సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62 వేలు దాటేసి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.. ఈ సమయంలో అన్ని దేశాలు ఒమిక్రాన్ కట్టడి చర్యలకు పూనుకుంటున్నాయి.. ఇదే సమయంలో.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరి వెళ్లిపోయింది టీమిండియా… ఈ టూర్లో టెస్టు, వన్డే సిరీస్లు ఆడబోతోంది. అందులో భాగంగా డిసెంబర్ 26వ తేదీ నుంచి సెంచురియాన్లో భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ […]
పీఆర్సీపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. ప్రభుత్వం ఎప్పుడు పీఆర్సీ ప్రకటిస్తుందా? అని ఉద్యోగులు ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి.. అయితే, పీఆర్సీపై కసరత్తును ముమ్మరం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఫిట్మెంట్పై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఫిట్మెంట్పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్శర్మతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. 27 శాతం ఐఆర్ కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. కాగా, పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాల మధ్య […]
ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతుంటే.. మరోవైపు అదే స్థాయిలో ఉద్యమం కూడా కొనసాగుతూనే ఉంది.. బీజేపీ మినహా ఏపీలోని అన్ని పక్షాలు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి.. ప్రత్యక్ష కార్యాచరణకు కూడా దిగుతున్నాయి. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ గళం వినిపిస్తున్నారు.. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ఉక్కుపరిశ్రమ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించిన ఆయన.. […]
చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య హైఓల్టేజ్ వార్ నడుస్తూనే ఉంది.. ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు సందర్భాల్లో గ్రూప్ వారు రోడ్డెక్కి రచ్చగా మారిన సందర్భాలు లేకపోలేదు.. తాజాగా మరోసారి అదే జరిగింది.. ఇప్పుడు పార్టీ సుప్రీం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో.. మరోసారి గ్రూప్ వార్ బయటపడింది.. ఎమ్మెల్యే ఆర్కే రోజా వర్సెస్ ఆమె వ్యతిరేక వర్గంగా మారింది పరిస్థితి… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన […]
ఒకప్పుడు పండగరోజే.. లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజునో మాంసం వండుకునేవారు.. కానీ, క్రమంగా మాంసానికి డిమాండ్ పెరుగుతూ వచ్చింది… వారానికి రెండు మూడు రోజులైనా మటన్ లేదా చికెన్ ఉండాల్సిందే.. లేదా కనీసం సండే అయినా ముక్క ఉంటేనే ముద్ద దిగుతోంది.. ఏ ఫంక్షన్ అయినా.. ముక్క ఉంటేనే.. అది ఫంక్షన్ కింద లెక్క అనే స్థాయికి వెళ్లిపోయింది పరిస్థితి.. అయితే, హైదరాబాద్ లాంటి సిటీల్లో కిలో మటన్ ధర ఏకంగా రూ.800కు చేరింది. అయితే, ఆంధ్రప్రదేశ్లో […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది… సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి డాక్యుమెంట్ రైటర్లకు నో ఎంట్రీ అంటూ స్పష్టం చేసింది.. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు సహా అనధికార వ్యక్తులకు ప్రవేశాన్ని నిషేధించినట్టు వెల్లడించారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజీ రామకృష్ణ.. ఈ మేరకు మెమో జారీ చేశారు… కాగా, అనధికార వ్యక్తుల ప్రమేయం వల్లే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పేర్కొంది.. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్స్ […]
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలు సామాన్యులను అతలాకుతలం చేశాయి.. రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వర్షాలు, వరదలతో కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు భారీగా నష్టపోయారు.. అయితే, బాధితులకు అండగా మేమున్నామంటూ.. పలువురు సినీ ప్రముఖులతో పాటు ట్రస్ట్లు కూడా ముందుకు వస్తున్నాయి.. ఇక, బాధితులకు మేమున్నామంటూ ముందుకు వచ్చింది ఎన్టీఆర్ ట్రస్ట్.. వరద బాధితులకు సాయం చేసేందుకు ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. […]
పసిడి ధరలో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఒకరోజు బంగారం ధర పైకి కదిలితే.. మరోరోజు కిందికి దిగివస్తున్నాయి.. అయితే, ఇవాళ బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా కొనసాగుతూ రూ.49,850గా ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,700గా ఉంది.. ఇదే సమయంలో వెండి ధర మాత్రం కాస్త దిగివచ్చింది.. సిల్వర్ ధర రూ.100 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.66,000కు […]
మేషం : ఈ రోజు ఈ రాశివారి ఆర్థిక స్థితి కొంతమేరకు మెరుగుపడినా తాత్కాలిక ఇబ్బందులుంటాయి. ఇతరుల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మవుతాయి. దైవ, శుభ కార్యాల్లో స్త్రీలకు ప్రత్యేక గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు అమలు చేస్తారు. ప్రముఖుల సహకారంతో మీ సమస్య పరిష్కారామవుతాయి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు పనిభారం, బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులు అధికంగానే ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. […]
తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. హనుమకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కోర్టుల ఆధునీకరణతో ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు.. శిథిలావస్థలో ఉన్న కోర్టులను పునరుద్ధరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.. కోర్టుల్లో మౌలిక వసతులు ఉంటేనే పేదలకు న్యాయ సేవలు అందుతాయన్న ఆయన.. మౌలికవసతులు లేకుండా న్యాయమూర్తులు, న్యాయవాదులు పని చేయాలని అనుకోవడం దురాశ […]