భారత్కు యువతే బలం.. ఈ ఏడాది వారికి చాలా కీలకం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. పుదుచ్చేరిలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల సాంకేతిక కేంద్రం ప్రారంభోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాని మోడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్లో ఎంస్ఎంఈ పాత్ర చాలా కీలకమైనదిగా పేర్కొన్నారు.. ఇక, ప్రపంచాన్ని మార్చే సాంకేతికతను ఎంఎస్ఎంఈ రంగంలో ఉపయోగించడం సంతోషంగా ఉందన్న ఆయన.. ఆ దిశగా కీలక ముందడుగు వేసేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు.. ఇక, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వివేకానందున్ని స్మరించుకున్న ప్రధాని మోడీ.. భారత దేశానికి యువతే బలం… 2022 వారికి చాలా కీలకం కానుందన్నారు.. యువత వల్లే దేశంలో డిజిటల్పేమెంట్స్ పెరిగాయని.. అన్ని తరాలకు యువతే ఆదర్శంగా నిలిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
Read Also: ఏపీ సీఐడీ నోటీసులు.. ఘాటుగా స్పందించిన ఎంపీ రఘురామ
పుదుచ్చేరిలో 25వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రసంగంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి ప్రసంగించారు.. దీనితో పాటు, పుదుచ్చేరిలో MSME మంత్రిత్వ శాఖ యొక్క సాంకేతిక కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సాంకేతిక కేంద్రం నైపుణ్యం కలిగిన యువతకు దోహదపడుతుంది మరియు సంవత్సరానికి 6,400 మంది ట్రైనీలకు శిక్షణ ఇవ్వగలదు. దీనితో పాటు పుదుచ్చేరి ప్రభుత్వం నిర్మించిన ‘పెరుంతలైవర్ కామరాజర్ మణిమండపం’ ఆడిటోరియంను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఆడిటోరియం ఓపెన్ ఎయిర్ థియేటర్ను కలిగి ఉంది మరియు ఇది ప్రాథమికంగా విద్యా ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది మరియు 1000 కంటే ఎక్కువ మంది వ్యక్తులకు వసతి కల్పిస్తుంది.