తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. కరోనా, ఒమిక్రాన్ కేసులపై విచారణ జరిపింది హైకోర్టు.. నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు పిటిషనర్స్.. ఒమిక్రాన్ కేసులు గుర్తించి కంటైన్మెంట్ జోన్, మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని కోరారు.. ఇంత వరకు ప్రభుత్వం ఎలాంటి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయలేదంటూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. Read […]
ఆంధ్రప్రదేశ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడే ప్రారంభమయ్యాయి.. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ డ్యాన్స్లతో హంగామా చేశారు.. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో డీసీఎంసీ చైర్మన్ చలపతి ఆధ్వర్యంలో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, నాయకులు హాజరయ్యారు.. ఇక, బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కూడా వచ్చేశారు.. నిర్వహకుల కోరికతో రంగ ప్రవేశం చేశారు.. అమ్మాయిలతో కలిసి రెచ్చిపోయి డ్యాన్స్లు వేవారు తహసీల్దార్ హమీద్.. బుల్లెట్టు మీదొచ్చె […]
వ్యాపార రంగంలో రిలయన్స్కు ఎదురేలేదు.. కొత్త రంగాలకు వ్యాపారాలను విస్తరిస్తూ.. లాభాలను ఆర్జిస్తూనే ఉంది ఆ సంస్థ.. ఇక, గ్రీన్ ఎనర్జీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది ఆ సంస్థ.. ఇప్పటికే జామ్నగర్ దగ్గర గిగా ఫ్యాక్టరీ పనులు కొనసాగిస్తూనే మరోవైపు గ్రీన్ టెక్నాలజీలో వివిధ సంస్థలతో చేతులు కలుపుతోంది.. అందులో భాగంగా.. సోడియం ఐయాన్ బ్యాటరీ టెక్నాలజీలో ప్రపంచంలోనే మంచి పేరు పొందిన ఫారడియన్ కంపెనీని రియలన్స్ కొనేసింది.. ఆ కంపెనీకి సంబంధించిన వంద […]
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారంపై మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఓ వైపు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి.. సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది.. మరోవైపు.. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సినీ హీరోలు ఎవరూ ఈ వ్యవహారంపై స్పందించొద్దు అంటున్నారు సినీ పరిశ్రమలోని పెద్దలు.. అయినా అక్కడక్కడ కొంతమంది టికెట్ల ఇష్యూపై స్పందిస్తూనే ఉన్నారు.. ఇదే సమయంలో సినీ పెద్దలపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ సీరియస్ కామెంట్లు చేశారు.. రాష్ట్రంలో థియేటర్ల […]
టి.పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.. దీంతో.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. పౌర స్వేచ్ఛను కేసీఆర్ సర్కార్ హత్య చేస్తోందంటూ మండిపడ్డ ఆయన.. ప్రతిపక్ష నేతల ఇళ్లల్లోకి ఖాకీలను ఉసిగొల్పుతున్నాడు అని.. సన్నిహితులు, మిత్రులు, బంధువుల ఇళ్లలో పరామర్శలకు, శుభకార్యాలకు కూడా వెళ్లనీయని నిర్భందకాండకు ఈ దృశ్యం ఉదాహరణగా పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకుపుడుతోందన్న రేవంత్.. మేం ఇంట్లో […]
ఆంధ్రప్రదేశ్లో రవాణా శాఖ సర్వర్ గురువారంరోజు మొరాయించింది.. 2022 జనవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్న నేపథ్యంలో.. ఒక్కసారిగా వాహనాల రిజిస్ట్రేషన్లు పెరగడంతో.. ఆ తాకిడితో రవాణాశాఖ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం జరిగిపోయాయి.. దీంతో.. సాంకేతిక సమస్య పరిష్కారినిక నిపుణులు రంగంలోకి దిగి చక్కబెట్టారు.. ప్రస్తుతానికి సమస్య పరిష్కారం అయినట్టు వెల్లడించారు ఏపీ రవాణాశాఖ కమిషనర్ పీఎస్ఆర్ ఆంజనేయులు.. ఈరోజు ఉదయం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లను యథాతథంగా అనుమతిస్తామని ప్రకటించారు. Read Also: […]
ప్రపంచాన్ని వివిధ రూపాల్లో ఇప్పటికే భయపెడుతూనే ఉంది కరోనా మహమ్మారి.. ఓవైపు డెల్టా మళ్లీ పంజా విసురుతుంటే.. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది.. అయితే, కోవిడ్కు చెక్ పెట్టేందుకు ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. భారత్లో తయారు చేసిన వ్యాక్సిన్లను విస్తృతంగా ప్రజలకు వేస్తున్నారు.. ఇక, ఇదే సమయంలో విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చారు.. మరోవైపు.. కరోనా చికిత్సలో అద్భుతమైన ఔషధంగా చెబుతున్న టాబ్లెట్ మార్కెట్లోకి వచ్చేసింది.. ‘మోల్నుపిరావిర్’ పేరుతో […]
సెంచూరియన్ టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే.. సౌతాఫ్రికాపై 113 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్.. మూడు టెస్ట్ల సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.. అయితే, ఆ ఓటమి తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నాడు దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ క్వింటన్ డికాక్… టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెబుతున్నట్టు ప్రకటించాడు.. ఇక, ఆయన రిటైర్మెంట్ విషయాన్ని క్రికెట్ సౌత్ ఆఫ్రికా కూడా ధృవీకరించింది. భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్ట్ […]
పాత సంవత్సరానికి గుడ్బై చెప్పి.. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఓవైపు ఏర్పాట్లు జరుగుతుంటే.. మరోవైపు.. కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతున్న సమయంలో.. నూతన సంవత్సర వేడుకలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు.. ఇక, పర్యాటక కేంద్రమైన విశాఖలోనూ కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు.. రాత్రి 8 గంటల నుంచి అన్ని బీచ్లు మూసివేయనున్నారు.. రాత్రి 8 గంటల నుంచి ఆర్కే బీచ్, జోడుగుళ్లపాలెం బీచ్, సాగర్నగర్ బీచ్, రుషికొండ బీచ్, భీమిలి బీచ్, యారాడ […]
కరోనా సమయంలో ఆయుర్వేద మెడిసిన్తో వార్తల్లో నిలిచిన నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య.. ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోన్న సమయంలో.. తాను ఒమిక్రాన్ను కూడా మందు తయారు చేశానని ప్రకటించారు.. దీంతో.. ఆయన నివాసం ఉండే కృష్ణపట్నానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు.. అయితే, అక్కడే ఆనందయ్యకు ఊహించని షాక్ తగిలింది… ఓవైపు ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి ఇవ్వొద్దంటూ కృష్ణపట్నం పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేయగా… అసలు, నీ మందుకు ఉన్న అనుమతి ఏంటి? […]