Weather Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మళ్లీ వర్షాలు..!
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేశాయి.. జులైతో పాటు.. ఈ నెలలో వర్షాలు, వరదలు సృష్టించిన విలయం నుంచి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు బయటపడలేదు.. ఈ సమయంలో.. సముద్రంలో అల్పపీడనం, వాయుగుడం, తుఫాన్ లాంటి పదాలు వినపడితేనే ఉలిక్కిపడుతున్నారు ప్రజలు.. అయితే, ఇప్పుడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం క్రమంగా బలపడుతోంది.. రేపటికి వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావారణ శాఖ అంచనా వేస్తోంది.. ఆ తర్వాత ఉత్తర ఒడిషా , జార్ఖండ్ వైపు వాయుగుండం పయనిస్తుందని.. దాని ప్రభావంతో.. ఇవాళ రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ప్రకటించింది. ఇక, వాయుగుండం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై స్వల్పమే అని పేర్కొంది తుఫాన్ హెచ్చరికల కేంద్రం.
Read Also: Boris Johnson: రేసులో ఉంటే మళ్లీ బోరిస్ జాన్సనే ప్రధాని!
Also Read
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అయితే, ఈ వాయుగుండం రాబోయే రెండు రోజుల్లో ఉత్తర కోస్తాపై కొంతమేర ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఉరుములు, మెరుపులతోనూ వానలు పడుతాయంటున్నారు. వర్షం ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది . ఇక, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రాయలసీమలో రెండు రోజుల పాటూ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ.
సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉన్న తుఫానుతో కూడిన అల్పపీడన ప్రాంతం కొనసాగుతుందని తెలిపింది ఐఎండీ.. ఇది వచ్చే ఆరు గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. వాయువ్య దిశగా కదులుతూ, ఉదయం ఉత్తర బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ తీరాల మీదుగా అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత గంగానది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మరియు ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి కొమొరిన్ ప్రాంతం వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు రాయలసీమ నుండి కొమొరిన్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర్భాగం మీదుగా సాగుతుందని మరియు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ వరకు విస్తరించి ఉందని పేర్కొంది.
తాజావార్తలు
-
Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
-
Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?
-
Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
-
Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
-
KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!