Election Commission: వారికి షాకిచ్చిన ఎన్నికల కమిషన్.. కోటి మంది ఓట్లు తొలగింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ఎన్నికల కమిషన్ ప్రక్షాళన చేపట్టింది. దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితా నుంచి పెద్ద ఎత్తున నకిలీ పేర్లను ఏరివేస్తోంది.. ఒకే పేరు, ఒకే ఫొటోతో ఒకటికి మించి ఉన్న వాటిని తొలగించే పనిలోపడిపోయింది.. గడిచిన ఏడు నెలల్లో ఇలా మొత్తంగా దాదాపు కోటి మంది పేర్లను జాబితా నుంచి తొలగించామని.. కొన్ని సరిచేశామని ప్రకటించింది ఎన్నికల కమిషన్… ఓటర్ల సమగ్ర డిజిటల్ జాబితాపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది.. ఓటరు గుర్తింపు కార్డులు డెమోగ్రాఫికల్ లేదా ఫోటోగ్రాకల్ సారూప్య నమోదులను తొలగించడం ద్వారా సరిచేస్తూ వచ్చింది.. ఓటర్ల సమగ్ర డిజిటల్ డేటాబేస్ను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నందున నకిలీ ఎంట్రీల తొలగింపుపై ఫోకస్ పెట్టింది ఎన్నికల కమిషన్..
Read Also: Komatireddy Rajagopal Reddy: వాళ్లకోసమే రాజీనామా.. ప్రజలు ఆలోచించాలి..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
ఇక, ఓటర్ల జాబితాను సులభతరం చేసేందుకు ఆగస్టు 1వ తేదీ నుంచి ఓటరు గుర్తింపు కార్డులతో స్వచ్ఛందంగా ఆధార్ను అనుసంధానం చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతించింది. అయితే, ఇది, ఓటర్ల డెమోగ్రాఫిక్ మ్యాపింగ్ను అవకాశం ఇస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నరాయి. అంతే కాదు డేటా గోప్యతకు సంబంధించిన ఆందోళనలను కూడా లేవనెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 11,91,191 ఓట్లు ఒకే పేరుతో ఒకటికి మించి ఉన్నట్టుగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. వీటిని పరిశీలించిన తర్వాత 9,27,853 ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించింది.
బూత్ స్థాయిలో ధ్రువీకరించుకున్న తర్వాతే జాబితానుంచి పేర్లను తొలగించినట్టు, స్వచ్ఛందంగా తొలగించలేదని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఇక ఫొటోలు ఒకే రీతిలో ఉన్న 3,18,89,422 ఓటర్లను గుర్తించగా, తనిఖీ తర్వాత 98,00,412 ఓట్లను తొలగించినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. మొదటి దశలో, ఎన్నికలకు వెళ్లే ఐదు రాష్ట్రాలకు పీఎస్ఈ గణించబడింది… 2022లో ముసాయిదా ప్రచురణకు ముందు. రెండవ దశలో, మిగిలిన 32 రాష్ట్రాలకు పీఎస్ఈ గణించబడిందని అధికారులు వెల్లడించారు.. మొత్తం పీఎస్ఈ గుర్తించబడినవి 3.18 కోట్లు [రెండు దశల్లో 31 మిలియన్లకు పైగా] మరియు 98,00,412 మంది ఓటర్లు తొలగించబడ్డారు…. దాదాపు 20 లక్షల ఓట్లు సరిదిద్దే పనిలో ఉన్నట్టు వెల్లడించారు. స్వచ్ఛందంగా ఆధార్ అనుసంధానంతో ఓటర్ల జాబితాలో సవరణలు మరింత వేగంగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.. ప్రస్తుతం దేశంలో దాదాపు 940 మిలియన్ల మంది ఓటర్లు ఉన్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!