. సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు.. రోడ్ల మీద భవన […]
తెలుగు దేశం పార్టీ నేతలకు సవాల్ విసిరారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం, కలివరం గ్రామాల్లో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధరల పెరుగుదలపై టీడీపీ చేస్తున్న నిరసనలపై ఘాటు విమర్శలు చేశారు. గ్యాస్, పెట్రోల్ రేట్లు పెరిగితే కేంద్రాన్ని అడగండి… ఇంట్లో జోడీగానే ఉన్నారుగా? అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. కేంద్రాన్ని వదిలేసి… మా పై ఏడుస్తారెందుకు? అని ప్రశ్నించారు. 1,261 హామీలిచ్చి నెరవేర్చని మీదా దేవతల […]
హుస్సేన్సాగర్లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు తీర్పుపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్పందించింది.. మీడియాతో మాట్లాడిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంత్ రావు… దేవుణ్ణి పూజించడం… నిమజ్జనం చేయడం ప్రజల హక్కు అన్నారు.. హై కోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని.. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లి.. వినాయక నిమజ్జనం సాఫీగా సాగేందుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇక, గణేష్ విగ్రహాలతో నీరు పొల్యూట్ అవుతుంది అనేది ఏ […]
సంచలన వ్యాఖ్యలకు, ఉన్నది ఉన్నట్టుగా దాపరికం లేకుండా మాట్లాడడంలో జేసీ బ్రదర్స్కు పెట్టింది పేరు.. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డే కాదు.. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్రెడ్డి కూడా అదే కోవలోకి వస్తారు.. ఇవాళ జరిగిన రాయలసీమ టీడీపీ నేతల సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్రెడ్డి.. సీమలో ప్రాజెక్టులకంటే ముందు కార్యకర్తలను కాపాడండి అని వ్యాఖ్యానించిన ఆయన.. కార్యకర్తల సమావేశం పెట్టండి.. ఇవాళ జరిగే సమావేశానికి అందరికీ ఆహ్వానం లేదన్నారు.. ఒకరిద్దరు నేతల […]
మెగా హీరో సాయ్ ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం.. ఆస్పత్రికి తరలించడం కూడా వెనువెంటనే జరిగిపోయాయి.. ఆయనకు సరైన సమయంలో ట్రీట్మెంట్ అందడం వల్లే ప్రాణాపాయం తప్పింది అంటున్నారు తేజ్కు మొదట ట్రీట్మెంట్ చేసిన మెడికవర్ వైద్యుల బృందం… ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మెడికవర్ వైద్యులు.. గోల్డెన్ హవర్లో ట్రోమా కేర్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అని.. ఈ టైంలో ఇచ్చే ట్రీట్మెంటే సాయి ధరమ్ తేజ్ని కాపాడుతోందన్నారు.. ప్రమాదం జరిగిన గంటలోపు వైద్యం […]
తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో లేదో… తమ రాక్షసత్వం ఎలా ఉంటుందో ఆఫ్ఘన్ ప్రజలకు చూపుతున్నారు… తాలిబాన్లు. ముఖ్యంగా పంజ్షీర్ను స్వాధీనం చేసుకున్న తర్వాత… రక్తం ఏరులై పారుతోందా? అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి. పంజ్షీర్లో ఇంటింటి తనిఖీలు చేపట్టి… తమ వ్యతిరేకం అనిపించిన వారిని, మైనార్టీలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సోదరుడు రోహుల్లా సలేహ్ను కూడా తాలిబన్లు హతమార్చారు. ఇక, ఇప్పటికే మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు. అయితే, ఇవాళ జరగాల్సిన […]