Weather Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మళ్లీ వర్షాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేశాయి.. జులైతో పాటు.. ఈ నెలలో వర్షాలు, వరదలు సృష్టించిన విలయం నుంచి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు బయటపడలేదు.. ఈ సమయంలో.. సముద్రంలో అల్పపీడనం, వాయుగుడం, తుఫాన్ లాంటి పదాలు వినపడితేనే ఉలిక్కిపడుతున్నారు ప్రజలు.. అయితే, ఇప్పుడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం క్రమంగా బలపడుతోంది.. రేపటికి వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావారణ శాఖ అంచనా వేస్తోంది.. ఆ తర్వాత ఉత్తర ఒడిషా , జార్ఖండ్ వైపు వాయుగుండం పయనిస్తుందని.. దాని ప్రభావంతో.. ఇవాళ రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ప్రకటించింది. ఇక, వాయుగుండం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై స్వల్పమే అని పేర్కొంది తుఫాన్ హెచ్చరికల కేంద్రం.
Read Also: Boris Johnson: రేసులో ఉంటే మళ్లీ బోరిస్ జాన్సనే ప్రధాని!
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
అయితే, ఈ వాయుగుండం రాబోయే రెండు రోజుల్లో ఉత్తర కోస్తాపై కొంతమేర ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఉరుములు, మెరుపులతోనూ వానలు పడుతాయంటున్నారు. వర్షం ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది . ఇక, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రాయలసీమలో రెండు రోజుల పాటూ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ.
సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉన్న తుఫానుతో కూడిన అల్పపీడన ప్రాంతం కొనసాగుతుందని తెలిపింది ఐఎండీ.. ఇది వచ్చే ఆరు గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. వాయువ్య దిశగా కదులుతూ, ఉదయం ఉత్తర బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ తీరాల మీదుగా అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత గంగానది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మరియు ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి కొమొరిన్ ప్రాంతం వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు రాయలసీమ నుండి కొమొరిన్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర్భాగం మీదుగా సాగుతుందని మరియు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ వరకు విస్తరించి ఉందని పేర్కొంది.
తాజావార్తలు
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!