తాజాగా నిర్వహించిన హెల్త్ సర్వే ఇప్పుడు ఢిల్లీ వాసుల్లో గుబులు రేపుతోంది.. తాజాగా నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో 80 శాతం ఇళ్లలో పలువురు కరోనా లేదా ఫ్లూ జ్వరాల బారిన పడినట్టు తేలింది
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేశాయి.. జులైతో పాటు.. ఈ నెలలో వర్షాలు, వరదలు సృష్టించిన విలయం నుంచి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు బయటపడలేదు.. ఈ సమయంలో.. సముద్రంలో అల్పపీడనం, వాయుగుడం, తుఫాన్ లాంటి పదాలు వినపడితేనే ఉలిక్కిపడుతున్నారు ప్రజలు.. అయితే, ఇప్పుడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం క్రమంగా బలపడుతోంది.. రేపటికి వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావారణ శాఖ అంచనా […]
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్లోని ఖజానాలో రూ.11 కోట్ల విలువైన నాణేలు మాయమైన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.. గురువారం రోజు 25 చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు..
ఇవాళ శ్రీ కృష్ణ జన్మాష్టమి.. ఈరోజు కన్నయ్యని నిష్టగా పూజిస్తే.. సకల పాపాలన్నీ పోయి.. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక రోజున శ్రీకృష్ణుడి దేవాలయాలను ఖచ్చితంగా దర్శించుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల ఎంతో పుణ్య ఫలం దక్కుతుందట. అలాగే మోక్షప్రాప్తి పొందుతారట. సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అనుకున్నది జరగాలంటే శ్రీకృష్ణుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. ఇక, శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఈ స్తోత్ర […]
* నేడు తిరుపతిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన.. స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో దివంగత రాస్ మునిరత్సం విగ్రహావిష్కరణ, మహాత్మగాంధీ ఆత్మకథ సత్యశోధన పుస్తకావిష్కరణలో పాల్గొననున్న సీజేఐ * ప్రకాశం : మార్కాపురం మండలం రాయవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి. * ప్రకాశం : కనిగిరి మున్సిపాలిటీ 9వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే […]
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో లీక్ ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది… అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అంటూ టీడీపీ ప్రచారం చేస్తున్న లేఖ ఒరిజనల్ కాదని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ స్పష్టం చేయడంతో మరోసారి దీనిపై చర్చ తెరపైకి వచ్చింది.. దీనిపై ఏపీ సీఐడీ పెట్టిన మెయిల్ కు సంబంధిత ల్యాబ్ నుంచి వివరణ వచ్చిందని చెబుతున్నారు.. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… ఎంపీ […]
ఎప్పటికప్పుడు మతంతో సంబంధం లేకుండా కొత్తగా తానే దైవం అంటూ.. బాబాలు, అమ్మవార్లు, అయ్యగార్లు.. ఇలా ఎంతో మంది పుట్టుకొస్తుంటారు.. ప్రజల వీక్నెస్ను ఆసరాగా చేసుకుని పంబం గడిపేస్తుంటారు.. చాలా మంది జేబులకు చిల్లు పడేవరకు అసలు విషయం తెలియదు.. ఆ తర్వాత ఆయ్యో మోసపోయామే అని గొల్లు మంటారు.. ప్రభుత్వం, విజ్ఞాన వేదికలు, పలు స్వచ్ఛంద సంస్థలు.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నా.. ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా, తమిళనాడులో మరో మహిళ కొత్త […]
కొన్ని దేశాలు జనాభా పెరిగిపోతుందని ఆందోళన చెందుతుంటే.. మరికొన్ని దేశాలు జనాభా తగ్గిపోతుందని అప్రమత్తం అవుతున్నాయి.. జనాభా తగ్గిపోతుండటంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన చెందుతున్నాడు. అందుకే జనాభా పెంచేందుకు ఓ వినూత్న పథకాన్ని తీసుకొచ్చారు.. కొత్త స్కీమ్ ప్రకారం పది మంది పిల్లల్ని కనడం, వారిని బతికించగలిగితే.. ఆ తల్లులకు ఒకేసారి 13,500 పౌండ్లు అంటే.. భారత కరెన్సీ ప్రకారం రూ.13 లక్షల సాయం అందిస్తామని ప్రకటించారు.. “వీర మాతృమూర్తి” -“ఆదర్శ మాత” పథకాన్ని ప్రవేశపెట్టారు […]
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్పై మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లుబోయిన వేణు.. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాడు అమరావతి గ్రాఫిక్స్ సృష్టించారు.. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై గ్రాఫిక్స్ చేయిస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్పై ఆయన స్పందిస్తూ… నాలుగు రోజుల్లో నిజాలు బయటకు వస్తాయి.. గ్రాఫిక్స్ చేసింది ఎవరో బయటపడుతుందన్నారు.. ఇక, ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని […]