Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్.. 10 మంది శ్రీలంక క్రీడాకారుల మిస్సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామన్వెల్త్ గేమ్స్ నుండి 10 మంది శ్రీలంక క్రడీకారులు అదృశ్యమయ్యారని అధికారులు ప్రకటించారు.. తొమ్మిది మంది శ్రీలంక అథ్లెట్లు మరియు మేనేజర్ తమ ఈవెంట్లను పూర్తి చేసిన తర్వాత అదృశ్యం కావడం కామన్తెల్త్ గేమ్స్లో కలకలం సృష్టిస్తోంది.. అయితే, సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక కామన్వెల్త్ క్రీడల బృందంలోని పది మంది సభ్యులు బ్రిటన్లో ఉండేందుకు అనుమానాస్పద ప్రయత్నంలో అదృశ్యమయ్యారని ద్వీప దేశానికి చెందిన ఒక ఉన్నత క్రీడా అధికారి అనుమానం వ్యక్తం చేశారు.. మొదట జూడోకా చమీలా దిలానీ, ఆమె మేనేజర్ అసేలా డి సిల్వా మరియు రెజ్లర్ షానిత్ చతురంగ గత వారం అదృశ్యమయ్యారు. దీంతో శ్రీలంక అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మరో ఏడుగురు అదృశ్యమయ్యారు.. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు 160 మందితో కూడిన శ్రీలంక క్రీడాకారుల బృందం బర్మింగ్హామ్ చేరుకోగా.. ఈవెంట్లు ముగిసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.
Read Also: IND vs WI: వెస్టిండీస్పై గ్రాండ్ విక్టరీ.. భారత్ ఖాతాలో మరో సిరీస్..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
ఇక, మొదట అదృశ్యమైన ముగ్గురిని బ్రిటీష్ పోలీసులు గుర్తించారు, అయితే వారు స్థానిక చట్టాలను ఉల్లంఘించినా.. ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే వీసాలను కలిగి ఉన్నందున, ఎటువంటి చర్య తీసుకోలేదని శ్రీలంక అధికారి వెల్లడించారు.. గతంలోనూ అంతర్జాతీయ ఈవెంట్ల నుంచి శ్రీలంక అథ్లెట్లు తప్పిపోయిన సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబరులో, శ్రీలంక రెజ్లింగ్ మేనేజర్ తన జట్టును విడిచిపెట్టి ఓస్లోలో ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ సందర్భంగా అదృశ్యమయ్యాడు. 2014లో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా క్రీడల సందర్భంగా ఇద్దరు శ్రీలంక అథ్లెట్ల ఆచూకీ లభించలేదు. ఇప్పుడు మరో 10 మంది తప్పిపోగా.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటికే ముగ్గురుని గుర్తించగా.. మరో ఏడుగురి కోసం ప్రత్యేక బృందాలను ఏ ర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..