IND vs WI: వెస్టిండీస్పై గ్రాండ్ విక్టరీ.. భారత్ ఖాతాలో మరో సిరీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ చేతిలో వెస్టిండీస్ మరోసారి చిత్తైంది. మూడు వన్డేల సిరీస్లో వైట్వాష్ అయిన విండీస్… టీ-20 సిరీస్నూ 1-4 తేడాతో భారత్కు సమర్పించుకుంది. వెస్టిండీస్తో జరిగిన చివరి టీ-20 మ్యాచ్లో 88 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది… భారత్. ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో గెలుచుకుంది. టాస్గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. ఐదో ఓవర్లో 11 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఇషాన్ కిషన్ ఔటైనా… శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా ఏ మాత్రం తగ్గకుండా విండీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. అయ్యర్ 40 బంతుల్లోనే 64 రన్స్ చేస్తే… దీపక్ హుడా 25 బాల్స్లోనే 38 రన్స్ చేశాడు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా 16 బంతుల్లోనే 28 రన్స్ బాదడంతో… 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి… 188 రన్స్ చేసింది.
Read Also: Commonwealth Games 2022: అదరగొట్టిన భారత్.. ఒకే రోజు ఐదు స్వర్ణాలు..
Also Read
- Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
- India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
ఇక, భారత్ విసిరిన 189 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకోడానికి బ్యాటింగ్ మొదలెట్టిన విండీస్… క్రమంగా వికెట్లు పడిపోవడంతో… ఏ దశలోనూ ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయింది. స్కోర్బోర్డ్పై ఒక్క పరుగు కూడా చేరకుండానే… తొలి ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది… విండీస్. ఐదో ఓవర్లో మరో రెండు వికెట్లు పడ్డాయి. 8వ ఓవర్లో ఒక వికెట్… 12వ ఓవర్లో రెండు వికెట్లు… 13వ ఓవర్లో 2 వికెట్లు పడ్డాయి. ఇక 16వ ఓవర్లో చివరి రెండు వికెట్లు పడటంతో… సరిగ్గా వంద పరుగులకు ఆలౌటైంది… వెస్టిండీస్. మొత్తం నలుగురు బ్యాట్స్మెన్ డకౌటయ్యారు. హెట్మెయిర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి హాఫ్ సెంచరీ బాదినా… అతనికి అండగా ఎవరూ నిలబడకపోవడంతో… విండీస్ ఓటమి ఖాయమైంది. 15.4 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 2.4 ఓవర్లో వేసి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా అక్షర్ పటేల్ ఎంపికవగా… మ్యాన్ఆఫ్ ద సిరీస్ అవార్డ్ అర్హ్దీప్ సింగ్ దక్కించుకున్నాడు. భారత కుర్రాళ్లు. అన్ని ఫార్మాట్లలో కలిపి విండీస్పై భారత్కు ఇది వరుసగా 13వ సిరీస్ విజయం.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!